యంగ్ హీరో రామ్ పోతినేని, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం ‘స్కంద’. ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ సెప్టెంబర్ 15న రిలీజ్ కాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించారు.
ఈ ఈవెంట్ లో మేకర్స్ స్కంద మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. బోయపాటి శీను సినిమా పై ఉండే అంచనాలు తగ్గకుండా మాస్ గా చూపించారు. ఇస్మార్ట్ శంకర్ మూవీకి భిన్నంగా హీరో రామ్ ఎనర్జీ నెక్స్ట్ రేంజ్ లో చూపించారు. అయితే స్కంద మూవీలోని ఒక సీన్ వార్తలోకి ఎక్కింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
రామ్ పోతినేని, శ్రీలీల జంటగా నటిస్తున్న చిత్రం స్కంద. ఈ సినిమాకి బోయపాటి శ్రీను దర్శకత్వం వహించారు. తాజాగా ఈ మూవీ ప్రీ రిలీజ్వేడుకను నిర్వహించారు. ఈ వేడుకకు నట సింహం నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరై సందడి చేశారు. ఈ ఈవెంట్ లో స్కంద ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఇది ఎప్పటిలానే బోయపాటి శైలిలో ఊరమాస్ గా తెరకెక్కింది.
హీరో రామ్ ను పవర్ ఫుల్ మాస్ హీరోగా చూపించారు. పవర్ ఫుల్ డైలాగ్స్, యాక్షన్ బ్లాక్స్ తో ట్రైలర్ ను కట్ చేశారు. రామ్ పోతినేని గెడ్డంతో రఫ్ లుక్ లో ఉండగా, ఈ మూవి కూడా రెండు ఫ్యామిల ల మధ్య ఉండే పగ, ప్రతీకారం లాంటి అంశాలతో తెరకెక్కినట్టు తెలుస్తోంది. అయితే స్కంద మూవీలోని ఒక సన్నివేశం వార్తల్లో నిలిచింది.
హీరో రామ్ పోతినేని ఒక మనిషిని ఒక ప్లేట్ తో చంపేస్తాడని అని ఆ సీన్ చూస్తే అర్దం అవుతోంది. దాంతో ఆ సీన్ కు సంబంధించిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ, ఇది లాజిక్ లేని సన్నివేశం అంటున్నారు. నెటిజెన్లు ఈ సీన్ ని ట్రోల్ చేస్తున్నారు. ప్లేట్ తో చంపి ఆ రక్తంతో అభిషేకం అని ఒకరు కామెంట్ చేశారు.
Also Read: గుప్పెడంత మనసు సీరియల్ “జగతి” ఇప్పుడు ఎలా మారిపోయిందో చూశారా..? దీనికి కారణం ఏంటంటే..?

గుప్పెడంత మనసు సీరియల్ కు ఎంత పాపులారిటి ఉందో అందరికీ తెలిసిన విషయమే. ఈ సీరియల్ లో హీరోహీరోయిన్ల క్యారక్టర్ల తరువాత ఎక్కువ పేరు, గుర్తింపు వచ్చిన పాత్ర జగతి. ఆ పాత్ర యొక్క కట్టు, బొట్టుకి ఆమెకు ఎంతోమంది ఫ్యాన్స్ అయ్యారు. ఆమె నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ పాత్రను పోషించిన నటి పేరు జ్యోతి రాయ్. అయితే సీరియల్ అంత ట్రెడిషనల్ గా ఉండే జ్యోతి సోషల్ మీడియాలో మాత్రం గ్లామరస్ ఫోటోలతో, వీడియోలతో హల్చల్ చేస్తోంది. ఆమె ఫోటోలు షేర్ చేసిన కాసేపటికే వైరల్ గా మారుతుంటాయి.
