2021 లో ఆకాశం నీ హద్దురా సినిమాతో మన ముందుకు వచ్చిన సూర్య, గత సంవత్సరం జై భీమ్ సినిమాతో అలరించారు. నిజ జీవిత సంఘటనల ఆధారంగా రూపొందిన ఈ సినిమా ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. జై భీమ్ సినిమా డైరెక్ట్ అమెజాన్ ప్రైమ్ లో విడుదల అయ్యింది.
ఈ సినిమాలో సూర్య లాయర్ చంద్రు అనే పాత్రను పోషించారు. సూర్యని చూసిన వారు అందరూ, సూర్య మంచి పవర్ ఫుల్ పాత్రలో నటించారు. ఈ సినిమా విడుదల తరువాత సినతల్లి గురించి అందరికి తెలిసింది. ఆమె పడ్డ కష్టాల గురించి తెలుసుకుంటే కళ్ళు చెమరుస్తున్నాయి.
జై భీమ్ సినిమా వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందిన సంగతి తెలిసిందే. సినతల్లి పాత్ర రియల్ లైఫ్ లో కూడా ఉంది. ఆమె పేరు పార్వతి అమ్మాళ్. రాజకన్ను భార్య ఆమె. తప్పుడు కేసు వలన ఆమె భర్త మృతి చెందాడు. అయితే.. ఈ కేసు కోర్టులో చాలా రోజుల విచారణ తరువాత న్యాయమైన తీర్పు లభించింది. ఈ కేసులో కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం సినతల్లికి ఇల్లు కట్టించాల్సి ఉంది. మరి ఆమెకు ఇల్లు కట్టివ్వలేదా? ఆమె ఇలాంటి దుర్భరమైన వాతావరణం లో ఎందుకు నివాసం ఉండాల్సి వచ్చింది? అనే విషయాలను గుర్రం సీతారాములు ఓ వ్యక్తి ఫేస్ బుక్ లో పంచుకున్నారు. ఆ వివరాలను ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.
నిజంగా జరిగిన స్టోరీకి, పార్వతి గాధకి కొన్ని తేడాలు అయితే ఉన్నాయి. వాస్తవానికి వారు గిరిజనులు కాదు దళితులు. ఈ దుర్ఘటన జరిగేటప్పటికే ఆమెకు నలుగురు పిల్లలు పుట్టారట. లాక్ అప్ డెత్ లో రాజన్న చనిపోయాడన్న విషయం కూడా ముందే తెలుసట. ఈ దుర్ఘటన టైం లో ఆమె భర్తతో పాటు.. ఆమెను కూడా చాలా గట్టిగ కొట్టారట. ఆ దెబ్బలు ఇప్పటికి కూడా బాధపెడుతున్నాయని ఆమె విలపిస్తోంది.
ఈ దుర్ఘటన జరిగే టైం కి ఒక కొడుక్కి పది సంవత్సరాల వయసు ఉందట. ఆ పిల్లాడిని కూడా పోలీసులు గట్టిగా కొట్టారట. ఆ దెబ్బలకి ఆ పిల్లాడు పిచ్చి వాడు అయిపోయాడట. ఈ కేసు లో గెలిచాక నష్టపరిహారం కింద ఆమెకు లక్ష రూపాయలు ఇచ్చారట. ఆమెకు ఇచ్చిన ఇల్లు వరదల్లోనే కొట్టుకుపోయింది. ఆ తరువాత ఆమె వేదన చెప్పనలవికాదు. ఆ వేదన విన్నవారు లేరు. తిరిగి ఇల్లు కట్టుకోలేక ఓ పాడుపడ్డ టార్పాలిన్ గుడిసెలో రెండు వేల రూపాయలకు అద్దె ఇస్తూ కాలం గడుపుతోంది.
పోలీసులు పెట్టిన టార్చర్ తో రాజన్న రెండవ రోజే చనిపోయాడు. ఆరోజు రాత్రికే శవాన్ని మాయం చేసేసారట. రాజన్న చనిపోయిన మూడవరోజుకి ఆ సొమ్ము రికవర్ అయిపోయిందట. ఎవరో ఓ ఆడ మనిషి ఆ దొంగతనం చేశారట. కానీ.. ఆమెను మాత్రం ఎవరు ఏమి అనలేదట. ఈ కేసు విషయంలో గోవింద్ అనే ఓ వ్యక్తి సాయం చేసాడట. లాయర్ చంద్రు కంటే సదరు వ్యక్తే ఎక్కువ సాయం చేసాడని పార్వతి చెబుతోంది. ఈ కేసు అయ్యేవరకు సదరు వ్యక్తి పెళ్లి కూడా చేసుకోలేదట. రాజన్న తో పాటు మరో ముగ్గురికి కూడా శిక్ష పడింది. వారిలో ఒకరు చనిపోగా… మరో ఇద్దరు పెన్షన్ తీసుకుని కాలం వెళ్లదీస్తున్నారు.








