1847లో అనగా భారత మొదటి స్వాతంత్ర పోరాటానికి పది సంవత్సరాల ముందే, బ్రిటిషు వారి అధికారాన్ని ఎదుర్కొని, వారిపై తిరుగుబాటు చేసిన మొదటి తెలుగు వీరుడు ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’. 1846లో ప్రారంభం అయిన నరసింహారెడ్డి తిరుగుబాటు ఏడాది పాటు కొనసాగి 1847లో ఆయన మరణంతో ముగిసిపోయింది.
ఆ వీరుడి కథతో తెలుగులో సైరా అనే చిత్రం రూపొందించబడింది. ఇందులో నరసింహారెడ్డి పాత్రను మెగాస్టార్ చిరంజీవి పోషించారు. ఈ మూవీ రిలీజ్ తరువాత నరసింహారెడ్డి పాత్రపై ఎన్నో విమర్శలు వచ్చాయి. ఆయన మొదటి స్వాతంత్ర్య సమరయోధుడు కాదని, ఆయన కన్నా ముందే మరొకరు బ్రిటిష్ వారిపై పోరాటం చేశారని వినిపించారు. ఆ వీరుడు ఎవరో? ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం..
ఉయ్యాలవాడ గ్రామం కర్నూలు జిల్లాలో ఉంది. ఈ ఉయ్యాలవాడ గ్రామానికి నరసింహారెడ్డి తండ్రి అయిన పెద మల్లారెడ్డి పాలెగాడుగా ఉండేవాడు. నరసింహారెడ్డి తాత, నొస్సం జమీదారు అయిన చెంచుమల్ల జయరామిరెడ్డి సంతానం లేకపోవడంతో నరసింహారెడ్డిని దత్తతగా తీసుకున్నాడు. నరసింహారెడ్డికి తండ్రి తరపున మాసానికి 11 రూపాయల, పది అణాల, ఎనిమిది పైసలు భరణంగా వచ్చేది.
అయితే నరసింహారెడ్డి తాత జయరామిరెడ్డి సంతానం లేకుండా చనిపోయారనే వంకతో అప్పటిదాకా ఇస్తూ వచ్చిన భరణాన్ని ఆయన మరణంతో బ్రిటీషు ప్రభుత్వం రద్దుచేసింది. దానికి కారణం తెలియాలి అంటే పాలేగాళ్ల వ్యవస్థ గురించి తెలియాలి.
పాలేగాళ్ల వ్యవస్థ:
విజయనగర రాజుల కాలంలోనే పాళెగాళ్ల వ్యవస్థ ఏర్పడింది. విజయనగర ప్రభువులు సా.శ.15వ శతాబ్దిలో ప్రజలకు రక్షణ, శాంతి భద్రతలను సంరక్షించేందుకు పాలెగాళ్లను నియమించారు. అయితే 1565లొ తళ్ళికోట యుద్దంలో రామ రాయలు ఓటమితో విజయనగర సామ్రాజ్యం యొక్క పతనం ప్రారంభం అయ్యి, 1646 వరకు పూర్తిగా అంతరించి పోయింది. ఆ తరువాత ఇప్పటి రాయలసీమ ప్రాంతం నిజాం మరియు ఇతర నవాబుల పాలనలోకి వచ్చింది. 1782లో టిప్పుసుల్తాన్ పాలన మొదలైన తరువాత ఈ ప్రాంతం టిప్పుకు, నిజాం రాజుకు మధ్య ఆదిపత్య పోరులో నలిగింది.