జ్యోతి రాయ్ వయసు 38 ఏళ్లు. ఆమెకు పిల్లలు కూడా ఉన్నారు. ఇటీవల జ్యోతి తన భర్తకి డైవర్స్ ఇచ్చిందని, యువ దర్శకుడిని రెండవ వివాహం చేసుకుందని కొన్నిరోజుల క్రితం వార్తలు వచ్చాయి. అయితే వీటి పై జ్యోతి రాయ్ ఘాటుగా స్పందించింది. “మీకు అర్థంకాని విషయం పై విమర్శలు చేయకండి. ఎప్పటికీ మీరు నా లైఫ్ లోకి వచ్చి చూడలేరు, గుర్తుపెట్టుకోండి” అని సోషల్ మీడియాలో కామెంట్ చేసింది.
ఇన్ స్టాగ్రామ్ లో చాలా యాక్టివ్ గా ఉండే జ్యోతి రాయ్ ఇటీవల వరుసగా తన గ్లామరస్ ఫోటోలను, వీడియోలను షేర్ చేస్తోంది. అవి సోషల్ మీడియాలో వైరల్ అవడంతో నెటిజెన్లు, జ్యోతి రాయ్ పై మీమ్స్, ట్రోల్స్ చేస్తున్నారు. ‘హీరోయిన్ అవ్వాల్సిన క్యారెక్టర్ ని సీరియల్ లో తల్లి పాత్ర చేసారు కదా రా’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ప్రముఖ మలేసియా బిజినెస్ టైకూన్ ఖూ కే పెంగ్ మరియు మాజీ మిస్ మలేసియా అయిన పాలైన్ ఛాయ్ ల కూతురు ఏంజెలినా ఫ్రాన్సిస్. ఆమె ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకుంది. ఆ సమయంలోనే ఆమె జెడియా అనే ఫ్రెండ్ ని ప్రేమించింది. వారు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న తరువాత ఏంజెలినా తన తల్లిదండ్రులకు ప్రేమ విషయాన్ని తెలిపింది. అయితే ఆమె తల్లిదండ్రులు వారి పెళ్ళికి నిరాకరించారు.
ఆర్థికపరంగా ఇద్దరి కుటుంబాల్లో చాలా తేడా ఉండడంతో వారు ప్రేమించిన వాడికి దూరం కావడమో లేదా కుటుంబ వారసత్వాన్ని వదులుకోవడమో రెండిటింటిలో ఏదో ఒకటి నిర్ణయించుకోమని ఆదేశించారు. అయితే ఏంజెలినా ప్రేమించినవాడితో జీవితం పంచుకోవడం కోసం ఇంట్లో నుంచి బయటకు వచ్చేసి, 2008లో పెళ్లి చేసుకొని తాను కోరుకున్నవాడితో కొత్త లైఫ్ ను మొదలుపెట్టింది. ఈ క్రమంలో మేకు వారసత్వంగా రావలసిన దాదాపు రెండు వేల కోట్ల ఆస్తినీ వదిలేసింది.
పెళ్లి తరువాత ఇద్దరు కూడా కూడా ఇరు కుటుంబాలకు దూరంగా ఉంటూ వచ్చారు. కానీ, చాలారోజులు తరువాత ఏంజెలినా తన పేరెంట్స్ ను కలవాల్సి వచ్చింది. దానికి కారణం ఏంజెలినా తల్లిదండ్రులు డైవర్స్ తీసుకున్నారు. కోర్టులో వాంగ్మూలం ఇవ్వడానికి ఆమె కోర్టుకు వెళ్లింది. తన తల్లి పాలైన్ ఛాయ్ గురించి గొప్పగా చెప్పిన ఆమె తండ్రిపై విమర్శలు చేసింది. ప్రస్తుతం ఏంజెలినా లవ్ స్టోరీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మహేష్ బాబు హీరోగా నటించిన ‘ఒక్కడు’ మూవీ 2003లో సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 15న రిలీజ్ అయ్యి, ఊహించని విధంగా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. మహేష్ కి మాస్ ఇమేజ్ వచ్చింది ఈ చిత్రంతోనే అనవచ్చు. ఈ చిత్రంలో హీరోయిన్ గా భూమిక చావ్లా నటించగా, విలన్ గా ప్రకాశ్ రాజ్ నటించి, మెప్పించారు.
