ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023 వారం రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ టోర్నీ కోసం క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎంతగానో ఎదురుచూస్తున్నారు. టోర్నమెంట్ లో తొలి మ్యాచ్ ఇంగ్లాండ్, న్యూజిలాండ్ మధ్య అక్టోబర్ 5న జరగబోతుంది.
టీమిండియా 12 సంవత్సరాల తర్వాత స్వదేశంలో ఐసీసీ వన్డే ప్రపంచకప్ ఆడనుంది. 5 సార్లు ఐపీఎల్ విజేత అయిన రోహిత్ శర్మ సారధ్యంలో భారత జట్టు వరల్డ్ కప్ ఆడనుంది. 2011 వన్డే ప్రపంచకప్ విజేత అయిన భారత జట్టు టైటిల్ ఫెవరెట్. అయితే 2011 వన్డే ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ లో రెండు సార్లు టాస్ వేశారట. ఆ వివరాలు ఇప్పడు చూద్దాం..
13వ ఎడిషన్ వన్డే ప్రపంచ కప్ 2023 భారత్ వేదికగా అక్టోబర్ 5 నుంచి మొదలు కానుంది. ఈ నేపథ్యంలో వార్మప్ మ్యాచ్ సెప్టెంబర్ 29న పాకిస్తాన్, న్యూజిలాండ్ మధ్య జరుగనుంది. ఇప్పటికే ఈ మ్యాచ్ కోసం న్యూజిలాండ్ జట్టు ఆటగాళ్లు కొందరు మంగళవారం హైదరాబాద్ చేరుకున్నారు. మిగతా ఆటగాళ్లు బుధవారం రానున్నారు. వీసాలు ఆలస్యం కావడంతో పాకిస్తాన్ ఆటగాళ్లు బుధవారం రాత్రి హైదరాబాద్ చేరుకోనున్నారు. ప్రపంచ కప్ లో పాల్గొనడానికి వచ్చే జట్లకు కావాల్సిన వసతిని బీసీసీఐ అధికారులు ఏర్పాటు చేశారు.
వన్డే ప్రపంచ కప్ టోర్నీలో 10 జట్లు పోటీపడబోతున్నాయి. ఆయా దేశాల క్రికెట్ బోర్డులు వారి జట్లని ఇప్పటికే ప్రకటించారు. ఈ క్రమంలో గతంలో జరిగిన ప్రపంచ కప్ టోర్నీల విశేషాలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. అలా 2011 వరల్డ్ కప్ లో 2 సార్లు టాస్ వేసారనే విషయం వార్తల్లో నిలిచింది.
2011 వన్డే ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్లో టీమిండియా శ్రీలంకను ఓడించి రెండవ వన్డే వరల్డ్ కప్ ను సాధించింది. ఈ ఫైనల్ మ్యాచ్లో శ్రీలంక టాస్ గెలిచి, ముందుగా బ్యాటింగ్ కు దిగింది. అయితే ఫైనల్ మ్యాచ్ కి రిఫరీగా ఉన్న జెఫ్ క్రోనీ, టాస్ వేసే సమయంలో శ్రీలంక సారధి సంగర్కర హెడ్ అని చెప్పగా, ఫ్యాన్స్ అరుపుల వల్ల అది వినలేకపోయాడు. హెడ్ పడడంతో టాస్ గెలిచిన సంగర్కర, బ్యాటింగ్ ఎంచుకుంటానని అన్నారట.
కానీ రిఫరీ జెఫ్ క్రోనీ, సంగర్కర చెప్పింది వినబడలేదని, రెండవసారి టాస్ వేయాల్సిందిగా చెప్పారంట. అందుకు భారత కెప్టెన్ ధోనీ కూడా అంగీకరించడంతో రెండోసారి టాస్ వేశారు. అప్పుడు కూడా సంగర్కర హెడ్ అని చెప్పగా, హెడ్ పడడంతో శ్రీలంక టాస్ గెలిచి, ముందుగా బ్యాటింగ్ చేసింది. ఇక ఈ మ్యాచ్ లో భారత జట్టు శ్రీలంకను ఓడించి, 28 సంవత్సరాల తర్వాత వన్డే ప్రపంచ కప్ సాధించింది.
Also Read: “విరాట్ కోహ్లీ” జాతకం ప్రకారం… ఈ సారి ఇండియా “వరల్డ్ కప్” గెలుస్తుందా..?