అనంతపురం, రాయదుర్గం, చిత్తూరు గుర్రంకొండ టిప్పు స్వాదీనం చేసుకున్నాడు. అయితే మరో వైపు ఇండియాలో “ఈస్ట్ ఇండియా” కంపెనీ ఆదిపత్యం బాగా పెరిగింది. వీరు టిప్పు సుల్తానుతో యుద్ధం చేసి మొదట ఓడినా ఆ తరువాత గెలిచారు. దానితో టిప్పు సుల్తాన్ ఈస్ట్ ఇండియా కంపెనీతో ఒప్పందం వల్ల రాయలసీమ ప్రాంతాన్ని “నిజాం” కు ఇచ్చాడు. 1799లో ఈస్ట్ ఇండియా కంపెనీ వారితో జరిగిన యుద్దంలొ టిప్పు సుల్తాన్ మరణించాడు. దాంతో దక్షిణాదిలో నిజాం మాత్రమే బలమైన రాజుగా ఉన్నాడు. టిప్పు చనిపోవడంతో ఈస్ట్ ఇండియా వారికి యుద్దాలు చేయాల్సిన అవసరం లేకపోయింది.
అయితే నిజాంకు బ్రిటిష్ వారి “ఆయుధ” మద్దతు అవసరం ఉండటంతో 1800లో రాయలసీమను ఈస్ట్ ఇండియా కంపినీకి నిజాం రాసిచ్చాడు. అలా రాయలసీమలో బ్రిటీష్ వారి అధికారం ప్రారంభమైంది. దానికి “థామస్ మన్రో” కలెక్టరుగా వచ్చారు. మన్రో రాయలసీమలొ బ్రిటీష్ వారికి పన్నుల వసూలు చేయడంతో అతనికి “పాలెగాళ్ళ” నుంచి పూర్తి వ్యతిరేకత వచ్చింది. కాకతీయ రుద్రమ పరిపాలనలో ప్రారంభం అయిన “నాయకుల” వ్యవస్థకు విజయనగర పాలేగాళ్ల వ్యవస్థ కూడా జత చేయబడింది.
పాలెగాళ్ళు బ్రిటిష్ వాళ్లను ఎదిరించే నాటికి 350 ఏళ్ల నుండి కొండ మార్గాల్లో కోట్లు, దుర్గాలు, బురుజులు నిర్మించుకుని నివాసముంటూ ప్రజల రక్షణ బాధ్యతలను చూసుకుంటూ ఉండేవారు. బ్రిటిష్కు వ్యతిరేకంగా పోరాటాలు చేసినందుకు పాలెగాళ్లను బ్రిటిష్ ప్రభుత్వం బందిపోట్లు అని నిందించింది. నిజాం బ్రిటిష్ గవర్నర్ ప్రవేశపెట్టిన ‘సైన్య సహకార’ పద్ధతికి పెట్టిన షరతుల్లో రాయలసీమను ఇవ్వడంతో రాయలసీమ మొత్తం కోపం ఊగిపోయింది. ఎనబై మంది పాలెగాళ్లు 33,000 మంది సైనికులతో కలిసి ఈస్ట్ ఇండియా కంపెనీ వారిని ముప్పు తిప్పలు పెట్టారు.
సా.శ.1801 నుంచి 1806 వరకు చిత్తూరు పాలెగాళ్లు బ్రిటిష్ వారికి ఎదురించి నిలబడ్డారు. ఈ పోరాటాలలోబ్రిటిష్వారు యాదరకొండ పాలెగాడు రామప్ప నాయుడిని సా.శ.1804లో ఉరి తీశారు. ఆ తరువాత బంగారు పాళ్యం పాలెగారు, చారగళ్లు పాలె గాళ్లను ఉరితీశారు. మిగిలిన పాలె గాళ్లను ఆధీనంలోకి తీసుకున్నారు. బ్రిటీషు ప్రభుత్వం పాలేగాళ్ల ఆస్తులు, మాన్యాలను ఆక్రమించుకోవడం కోసం పాలెగాళ్ళ వ్యవస్థను పూర్తిగా రద్దుచేసి, వారికి నెలవారీ భరణాల ఇవ్వడం మొదలుపెట్టింది.