అయితే ఈ మూవీ హిట్ అవడానికి కారణం స్క్రీన్ ప్లేలో చేసిన మార్పులే అని తెలుస్తోంది. దర్శకుడు గుణశేఖర్ ముందుగా అనుకున్న స్టోరీ ప్రకారంగా, కొండారెడ్డి బురుజు దగ్గర హీరో విలన్ ఓబుల్ రెడ్డిని కొట్టే సన్నివేశమే హీరో ఇంట్రడక్షన్ సీన్ గా రావాలి. ఆ సీన్ తర్వాత స్టోరీ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళుతుందట. అయితే ఈ కథ విన్న రచయిత పరుచూరి గోపాలకృష్ణ ముందుగా ఆ సన్నివేశం పెట్టడం సరి కాదని అన్నారంట.
సినిమా మొదట్లోనే అలాంటి పవర్ ఫుల్ సన్నివేశం పెట్టవద్దని గుణశేఖర్ కు సూచించారంట. దాంతో దర్శకుడు గుణశేఖర్ పరుచూరి గోపాలకృష్ణ చేసిన సూచనల ఆధారంగా కథలో కీలకమైన మార్పులు చేసి, ఇప్పుడు మనం చూస్తున్న సినిమాగా తెరకెక్కించారని తెలుస్తోంది. ఆ మార్పుల వల్లే ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందట.
దక్షిణాది హీరోయిన్లలో నయనతార లేడి సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకుంది. వ్యక్తిగత విషయంలోనూ, సినిమాల విషయంలోనూ ఆమె ఎప్పుడూ తనదైన శైలిలో ముందుకు వెళ్తుంది. ఆమెకు సంబంధించిన విషయం ఏదైనా క్షణాల్లో వైరల్ గా మారుతుంది. అత్యధిక రెన్యుమరేషన్ అందుకుంటున్న హీరోయిన్ గా రికార్డు సృష్టించారు. గత ఏడాది దర్శకుడు విగ్నేష్ శివన్ పెళ్లి చేసుకుని వైవాహిక జీవితం ప్రారంభించిన విషయం తెలిసిందే. సరోగసి ద్వారా కవలలకు తల్లిదండ్రులు అయ్యారు.
ప్రస్తుతం నయనతార బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ హీరోగా నటిస్తున్న జవాన్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ మూవీ ఈ ఏడాది సెప్టెంబర్ 7న రిలీజ్ కానుంది. ఇది ఇలా ఉంటే నయనతార గతంలో నటించిన ఒక ప్రకటనకు సంబంధించిన వీడియో నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. ఈ యాడ్ లో ఆమె గుర్తుపట్టలేనట్టుగా ఉంది. ఆమె కాలేజీలో చదువుతున్న సమయంలో మోడల్గా పార్ట్ టైమ్ జాబ్ చేసింది. అలా నయనతార నటించిన ప్రకటనలలో కొన్నింటిని చూసిన దర్శకుడు సత్యన్ అంతిక్కడ్ తాను తీయబోయే మనస్సినక్కరే సినిమాలో కీలక పాత్రకోసం ఆమెను సంప్రదించాడు.
మొదట్లో నయనతార ఆఫర్ను రిజెక్ట్ చేసినప్పటికీ, ఆ తరువాత దర్శకుడు వదలకుండా ప్రయత్నించడంతో చివరికి ఆమె అంగీకరించింది. అలా నయనతార 2003లో మలయాళ సినిమా ‘మనస్సినక్కరే’ తో ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ఆ మూవీ హిట్ అవడం, వరుస అవకాశాలు రావడంతో సినిమాలలో నటిస్తూ టాప్ హీరోయిన్ గా ఎదిగింది. ఆమె కాలేజీ రోజుల్లో నటించిన యాడ్ ప్రస్తుతం నెట్టింట్లో షికారు చేస్తోంది.