2018 (అందరూ హీరోలే) ఈ చిత్రం ఎమోషనల్ సర్వైవల్ స్టోరీ. 2018లో కేరళలో వచ్చిన వరదల నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. 2018లో కేరళ చరిత్రలోనే అత్యంత దారుణమైన వరదలు వచ్చాయి. వరదల వల్ల ప్రత్యక్షంగా బాధలు అనుభవించిన ప్రజలు, దాని బారిన పడిన వారు ఇప్పటికీ ఆ గాయాల భరిస్తున్నారు. కొందరు ప్రాణాలు, మరికొందరు ఇళ్లు, మరికొందరు జీవనోపాధి కోల్పోయారు. అయినా మానవత్వంతో అందరూ కలిసి ఈ కష్టం నుండి బయటపడ్డానికి సహాయం చేయడానికి చేతులు కలిపారు.
ఇదే విషయాన్ని దర్శకుడు జూడ్ ఆంథనీ జోసెఫ్, 2018 లో చూపించే ప్రయత్నం చేసారు. ఈ మూవీ కథ అరువిక్కుళం అనే గ్రామంలో మొదలవుతుంది. ఫేక్ మెడికల్ సర్టిఫికేట్ చూపించి ఆర్మీని వదిలి, దుబాయ్కి వెళ్లి బ్రతకలనుకునే పాత్రలో టొవినో థామస్. లాల్, నారాయణ్, ఆసిఫ్లతో జాలర్ల కుటుంబం. ఒక గర్భిణీ స్త్రీ, అంగ వైకల్యం ఉన్న పిల్లల తల్లిదండ్రులు, ఒక అంధుడు ఇలా అనేక పాత్రలు ఉన్నాయి. నెమ్మదిగా, రాష్ట్రంలో వర్షాలు కురుస్తుండటం. కొన్ని గంటల్లో పరిస్థితి వర్షాలతో కేరళ రాష్రం వరదలతో ముంచెత్తడం.
ఆ క్రమంలో వరదల్లో చిక్కుకుపోయిన వారిని రక్షించడానికి రెస్క్యూ టీమ్ తో పాటు మత్స్యకారులు సాయం చేయడం, స్థానికులు అందించిన సహాయం, హెలికాప్టర్ రెస్క్యూ, దాదాపు ప్రతిదీ, అప్పటి పరిస్థితులను కళ్ళ ముందుకు తెస్తుంది. ఈ చిత్రంలో టోవినో థామస్, లాల్, ఆసిఫ్ అలీ, ఇంద్రన్స్, నరేన్, కుంచకో బోబన్, అపర్ణ బాలమురళి వంటి స్టార్స్ నటించారు. వారి నటన పై ప్రశంసలు కురుస్తున్నాయి.
మే 5 న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మల్టీప్లెక్స్లలో తక్కువగా, చిన్న స్క్రీన్లలో సినిమా మొదటి షో నుండి ప్రదర్శించడం ప్రారంభమైంది. అయితే మౌత్ టాక్ తో సాయంత్రానికి మల్టీప్లెక్స్లు అన్నిట్లోనూ ఈ మూవీ వేశారు. టిక్కెట్లు దొరక్క తిరిగొచ్చిన వారు కూడా చాలా మంది ఉన్నారు. దీనితో కేరళ అంతటా అదనపు షోలు కూడా వేశారు.
దేశ వ్యాప్తంగా హైప్ ఉన్న చిత్రాలలో లియో ఒకటి. ఈ మూవీ కోసం విజయ్ ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అయితే సడెన్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కాన్సిల్ చేయడం కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. అయితే లియో యూనిట్ దీనిపై వివరణ ఇస్తూ, ఈవెంట్ పాస్ లకు విపరీతమైన డిమాండ్ ఉండడం వల్ల వాటిని అందుకోలేకపోతున్నట్టు, ఆడియెన్స్ ఎక్కువగా వస్తారనే అంచనతో కంట్రోల్ చేయడం కష్టంగా అనిపిస్తోందని, అందువల్లే ఈవెంట్ ను క్యాన్సిల్ చేస్తున్నట్టు చెప్పారు.