వీరపాండ్య కట్టబ్రహ్మన:
18శతాబ్దానికి చెందిన వీరపాండ్య కట్టబ్రహ్మన స్వాతంత్ర్య సమరయోధుడు. ఇతను పాలెగాళ్ళలో ఒకడు. ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారాన్ని కాదని వారిపై తిరుగుబాటు చేసాడు. 1799లొ తమిళనాడులో కట్ట బ్రహ్మన్నను యుద్దంలో ఓడించి 39 ఏళ్ళ వయస్సులో సా.శ. 1799లో అక్టోబరు 16వ తేదీన బ్రిటిష్ వారు ఉరి తీసారు. కట్ట బ్రహ్మన్నను చంపటం బ్రిటిష్ వారు పాలెగాళ్ళ వ్యవస్థను నిర్మూలించటం కోసం.
నరసింహారెడ్డి తిరుగుబాటు:
నరసింహారెడ్డి తాతగారు, జయరామిరెడ్డి సంతానం లేక చనిపోయాడనే నెపంతో అప్పటి వరకు ఇస్తూన్న భరణాన్ని బ్రిటిషు ప్రభుత్వం రద్దు చేసింది. భరణం నిలిచిపోవడంతో నరసింహారెడ్డి రావలసిన భరణం కోసం కోయిలకుంట్ల తహసిల్దారు వద్దకు తన సైనికుడిని పంపాడు. ఆ తహసిల్దారు భరణం ఇవ్వకుండా నరసింహారెడ్డిని తిట్టి పంపించడంతో ఆ భటుడు నరసింహారెడ్డికి జరిగిన విషయం తెలిపాడు. నరసింహారెడ్డి అటువంటి అవమానం బ్రతకడం కంటే చావే మేలని భావించి, అదే భటునితో తహసిల్దారుకు తాను వస్తున్నట్టుగా కబురు పంపాడు.
మాన్యాలు, ఆస్తులు పోగొట్టుకున్న ఇతర పాలేగాళ్ళు రెడ్డి నాయకత్వంలో చేరారు. వీరిలో వనపర్తి, జటప్రోలు, మునగాల, హైదరాబాదుకు చెందిన సలాం ఖాన్, కర్నూలుకు చెందిన పాపాఖాన్,పెనుగొండ, అవుకు జమీందార్లు, కొందరు చెంచులు, బోయలు కూడా ఉన్నారు. 1846 జూన్ నెలలో నరసింహారెడ్డి తిరుగుబాటు ప్రారంభం అయ్యింది. చాలా నెలలపాటు బ్రిటిష్ వారితో గెరిల్లా యుద్దం చేశాడు. ఆఖరికి 1847లొ నరసింహారెడ్డిని బ్రిటీష్ వాళ్ళు బంధించి ఊరి బహిరంగంగా ఆయన ఉరి తీశారు.
ఇది తంగిరాల వెంకట సుబ్బారావుగారు రాసిన “రేనాటి సూర్యచంద్రులు” అనే గ్రంధంలో కనిపిస్తుంది. నరసింహారెడ్డి వీరత్వాన్ని కీర్తిస్తూ ఇప్పటికీ జానపదులు, ఉగ్గుకథలు, గేయాలు, పాటల రూపంలో వివరిస్తారు. ఆయన ఆనవాళ్ళు కోయిలకూట ప్రాంతంలో కనిపిస్తాయి. స్థానికులు కూడా ఆయన వీరచరితను కథలుకథలుగా చెప్పుకుంటుంటారు.
Also Read: ఈ “కోట” వల్ల అప్పుల పాలు అయ్యారా..? అసలు ఎందుకు కట్టారు..?




యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రాముడిగా నటించిన ఆదిపురుష్ చిత్రం జూన్ 16 న పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ నేడు (జూన్ 6) ప్రీరిలీజ్ ఈవెంట్ ను తిరుపతిలో నిర్వహిస్తోంది. ఈ వేడుక ఈ రోజు సాయంత్రం జరగనుంది. ఈవెంట్ కోసం గ్రాండ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ప్రముఖ ఆధ్యాత్మిక గురువు చినజీయర్ స్వామి ముఖ్య అతిథిగా వస్తుండడం విశేషం.