చంద్రయాన్-3 విజయవంతం అయిన నేపథ్యంలో చంద్రుని పై భూమిని కొనుగోలు చేసే విషయం హాట్ టాపిక్ గా మారింది. ‘లూనార్ రిజిస్ట్రీ’ అనే వెబ్సైట్ ద్వారా చంద్రుని మీద భూమిని కొనుగోలు చేయవచ్చని అంటున్నారు. లూనార్ రిజిస్ట్రీ అధికారిక వెబ్సైట్ కు వెళ్ళి, అక్కడ వారు భూమిని కొనుగోలు చేయాలనుకుంటున్న ప్రాంతాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చని తెలుస్తోంది.
కొందరు సినీ ప్రముఖులకు చందమామ పై ఇప్పటికే భూమి ఉందని తెలుస్తోంది. బాలీవుడ్ టాప్ హీరో షారూఖ్ ఖాన్ 52వ పుట్టినరోజు సందర్భంగా ఆస్ట్రేలియాలోని ఒక అభిమాని చంద్రుని పై భూమిని బహుమతిగా ఇచ్చాడని కొన్నాళ్ల క్రితం షారూఖ్ స్వయంగా వెల్లడించాడు. దివంగత హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్కు ఖగోళ శాస్త్రం పై ఉన్న ఆసక్తితో చంద్రుని పై భూమిని కొనుగోలు చేశాడు. సుశాంత్ కొనుగోలు చేసిన ప్రాంతాన్ని మేర్ ముస్కోవియన్స్ లేదా సీ ఆఫ్ ముస్కోవి అని పిలుస్తారు. సుశాంత్ సింగ్ రాజ్పుత్ చంద్రుడిపై 55 లక్షల విలువైన భూమిని కొనుగోలు చేసారట.
గోదావరిఖనికి చెందిన సింగరేణి ఉద్యోగి కుమార్తె సాయి విజ్ఞత ప్రస్తుతం అమెరికాలో జాబ్ చేస్తోంది. తన తల్లికి గిఫ్ట్ గా చంద్రుడిపై భూమిని ఆమె తల్లి వకుళాదేవి పేరుతో లూనార్ రిజిస్ట్రేషన్ ద్వారా 2022లో అప్లై చేసింది. అది సరిగ్గా ఆగస్టు 23న అంటే చంద్రయాన్ 3 ల్యాండ్ అయిన రోజు వకుళాదేవి మరియు ఆమె మనువరాలు పేర్ల పై జాబిల్లి పై ఒక ప్లాట్ రిజిస్ట్రేషన్ అయ్యింది. చందమామ పై ఎకరానికి దాదాపు 35 లక్షల రూపాయలకు పైగా రేటు పలుకుతున్నట్టు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే ఏపీ మాజీ సీఐడీ ఛీఫ్
ఇలాంటి వాటికి కదా ఉత్తమ చిత్రాలనే పేరు పడింది. సిన్న తల్లులూ న్యాయం కోసం పోరాడండి అని చెప్పే ప్రమాదకర సందేశాన్ని అంగీకరిస్తారని ఎలా అనుకున్నారు ? మత్తులో ముంచే ప్రశ్న అనేదే తల ఎత్తనీయని, మనలను భయ పెట్టేవే బహు మంచి సినిమాలు మరి మన సినిమాలకు అవార్డ్ రావాలంటే?” అంటూ రాసుకొచ్చాడు. ఆ తరువాత మరో పోస్ట్ లో ” జై భీం కి అవార్డ్ ఇవ్వకూడదు అన్నది ఒక కాన్షియస్ డెసిషన్, మీరందరూ మరచిపోయినట్టున్నారు.