ఫ్యాన్స్ కోరిక మేరకు అప్డేట్లు ఇస్తూనే ఉంటాం. అందరూ ఊహిస్తున్నట్టుగా మా పై ఏ పార్టీ ఒత్తిడీ లేదు. అని వివరణ ఇచ్చింది. ఈ వివరణ పై నెట్టింట్లో ట్రోల్స్ మొదలైపోయింది. ఈ రిజన్స్ ఫ్యాన్స్ కోపాన్ని చల్లార్చడం లేదు. ఈవెంట్ సడెన్ గా క్యాన్సిల్ కావడంతో పలు సందేహాలు ఉన్నాయని మండిపడుతున్నారు.
తమిళనాడు సీఎం స్టాలిన్ కుమారుడు హీరో ఉదయనిధికి చెందిన రెడ్ జాయింట్ కు లియో పంపిణి రైట్స్ ఇవ్వకపోవడం వల్లే ఉద్దేశపూర్వకంగా పర్మిషన్స్ రాకుండా చేశారని టాక్. ప్రతీ మూవీలోషేర్, లేదా ప్రధానమైన ఏరియా రైట్స్ ను అడుగుతున్నారట. తమ కంపెనీకి రైట్స్ ఇవ్వని చిత్రాలను ఏదో విధంగా వేధింపులకు గురి చేస్తున్నాడని చర్చించుకుంటున్నారు. దేశవ్యాప్తంగా హైప్ ఉన్న ‘లియో’ మూవీకి కేరళలో తీవ్రమైన వ్యతిరేకత వస్తోంది.
రిలీజ్ కు ముందే కేరళ వాసులు, ముఖ్యంగా మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ ఫ్యాన్స్ ‘ లియో ‘ మూవీని బ్యాన్ చేయాలని పిలుపునిచ్చారు. దీనికి కారణం ఏమిటంటే, గతంలో వచ్చిన ‘జిల్లా’ మూవీలో విజయ్ దళపతి, మోహన్లాల్ కలిసి నటించారు. ఈ మూవీ రిలీజ్ అయిన తరువాత మూవీలో మోహన్లాల్ యాక్టింగ్ ను కొందరు విజయ్ ఫ్యాన్స్ ట్రోల్ చేశారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు విజయ్ ‘లియో’ మూవీని కేరళలో రిలీజ్ చేయనివ్వమని మోహన్ లాల్ ఫ్యాన్స్ అంటున్నారు. ఈ నేపథ్యంలో విజయ్ ఫ్యాన్స్ కి, మోహన్ లాల్ ఫ్యాన్స్ నెట్టింట్లో వాగ్వాదానికి దిగారు.
బంగాళదుంపలతో ఫ్యాక్టరీలో చిప్స్ తయారు చేసే ప్రాసెస్ కు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో మార్కెట్ నుంచి తెచ్చిన బంగాళదుంపల సంచులు ఓపెన్ చేయడం నుంచి, చిప్స్ ప్యాకింగ్ వరకు మొత్తం ప్రాసెస్ ను చూపించారు. అనికైత్ లూత్రా అనే యూజర్ ఇన్స్టాగ్రామ్లో ఈ వీడియోను షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో విపరీతంగా వైరల్ అవుతోంది.
ఈ వీడియోలో కార్మికులు బంగాళాదుంపల సంచులను మెషిన్లలో వేస్తుంటారు. అక్కడి నుంచి మరో మెషీన్ లోకి వెళ్లిన బంగాళాదుంపలు, నీటిలో శుభ్రమవుతాయి. ఆ తరువాత మరో మెషీన్ లోకి వెళ్లడంతో అక్కడ దుంపల తొక్కలు తొలగిపోతాయి. ఆ తరువాత చిప్స్ ఆకారంలో బంగాళాదుంపలను కట్ చేసి మరుగుతున్న వేడి నూనెలో వేస్తారు.
ఇలా రెడీ అయిన చిప్స్ ను చివరకు ప్యాకింగ్ దగ్గరకు వెళ్తాయి. అక్కడున్నవారు ఆ చిప్స్ ను ప్యాక్ చేసి, బాక్సులలో పెట్టి, షాప్స్ కు పంపించడానికి సిద్ధం చేస్తారు. ఈ వీడియో పై నెటిజన్లు రక రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియో 6లక్షలకు పైగా లైక్లను పొందింది.