తాజాగా ఆదిపురుష్ మేకర్స్ యువీ క్రియేషన్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా ఒక ప్రకటన రిలీజ్ చేశారు. ఈ ప్రకటన ఆంజనేయస్వామి భక్తులకు గూస్ బంప్స్ ను తెప్పిస్తోంది. అది ఏమిటంటే “ఆది పురుష్” సినిమా ప్రదర్శించే థియేటర్లలో ఒక సీటును హనుమంతుడి కోసం ఖాళీ ఉంచడం. ఇందుకోసం ఏర్పాట్లు చేస్తున్నట్టు ఆ ప్రకటనలో చెప్పారు. హనుమంతుడి కోసం సీటు ఖాళీగా ఉంచడం ఏంటనే సందేహం వస్తుంది. దానికి సమాధానం కూడా ఆ ప్రకటనలో ఇచ్చారు.
ఎక్కడ రామాయాణ పారాయణం జరిగినా, ఎక్కడ శ్రీరామ కథను ప్రదర్శించినా అక్కడ ఒక ఆసనాన్ని వేస్తుంటారు. అలా వేయడానికి కారణం శ్రీరామ కథను వీక్షించేందుకు ఆ స్థలానికి ఆంజనేయుడు వస్తాడని భక్తుల నమ్మకం. ఆ కారణంగానే మూవీ యూనిట్ కూడా ఆంజనేయుడి కోసం ఒక సీటును ప్రత్యేకంగా కేటాయించాలని నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటనలో తెలిపింది.
ఒరిస్సాలో జరిగిన కోరమండల్ రైలు ప్రమాదం దేశం మొత్తాన్ని ఒక్కసారిగా విషాదంలో ముంచేసింది. ఈ ప్రమాదం లో 280కి పైగా మరణించగా, 1000కి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదాన్ని భారత దేశ రైల్వే హిస్టరీలోనే అత్యంత విషాదకర సంఘటనల్లో ఒకటిగా అనుకుంటున్నారు. నలబై సంవత్సరాల క్రితం హార్లోని సహస్ర దగ్గర ఒక ప్యాసింజర్ రైలు ప్రమాదంలో 500 మంది మరణించారు.
ఇదే ఇప్పటివరకు అత్యంత ఘోరమైన ప్రమాదం. ఇప్పుడు జరిగిన ప్రమాదంలో 280 మందికి పైగా చనిపోయారు. ఈ ప్రమాదానికి గల కారణాల పై భిన్నామైన అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా కొందరు ఈ ప్రమాదం ఇటీవల రిలీజ్ అయిన “విడుదల పార్ట్ 1” సినిమాలో జరిగినట్లే ఉంది అని అంటున్నారు. ఈ చిత్రంలో కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి, తమిళ నటుడు సూరి ప్రధాన పాత్రలలో నటించారు. ఈ చిత్రాన్ని కోలీవుడ్ దర్శకుడు వెట్రిమారన్ తెరకెక్కించాడు. ఆయన చిత్రాలు ఎక్కువగా వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతాయి.
ఈ చిత్రం రిలీజ్ అయినపుడు కూడా ఈ మూవీలో కొన్ని సీన్స్, కొందరు వ్యక్తులు వాస్తవానికి దగ్గరగా ఉన్నాయని టాక్ వినిపించింది. విడుదల పార్ట్ 1 సినిమా రైలు ప్రమాద సన్నివేశంతో మొదలవుతుంది. అయితే ఈ సినిమాలో ఇక ట్రైన్ ను బాంబుతో పేల్చే స్తారు. అయితే ప్రమాదం మాత్రం అచ్చం ఒడిశాలో కోరమాండల్ సూపర్ ఫాస్ట్ రైలు ప్రమాదం లాగే ఉండడంతో సేమ్ టు సేమ్, ఆ సినిమాలోని సీన్ రిపీట్ అయిందని కామెంట్స్ వినిపిస్తున్నాయి.