గత సంవత్సరం కూడా దళిత వాదం వైపు నిలబడ్డ, దళిత పౌరషం, రోషం చూపించిన పలాస సినిమాకి అవార్డ్ రాలేదు. కలర్ ఫోటో అని ఒక పెసిమిస్టిక్, చెత్త సినిమాకి అవార్డ్ ఇచ్చారు. ఈ ఉప్పెన సినిమాకి బాబు అది మూలాల్లోకి వెళితే… మన మాదిగ సోదరులు చేసి ఇచ్చే చెప్పుతో మనమే కొట్టుకోవాలి. మన సమస్యల మీద మన కళల మీద మనకి అనుకూలంగా మనం ఓట్లేసిన వాళ్ళు ఎవరైనా మాట్లాడుతున్నారా ? వాళ్ళు కదా మాట్లాడాలి మనం మాత్రమే సోషల్ మీడియాలో ఎందుకు చించుకోవాలి ?” అంటూ రాసుకొచ్చాడు.
నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ప్రకారం, 3 – 18 సంవత్సరాల వరకు అందరికీ చదువు తప్పనిసరి చేసింది. 2030 వరకు అందరికీ విద్య అందించడమే ఈ విధానం యొక్క లక్ష్యం. 5వ తరగతి వరకు మాతృ భాషలోనే పాఠాలను బోధిస్తారు. ఆరవ తరగతి నుండి కోడింగ్, ప్రోగ్రామింగ్ కరిక్యులమ్ ఉండేలా చర్యలు. అలాగే 6వ తరగతి నుండే వొకేషనల్ ఇంటిగ్రేషన్ కోర్సులు అమలులోకి వస్తాయి. ఎంఫిల్ కోర్సును పూర్తిగా తొలిగించనున్నారు. ప్రస్తుతం ఉన్న 10+2+3( టెన్త్, ఇంటర్, డిగ్రీ) విధానం, ఇక పై 5+3+3+4 విధానంలోకి మారనుంది. డిగ్రీ మూడు నుండి నాలుగు సంవత్సరాలు.
పీజీ సంవత్సరం లేదా రెండు సంవత్సరాలు. ఇంటర్ చదువు ఉండదు. ఇంటిగ్రేటెడ్ పీజీ మరియు యూజీ ఐదు సంవత్సరాలు. దేశం మొత్తం ప్రాథమిక చదువుకు ఒకటే కరిక్యులమ్ ఉండనుంది. పాఠ్యాంశాల భారాన్ని తగ్గించి, కాన్సెప్ట్ ను విధ్యార్ధులకు నేర్పే ప్రయత్నం దిశగా మారనుంది. ఇక పై కస్తుర్బా గాంధీ బాలిక విద్యాలయ పన్నెండవ తరగతి వరకు మాత్రమే.
టీచింగ్ ఇంటెన్సివ్ లేదా రీసెర్చ్ ఇంటెన్సివ్ యూనివర్సిటీలు, మోడల్ మల్టీ డిస్సిప్లినరీ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, అటానమస్ డిగ్రీ గ్రాంటింగ్ కాలేజీలను ఆమోదించనున్నారు. అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్లో నాలుగు ఏళ్ల మల్టీ-డిసిప్లినరీ బ్యాచిలర్ డిగ్రీని ప్రతిపాదించింది. ఈ డిగ్రీలో వృత్తిపరమైన రంగాలకు చెంది ఉంటాయి. 1 ఏడాది రీసెర్చ్ పూర్తి అయ్యాక ఒక సర్టిఫికేట్, రెండు ఏళ్ల చదువు పూర్తి అయ్యాక డిప్లొమా సర్టిఫికెట్, మూడేళ్ళ ప్రోగ్రామ్ పూర్తి అయ్యాక బ్యాచిలర్ డిగ్రీ సర్టిఫికెట్, నాలుగేళ్ళ మల్టీడిసిప్లినరీ బ్యాచిలర్ డిగ్రీ పూర్తి అయ్యాక సర్టిఫికెట్ లు ఇస్తారు. పూర్తి వివరాల కోసం ఈ వీడియో చూడండి.