స్వాతంత్ర్య సమరంలో చంద్రశేఖర్ ఆజాద్, భగత్ సింగ్ సహచరులను లాహోర్ కుట్రకేసులో ఈ జైలుకు ఖైదీలుగా తరలించారు. స్వాతంత్య్రం వచ్చిన అనంతరం వివిధ ఉద్యమాలకు లీడర్ గా ఉన్నవారిని కూడా ఈ జైలులో ఖైదీలుగా ఉంచారు. రాజమండ్రి సెంట్రల్ జైలు వైశాల్యం పరంగా దేశంలో 4వ పెద్ద జైలు. ఇది 212 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. దీనిలో 39.02 ఎకరాల్లో జైలు నిర్మించారు. అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే విధంగా సెంట్రల్ జైలును నిర్మించారు.
ఈ జైలులో దాదాపు 3 వేల మంది ఖైదీలను ఉంచడానికి కావాల్సిన సౌకర్యాలు ఉన్నాయి. 2015లో ఏపీకి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న టైమ్ లో రాజమండ్రి సెంట్రల్ జైలుని ఆధునీకరించారు. రీసెంట్ గా చంద్రబాబు నాయుడుతో ములాఖత్కు వెళ్ళిన ఆయన సతీమణి భువనేశ్వరి బయటికి వచ్చిన తరువాత ‘‘ఆయన నిర్మించిన బ్లాకులోనే ఆయనను ఖైదీగా ఉంచారు’’ అని వాపోయారు.
ఇక ఈ జైలులో చంద్రబాబు నాయుడు మాత్రమే కాకుండా మరో ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా ఖైదీలుగా ఉన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి రెండుసార్లు ముఖ్యమంత్రిగా ఎన్నికైన మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ఉద్యమ సమయంలో ఈ జైలులో కొంతకాలం ఉన్నారు. అయితే, ఆయన సీఎం కాక ముందు జైలుకు వెళ్లారు. ఆంధ్ర రాష్ట్రానికి సీఎంగా ఉన్న టంగుటూరి ప్రకాశం పంతులు ఈ జైలులో కొద్ది రోజులు ఉన్నారు. బ్రిటిష్ గవర్నమెంట్ ఆదేశాలను ధిక్కరించి స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొని జైలుకి వెళ్ళారు. ప్రకాశం పంతులు కూడా సీఎం కాక ముందు జైలుకు వెళ్లారు.
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ఈ మూవీ ముందువరకు అగ్రెసివ్ యంగ్ హీరోగా, లవర్ బాయ్ లా కనిపించారు. కానీ ఈ చిత్రంలో కంప్లీట్ డిఫరెంట్ విశ్వక్ సేన్ కనిపిస్తాడు. ఫలక్నుమా దాస్, రాజా వారు రాణి గారు సినిమాలకు సినిమాటోగ్రాఫర్గా వర్క్ చేసిన విద్యాసాగర్ చింత అశోకవనంలో అర్జున కల్యాణం సినిమాకి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో నటించిన నటీ నటుల నటన ఆడియెన్స్ ని ఆకట్టుకున్నాయి.
ఈ మూవీలో ఫోటోగ్రాఫర్ గా నటించిన యాక్టర్ పేరు రాజ్కుమార్ కసిరెడ్డి. పలు తెలుగు సినిమాలలో నటించారు. రాజ్కుమార్ 1992లో జనవరి 12న జన్మించారు. నటన పై ఉన్న ఆసక్తితో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన రాజ్కుమార్ కెరీర్ 2019 లో రాజా వారు రాణి గారు మూవీతో ప్రారంభం అయ్యింది. ఈ మూవీలో చౌదరి క్యారెక్టర్ లో నటించి, గుర్తింపు సంపాదించుకున్నాడు. ఆ తరువాత ఫలక్నుమా దాస్ లో నటించారు.
ఆ తరువాత వరుసగా అవకాశాలు వచ్చాయి. అలా రాజ్కుమార్ బ్లడీమేరీ, రంగరంగ వైభవంగా, స్టాండప్ రాహుల్, అర్జున ఫల్గుణ, సీతా రామం, చిత్తం మహారాణి, బెదురులంక 2012, రంగబలి వంటి సినిమాలలో నటించి, అలరించారు. సైమా 2023 అవార్డ్స్ లో ఉత్తమ కామెడీ నటుడు కేటగిరీలో రాజ్కుమార్ కసిరెడ్డి అశోకవనంలో అర్జున కల్యాణం సినిమాకి నామినేట్ అయ్యారు. దుల్కర్ సల్మాన్ నటించబోయే లక్కీ భాస్కర్ మూవీలో కూడా నటిస్తున్నారు.
బాహుబలి సినిమా అంతర్జాతీయంగా పలు దేశాలలో సంచలన విజయాన్ని అందుకుంది. రాజమౌళి దర్శకత్వం వహించగా, నిర్మాత శోభు యార్లగడ్డ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఈ సినిమాలో విలన్ గా రానా దగ్గుబాటి నటించారు. హీరోయిన్లుగా అనుష్క, తమన్నా నటించారు. ఈ చిత్రం రెండు భాగాలుగా రిలీజ్ అయ్యి, సంచలన విజయాన్ని అందుకుంది. ఈ చిత్రం రిలీజ్ అయిన అన్ని భాషల్లో కూడా సెన్సేషనల్ హిట్ సాధించింది. దాదాపు 1500 కోట్ల కలెక్షన్లు వసూలు చేసి సరికొత్త రికార్డ్ ను నమోదు చేసింది.
ఈ మూవీతో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా మారడమే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో పాపులర్ అయ్యారు. ఈ మూవీకి వచ్చిన క్రేజ్ ను దృష్టిలో ఉంచుకుని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ప్రభాస్ ‘బాహుబలి’ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అయితే తాజాగా మైసూర్ లోని ఒక మ్యూజియంలో ఏర్పాటు చేసిన ‘బాహుబలి’ మైనపు బొమ్మకు సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ గా మారాయి. ఈ ‘బాహుబలి’ విగ్రహంలో ప్రభాస్ పొలికలు లేకపోవడంతో ఫ్యాన్స్, నెటిజన్లు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు.
ట్రోలింగ్ నేపథ్యంలో ఈ విగ్రహం పై నిర్మాత శోభు యార్లగడ్డ ట్వీట్ చేశారు. అందులో “ఇది అధికారికంగా లైసెన్స్ తీసుకుని చేసిన పని కాదు. మా అనుమతి లేకుండా చేశారు. దీన్ని తొలగించేందుకు వెంటనే చర్యలు తీసుకుంటాం” అని రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ గా మారింది.
ప్రస్తుత కాలంలో ఎవరు, ఎప్పుడు సెలెబ్రెటీగా మారుతారో చెప్పలేము. సోషల్ మీడియా ప్రస్తుతం పాపులర్ అవ్వడానికి ఒక మార్గంగా మారిందని చెప్పవచ్చు. ఫేమస్ అవడానికి చిన్న,పెద్ద అనే తేడా లేకుండా రకరకాల వీడియోలు తీస్తూ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఎవరికి కున్న ప్రతిభను వారు వీడియోల ద్వారా వెలుగులోకి తీసుకొస్తున్నారు. కొందరు ఫ్రెండ్స్ తో కలిసి ఫన్నీ వీడియోలు, కొందరు, వంటల వీడియోలు, పాటలు పాడినావి, డ్యాన్స్ వీడివలు పెడుతున్నారు.
కొందరు వారి వీడియోలను ట్రోల్ చేయడం వల్ల కూడా ఫేమస్ అవుతున్నారు. మరికొందరు వేరే వారు పాడుతుండగా వీడియో తీసి నెట్టింట్లో షేర్ చేస్తున్నారు. అలా షేర్ చేయడంతో చాలామంది పాపులర్ అవుతున్నారు. రైల్వే స్టేషన్లో పాట పాడే రాను మోండల్ పాటలు పాడుతూ జీవిస్తున్న ఆమె వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది వైరల్ గా మారడంతో ఓవర్ నైట్ లో ఫేమస్ అయ్యి, సెలబ్రిటీగా మారింది. బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ హిమేష్ రేష్మియాతో కలిసి పని చేసే అవకాశం పొందింది.
తాజాగా ఒక క్లాసికల్ డ్యాన్స్ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది. ఆ వీడియోలో నృత్యం చేసిన డ్యాన్సర్ అభినయానికి, డ్యాన్స్ కి నెటిజెన్లు ఫిదా అవుతున్నారు. లెజెండ్స్_స్టూడియో అనే ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసిన వీడియోలో క్లాసికల్ డ్యాన్సర్ శ్రియా హనుమంతు హవభావాలు, నృత్యం అందరినీ ఆకట్టుకుంటోంది. ఆమె నిష్రింకలా డ్యాన్స్ అకాడమీలో క్లాసికల్ డ్యాన్స్ లో శిక్షణ పొందింది. శ్రియా హనుమంతు ఈ ఏడాది ఏప్రిల్ 30న తొలిసారి అధికారిక సోలో ప్రదర్శనను ఇచ్చారు. ఇన్ స్టాగ్రామ్ లో ఆమె నాట్యాన్ని అభినందిస్తూ నెటిజెన్లు కామెంట్స్ చేస్తున్నారు.
సెప్టెంబర్ 20న ఆ ఊరిలో వినాయక నిమజ్జనం చేస్తున్న సమయంలో ఒక బావిలో భవ్యశ్రీ మృతదేహం కనిపించింది. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని వెలికి తీసి, పోస్టుమార్టం కోసం చిత్తూరు గవర్నమెంట్ హాస్పటల్ కు తరలించారు. పోలీసులు ఫోరెన్సిక్ రిపోర్ట్ ఆధారంగా దర్యాప్తు జరుపుతున్నారు. ఈ కేసులో ఇప్పటివరకు నలుగురు యువకులను కస్టడీలోకి తీసుకొని విచారణ చేస్తున్నారు.
అయితే పోస్టుమార్టంలో బాధితురాలి శరీరం పై ఎటువంటి గాయాలు లేవనే విషయం ప్రాథమికంగా తెలిసినట్టు ఎస్ఐ అనిల్కుమార్ వెల్లడించారు. ఆమె పై అఘాయిత్యం కానీ, విషప్రయోగం కానీ, జరిగిందా అనేది పరీక్షించడానికి సాంపిల్స్ ను తీసుకున్నట్లు వెల్లడించారు. బావిలో మునిగి ఊపిరాడక మరణించిందా? లేదా వేరే ఎక్కడైనా చంపి, ఆమె మృతదేహాన్ని తెచ్చి బావిలో పడేశారా అనే విషయం నిర్ధారించడం కోసం స్టెరమ్బోన్ సాంపిల్స్ను సేకరించి కెమికల్ అనాలసిస్ చేయడం కోసం తిరుపతి ఆర్ఎఫ్ఎస్ఎల్కు పంపిస్తున్నట్లుగా వెల్లడించారు.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో తండ్రి బెడ్ పై కూర్చుని టీవీ చూస్తున్నాడు. అదే సమయంలో కుమారుడు తండ్రి కూర్చున్న బెడ్ పక్కనే నేల మీద కూర్చుని అతను చేసిన పనికి ఎవరైనా నవ్వకుండా ఉండలేరు. తండ్రి టీవీ చూడడంలో నిమగ్నం కావడంతో, కుమారుడు మద్యం బాటిల్, ఒక గ్లాసు తీసుకుని బెడ్ పక్కనే కూర్చుని, గ్లాస్ లో మద్యం పోస్తున్నాడు. అయితే కుమారుడు చేస్తున్న పనిని ఆ తండ్రి గమనిస్తూ ఉంటాడు. అయితే ఆ కొడుకు తాగుబోతు అని అనుకునే ఛాన్స్ ఉంది. వాస్తవానికి అతనికి మద్యం తాగే అలవాటు లేదట. సరదాగా ఆ వీడియో చేస్తున్నట్లు వెల్లడించాడు.
ఈ ఫన్నీ వీడియోను ఇన్స్టాగ్రామ్లో ఎస్ఎస్_కింగ్ 746 పేరుతో ఉన్న అకౌంట్ లో వారం క్రితం షేర్ చేశారు. ఇప్పటివరకు ఈ వీడియోకి 14 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. అదే టైమ్ లో ఈ వీడియోను 14 లక్షల మంది లైక్ చేసారు. నెటిజెన్లు ఈ వీడియోకి రకరకాలుగా ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ఒక నెటిజెన్ ‘అన్నయ్యా నిమిషం లేట్ అయితే మీ తండ్రి కూడా వాటాకి వచ్చేస్తారు‘ అంటూ కామెంట్ చేశారు. ‘అన్నయ్యా ఒంటరిగా డ్రింక్ చేస్తే నాన్నకి కోపం వస్తుంది’ అంటూ మరో నెటిజెన్ కామెంట్ చేశారు.