కోరమండల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ భారత దేశంలో తొలి సూపర్ ఫాస్ట్ ట్రైన్. రైల్వే చరిత్రలో లెజెండ్. అలాగే వేగంలో రారాజు అని చెప్పవచ్చు. ప్రస్తుతం రాజధాని, దురంతో, శతాబ్ది, వందేభారత్ ట్రైన్స్ వచ్చాయి. అయితే 46 సంవత్సరాల క్రితం వచ్చిన మొట్టమొదటి సూపర్ ఫాస్ట్ ట్రైన్ ఇదే. ఇండియన్ హిస్టరీలో అత్యధిక వేగం కలిగిన మొట్టమొదటి రైలుగా పేరుగాంచింది.
1997లో మార్చి 6న మొదలైన ఈ సూపర్ ఫాస్ట్ రైలు గంటకు దాదాపు 130 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఈ రైలు హౌరా నుండి చెన్నై మధ్య 4 రాష్ట్రాల గుండా 25 గంటల్లో, 16 వందల 61 కి.మీ. ప్రయాణిస్తుంది. ఈ రైలు ప్రతీరోజూ దాదాపు 1661 కి.మీ. ప్రయాణిస్తుంది. ఈ ట్రైన్ చెన్నైలో మొదలయితే నాన్ స్టాప్ గా 431 కిలో మీటర్లు ప్రయాణించి 6 గంటల్లో విజయవాడ చేరుకుంటుంది.
క్షణాల్లో స్టేషన్ దాటుతుందంటే దాని వేగం అలాంటిది. 46 ఏళ్ళుగా నిరంతరాయంగా తమిళనాడు, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, పశ్చిమబెంగాల్ వరకు ప్రయాణిస్తోంది. మొదట్లో వారానికి 2 సార్లు మాత్రమే నడిచేది. ఆ తర్వాత ఈ రైలుకు డిమాండ్ పెరగటంతో ఈ ట్రైన్ ను ప్రతిరోజూ నడుపుతున్నారు. గతంలో కూడా కోరమండల్ ఎక్స్ ప్రెస్ యాక్సిడెంట్ కి గురైంది.
అయితే ప్రస్తుతం జరిగిన ఈ యాక్సిడెంట్ మాత్రం చాలా పెద్దది. ఈ ట్రైన్ ను ప్రవేశపెట్టిన తరువాత ఇలాంటి భారీ ప్రమాదం జరగలేదు. ఇప్పటి దాకా లక్షలాది మందిని సురక్షితంగా వారి గమ్యస్థానాలకు చేర్చిన కోరమండల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ కు భారీ యాక్సిడెంట్ జరగటంతో దాని హిస్టరీని, స్పీడ్ ను ఆయా ప్రాంతాలవారు జ్ఞాపకం చేసుకుంటున్నారు.
1997లో ప్రేమించుకుందాం రా సినిమాతో దర్శకుడిగా జయంత్ సి పరాన్జీ, ఆమూవీ హిట్ తో వరుస అవకాశాలు అందుకుని, టాలీవుడ్ అగ్ర హీరోలు అందరితోనూ సినిమాలను చేశారు. ఎన్నో సూపర్ డూపర్ హిట్లు ఇచ్చిన ఆయన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, త్రిష హీరోహీరోయిన్లుగా ‘తీన్ మార్’ అనే సినిమాని చేశారు. ఈ చిత్రం 2011 లో రిలీజ్ అయ్యి ప్లాప్ గా నిలిచింది. ఇక ఆ మూవీ తరువాత జయంత్ తెలుగు ఇండస్ట్రీకి దూరం అయ్యారు.
అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న డైరెక్టర్ జయంత్ ‘తీన్మార్’ ప్లాప్ కావడం పై స్పందించారు. జయంత్ మాట్లాడుతూ ‘ తీన్మార్ సినిమా నాకు ఇప్పటికీ, ప్రెష్ ప్రేమకథగానే అనిపిస్తుంది. ఈ మూవీ ప్లాప్ అవడానికి కారణాలు అయితే చెప్పలేను. కానీ ఈ సినిమా వల్ల కొందరు పవన్ ఫ్యాన్స్ నిరాశ పడ్డారు.