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతున్న చిత్రం రూల్స్ రంజన్. ఈ చిత్రాన్ని ప్రొడ్యూసర్ ఏ.ఎమ్ రత్నం పెద్ద కుమారుడు కృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రం సెప్టెంబర్ లో రిలీజ్ కానుంది. ఈ సినిమా నుంచి 4 వారాల క్రితం ‘సమ్మోహనుడా’ సాంగ్ విడుదల అయ్యింది. ఈ సాంగ్ ను శ్రీయాగోషల్ పాడగా, అమ్రిష్ కంపోజ్ చేశారు. రిలీజ్ అయిన మొదట్లో మిక్స్డ్ టాక్ వచ్చిన ఈ పాట యూట్యూబ్ లో కూడా అంతగా వ్యూస్ పొందలేదు.
అయితే పోను పోను, ఈ పాట సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. అమ్రిష్ ట్యూన్, శ్రీయా గోషల్ వాయిస్ నెటిజెన్ల ఆకట్టుకుంటోంది. విడుదల అయిన వారం తర్వాత ఈ సాంగ్ యూట్యూబ్లో సంచలనంగా మారి, 15మిలియన్ వ్యూస్ను పొందింది. యూట్యూబ్ లో టాప్ ప్లేస్లో ట్రెండ్ అవుతోంది.
ఇక సోషల్ మీడియా ఈ సాంగ్ రీల్స్లో ఓ రేంజ్ లో ట్రెండ్ అవుతోంది. అయితే ఫేస్ బుక్ లో సిగ్మా మీమ్స్ అనే పేజీలో ఈ పాటతో పాటు ఒరిజినల్ హిందీ సాంగ్ ను కూడా షేర్ చేశారు. 2013లో విడుదలైన ఫక్రే అనే హిందీ మూవీలోని సాంగ్ ట్యూన్ నే ‘సమ్మోహనుడా..’ కోసం కాపీ చేశారని కామెంట్స్ చేస్తున్నారు.
పుష్ప రాజ్ పాత్రకి గాను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ జాతీయ అవార్డు రావడంతో తెలుగు ఇండస్ట్రీలో ఆనందం వెల్లివిరిసింది. ఇండస్ట్రీలో, సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా అల్లు అర్జున్ పేరే మారుమ్రోగుతుంది. నేషనల్ అవార్డ్ తో పాన్ ఇండియాలో అల్లు అర్జున్ రేంజ్ రెట్టింపు అవుతుందని టాక్.
జాతీయ ఉత్తమ నటుడు అవార్డు వచ్చిన సందర్భంలో సినీ ప్రముఖులు అల్లు అర్జున్ ను సోషల్లో మీడియాలో విష్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సూపర్ స్టార్ మహేష్ బాబు అల్లు అర్జున్ కు అభినందనలు తెలిపారు. అల్లు అర్జున్ మహేష్ బాబుకు రిప్లై ఇస్తూ, థ్యాంక్యూ అంటూ నలుపురంగులో ఉన్న హార్ట్ సింబల్ షేర్ చేశాడు.
బ్లాక్ కలర్ హార్ట్ సింబల్ షేర్ చేయడంతో నెటిజెన్లు అల్లు అర్జున్ ను ట్రోల్ చేస్తున్నారు. మహేష్ బాబుకు మాత్రమేకాకుండా మరికొందరికి కూడా బ్లాక్ కలర్ హార్ట్ సింబల్ తో థాంక్యూ చెప్పారు. అల్లు అర్జున్ ను ట్రోల్ చేస్తుండడంతో ‘మిలాగ్రోమూవీస్’ అనే ట్విట్టర్ యూజర్ బ్లాక్ హార్ట్ సింబల్ అంటే ప్రేమ మరియు ఆప్యాయతను సూచిస్తుందని షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతోంది.