జై భీమ్ సినిమా తమిళంలో ఎంత పెద్ద హిట్ కొట్టిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో లాయర్ పాత్రలో నటించిన సూర్యకి ఎంత పేరు వచ్చిందో చిన్న తల్లి పాత్ర పోషించిన లిజోమోల్ జోసీ కి అంతకంటే ఎక్కువ పేరు వచ్చింది.
అయితే ఆమె భర్త రాజకన్ను పాత్రలో నటించిన మణికంఠన్ కూడా తన నటన విశ్వరూపం చూపించాడు. ఈ సినిమాలో ఈ చిత్రంలో వీరిద్దరూ ఆదివాసి దంపతులుగా నటించారు. ఈ సినిమాతో ఒక్కసారిగా స్టార్ హోదా దక్కించుకున్నారు. తమిళంలో ట్రెండ్ సెట్ చేసిన వాళ్ళు ఇద్దరు ఇప్పుడు తెలుగులో కూడా ట్రెండ్ సెట్టర్ గా మారుతున్నారు.

లిజోమోర్ జోసి తెలుగులో ఒరే బామ్మర్ది సినిమాతో అందరినీ అలరించిన విషయం తెలిసినదే. ప్రస్తుతం ఆమె కోలీవుడ్ లో అక్కడి ప్రముఖ స్టార్ నటుడు శశి కుమార్ కి జోడిగా ఒక సినిమా చేయబోతుంది. ఈమెకు అది బిగ్ ఆఫర్ అని చెప్పాలి. ఫ్రీడమ్ అనే మూవీతో మరొకసారి ఆమె తెలుగులోకి రాబోతుంది స్వతంత్ర పోరాటం నేపథ్యంలో సాగే పిరియాడికల్ సినిమా ఇది.

ఈ సినిమా ఫ్యాన్ ఇండియా రేంజ్ లో విడుదల కాబోతుంది, జిబ్రాన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. అయితే ఈ సినిమా హీరో శశి కుమార్ కేవలం నటుడు మాత్రమే కాదు మంచి దర్శకుడు, నిర్మాత. గతంలో ఈయన కోలీవుడ్ లో సుబ్రమణిపురం, నాడోడిగల్, సుందర పాండియన్ వంటి చిత్రాలతో భారీ విజయాన్ని అందుకున్నాడు. ఇక మణికంఠన్ విషయానికి వస్తే గుడ్ నైట్ సినిమా ద్వారా ఓటిటి ప్రేక్షకులను ఎంతగానో అలరించాడు.

నిద్రలో గురక పెడుతూ మిత్రులను ఇబ్బంది పెట్టే పాత్రలో ఆయన జీవించేసారని చెప్పాలి. ఈ చిత్రంలో మోటర్ మోహన్ గా ప్రేక్షకులను నవ్వించడమే కాకుండా ఎమోషనల్ సీన్స్ తో ఏడిపించేసాడు కూడా. అలాగే బేబీ నిర్మాత ఎస్ కే ఎన్ తెలుగులో విడుదల చేసిన ట్రూ లవర్ సినిమాలో మణికంఠన్ తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యాడు. భవిష్యత్తులో ఈయన సినిమాలకు కూడా తెలుగులో మార్కెట్ ఉండే అవకాశం ఉంది.









పూజా హెగ్డే గ్లామర్ పాత్రలు చేస్తూనే, మరోవైపు ట్రెడిషనల్ గా కనిపిస్తూ ఆడియెన్స్ ను ఆకట్టుకుంటోంది. టాలీవుడ్ లో వరుస అవకాశాలు పొందుతూ, తక్కువ కాలంలోనే తెలుగులో అగ్ర హీరోయిన్ల లిస్ట్ లో చేరింది. పూజా హెగ్డే దాదాపు టాలీవుడ్ స్టార్ హీరోలందరితో నటించింది. మహేష్ బాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్, ప్రభాస్ వంటి స్టార్ హీరోలతో నటించి ఎన్నో సూపర్ హిట్స్ అందుకుంది. కోలీవుడ్ లో విజయ్ దళపతి బీస్ట్ సినిమాలో నటించింది. బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్. హృతిక్ రోషన్ వంటి హీరోలతో నటించింది.
ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న గుంటూరుకారం సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఇక సినిమాలతో బిజీగా ఉండే ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది. ఇదిలా ఉంటే, అచ్చం పూజా హెగ్డేల కనిపిస్తున్న ఒక అమ్మాయి ఫోటోలు తాజాగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
పూజా హెగ్డేలా కనిపిస్తున్న ఆ అమ్మయి పేరు సవియా గోన్సాల్వేస్. ఆమె ఒక ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్. సవియా గోన్సాల్వేస్ ట్రావెల్, టూరిజం మారియు ఏవియేషన్ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ గా పనిచేస్తున్నారు. ఆమెకు ఇన్స్టాగ్రామ్ లో 80 వేలకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. సవియా గోన్సాల్వేస్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ, నిత్యం తన ఫోటోలను షేర్ చేస్తుంటుంది.





