అన్నిటికన్నా ముఖ్యంగా హీరోయిన్ త్రిషకు సోనూసూద్తో పెళ్లి కావడం, ఆ తర్వాత త్రిష మళ్ళీ పవన్ కల్యాణ్ వద్దకు రావడం వంటి సన్నివేశాలు ఆడియెన్స్ కి నచ్చలేదు. పవర్ స్టార్ ఇమేజ్ ఉన్న పవన్ కళ్యాణ్ ని ఫ్యాన్స్ ఈ సినిమాలో చూడలేక పోయారు. ఇదే సినిమాని ఆ సమయంలోని యంగ్ హీరోతో తెరకెక్కించి ఉంటే రిజల్ట్ వేరేలా ఉండేది కావచ్చు” అని అన్నారు.
ఈసారి ఎలాగైనా ఐసీసీ ట్రోఫీ సాధించాలనే కసితో భారత జట్టు ఆస్ట్రేలియాతో ఫైనల్ మ్యాచ్ లో తలపడబోతుంది. ఆఖరిసారిగా న్యూజిలాండ్ తో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ కెప్టెన్ గా ఉన్నాడు. ఈసారి రోహిత్ శర్మ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నారు. జూన్ 7 నుండి 11 వరకుఇంగ్లండ్లో జరిగే ఈ మ్యాచ్ కు వర్షం అంతరాయం కలిగించే అవకాశం ఉంది. ఇటీవల జరిగిన ఐపీఎల్ 16వ సీజన్ ఫైనల్ మ్యాచ్ కు కూడా వర్షం వల్ల అంతరాయం ఏర్పడిన విషయం తెలిసిందే.
ఇక ఇప్పుడు డబ్ల్యూటీసీ ఫైనల్ కు కూడా వర్షం అడ్డంకిగా మారే ఛాన్స్ ఉంది. అయితే, ఈ ఫైనల్ మ్యాచ్ కూడా రిజర్వ్ డే అందుబాటులో ఉంది. కెన్నింగ్టన్ ఓవల్ గ్రౌండ్ లో జరిగే డబ్ల్యూటీసీ ఫైనల్ లో వర్షం పడే ఛాన్స్ ఉండడంతో ట్రోఫీ విన్నర్ ను ఎలా నిర్ణయిస్తారు అనే ప్రశ్న అందరిలోనూ వస్తోంది. జూన్ 7 – 11 వరకు జరిగే మ్యాచ్ లో నిర్ణయం రానట్లయితే జూన్ 12 రిజర్వ్ డే అందుబాటులో ఉంది.
ఇక వర్షం కారణంగా ఫైనల్ మ్యాచ్ రద్దు అయినట్లయితే, ఐసిసి రూల్స్ ప్రకారం ఫైనల్ లో తలపడే రెండు జట్లను అంటే ఇండియా మరియు ఆస్ట్రేలియా రెండు జట్లను ఐసిసి చాంపియన్షిప్ విజేతలుగా ప్రకటిస్తుంది. అందువల్ల భారత జట్టు అభిమానులు ఆందోళన పడాల్సిన అవసరం ఏమాత్రం లేదు.
1. సమంత:
2. పూజా హెగ్డే:
3. సాయి పల్లవి:
4. రష్మికా మందన్న:
5. కీర్తి సురేష్:
6. అనుష్క శెట్టి:
7. కాజల్ అగర్వాల్:
8. కృతి శెట్టి :
9. రకుల్ ప్రీత్ సింగ్:
10. ప్రియాంకా మోహన్:
11. రాశి కన్నా:
12. దీపికా పదుకొనే:
దీపికా పదుకొనే ఫోటోను ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ సహాయంతో ఈ విధంగా రూపొందించారు.
అయితే క్రమం తప్పకుండా డయాలసిస్ చేయించుకుంటున్నప్రసాద్ ఆరోగ్యంలో ఎలాంటి మార్పు కనిపించట్లేదు. ప్రస్తుతం పంచ్ ప్రసాద్ కండిషన్ సీరియస్ గా ఉందని సోషల్ మీడియా వేదికగా జబర్దస్త్ కమెడియన్ నూకరాజు తెలిపారు. వీలైనంత త్వరగాపంచ్ ప్రసాద్ సర్జరీ చేయాలని, దానికి చాలా డబ్బు ఖర్చవుతుందని, అందు కోసం దాతలు ఎవరైనా సహాయం చేయాలని కోరాడు.
పంచ్ ప్రసాద్ హెల్త్ కండిషన్ ను వివరిస్తూ పంచ్ ప్రసాద్ యూట్యూబ్ ఛానల్లోనే నూకరాజు ఒక వీడియో విడుదల చేశాడు. “ఎన్నో హాస్పటల్స్ తిరిగామని ప్రసాద్ అన్న హెల్త్ కండిషన్ లో ఎలాంటి మార్పు రాలేదని అన్నారు. 3 ఏళ్ల క్రితమే 2 కిడ్నీలు ఫెయిలయినా, ఆ బాధను అప్పటి నుండి అలాగే భరిస్తున్నాడు. ఇక కిడ్నీ సమస్య ఉన్నవారికి జబ్బులు ఒకదాని వెనుక మరొకటి వస్తూనే ఉంటాయని, ప్రసాద్ అన్నకు అలానే జరిగింది.
వైద్యులు వీలైనంత త్వరగా ప్రసాద్ అన్నకు కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ చేయించాలని, చేయించకపోతే ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదని అన్నారు. ఈ ఆపరేషన్ కు ఖర్చు లక్షల్లో అవుతుంది. చేతులెత్తి ప్రార్ధిస్తున్నా దయ చేసి మీకు వీలైనంత సహాయం చేయండి” అని నూకరాజు అర్థించాడు. పంచ్ ప్రసాద్ ఈ వీడియోలో ముఖానికి ఆక్సిజన్ మాస్కుతో కనిపించాడు.
మొదటి నుండి ఫ్యామిలీ సినిమాలతో ఆడియెన్స్ ను అలరించిన శ్రీకాంత్ అడ్డాల గత కొన్నేళ్ళ నుండి విజయం కోసం ఎదురుచూస్తున్నారు. చాలా గ్యాప్ తరువాత శ్రీకాంత్ అడ్డాల ‘పెద్ద కాపు’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. జయజానకి నాయక, అఖండ లాంటి సినిమాల నిర్మాత మిర్యాల రవీందర్రెడ్డి తన మేనల్లుడు విరాట్ కర్ణను ఈ మూవీ ద్వారా టాలీవుడ్ కి హీరోగా పరిచయం చేస్తున్నాడు. తాజాగా ఈ చిత్రం నుండి ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అయ్యింది. ఇది ఇప్పుడు ఇండస్ట్రీలో సంచలనంగా మారిపోయింది.
ఈ పోస్టర్ లో హీరో విరాట్ కర్ణ మాస్ లుక్ తో కనిపించాడు. అదే కాకుండా విరాట్ ఊరులోని ఓ వర్గానికి నాయకుడిగా కనిపిస్తున్నాడు. ఇక ఈ పోస్టర్ పై ‘ఓ సామాన్యుడి సంతకం’ క్యాప్షన్ కనిపిస్తోంది. దీంతో మూవీ ప్రారంభంలోనే పోస్టర్ అందరిని ఆకర్షించింది. ఈ మూవీ కోనసీమలో 1980ల నేపథ్యంలో సాగే కథ అని సమాచారం. ఆ సమయంలో అక్కడ జరిగిన రాజకీయాలు, కులాల, వర్గ పోరాటాలు, గొడవల చుట్టూ ఈ మూవీ కథ తిరుగుతుందని తెలుస్తుంది.