గత వారం యోగి మూవీని రీరిలీజ్ చేశారు. థియేటర్లు ఈ మూవీలోని ‘ఓరోరి యోగి’ పాటకు ఓ రేంజ్ లో ఊగిపోయాయి. ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దాంతో ఈ ట్యూన్ ఒరిజినల్ కన్నడ పాట కూడా నెట్టింట్లో ఒక్కసారిగా ట్రెండింగ్ లోకి వచ్చింది. దాంతో తెలుగు సాంగ్ నే ఒరిజినల్ సాంగ్ అని అనుకున్నారు. తెలుగు పాటను కన్నడ సినిమా వాళ్ళు కాపీ చేశారనుకున్నారు.
అయితే ఆ సాంగ్ కన్నడలోనే ముందుగా వచ్చింది. కన్నడలో స్టార్ హీరో శివ రాజ్ కుమార్ హీరోగా నటించిన ‘జోగి’ మూవీ 2005 లో రిలీజ్ అయ్యి, బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఆ సినిమాలోని లవ్ సాంగ్ ట్యూన్నే తెలుగువాళ్ళు కాపీ చేశారు. కన్నడలో మూవీలో హీరోహీరోయిన్ల మధ్య వచ్చిన మంచి లవ్ సాంగ్ ను తెలుగులో ఐటం సాంగ్గా తెరకెక్కించారు.
ఇంత మంచి సాంగ్ ను ఐటం సాంగ్గా మార్చారు కదరా? అని నెటిజెన్లు ఈ పాట పై ట్రోల్స్ చేస్తున్నారు. దీనిపై మీమ్స్ కూడా ట్రెండ్ అవుతున్నాయి. కన్నడ ఒరిజినల్ పాట ప్రస్తుతం తెలుగు పాట కన్నా ఎక్కువగానెట్టింట్లో ట్రెండ్ అవుతోంది. అంతటా కన్నడ సాంగ్ నే వినిపిస్తోంది. ఈ సాంగ్ పై తీసిన రీల్స్, షార్ట్స్ తో కన్నడ పాట ట్రెండింగ్ లోకి వచ్చింది.


మహేష్ బాబు హీరోగా నటించిన ‘ఒక్కడు’ మూవీ 2003లో సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 15న రిలీజ్ అయ్యి, ఊహించని విధంగా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. మహేష్ కి మాస్ ఇమేజ్ వచ్చింది ఈ చిత్రంతోనే అనవచ్చు. ఈ చిత్రంలో హీరోయిన్ గా భూమిక చావ్లా నటించగా, విలన్ గా ప్రకాశ్ రాజ్ నటించి, మెప్పించారు.
అయితే ఈ మూవీ హిట్ అవడానికి కారణం స్క్రీన్ ప్లేలో చేసిన మార్పులే అని తెలుస్తోంది. దర్శకుడు గుణశేఖర్ ముందుగా అనుకున్న స్టోరీ ప్రకారంగా, కొండారెడ్డి బురుజు దగ్గర హీరో విలన్ ఓబుల్ రెడ్డిని కొట్టే సన్నివేశమే హీరో ఇంట్రడక్షన్ సీన్ గా రావాలి. ఆ సీన్ తర్వాత స్టోరీ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళుతుందట. అయితే ఈ కథ విన్న రచయిత పరుచూరి గోపాలకృష్ణ ముందుగా ఆ సన్నివేశం పెట్టడం సరి కాదని అన్నారంట.
సినిమా మొదట్లోనే అలాంటి పవర్ ఫుల్ సన్నివేశం పెట్టవద్దని గుణశేఖర్ కు సూచించారంట. దాంతో దర్శకుడు గుణశేఖర్ పరుచూరి గోపాలకృష్ణ చేసిన సూచనల ఆధారంగా కథలో కీలకమైన మార్పులు చేసి, ఇప్పుడు మనం చూస్తున్న సినిమాగా తెరకెక్కించారని తెలుస్తోంది. ఆ మార్పుల వల్లే ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందట.
దక్షిణాది హీరోయిన్లలో నయనతార లేడి సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకుంది. వ్యక్తిగత విషయంలోనూ, సినిమాల విషయంలోనూ ఆమె ఎప్పుడూ తనదైన శైలిలో ముందుకు వెళ్తుంది. ఆమెకు సంబంధించిన విషయం ఏదైనా క్షణాల్లో వైరల్ గా మారుతుంది. అత్యధిక రెన్యుమరేషన్ అందుకుంటున్న హీరోయిన్ గా రికార్డు సృష్టించారు. గత ఏడాది దర్శకుడు విగ్నేష్ శివన్ పెళ్లి చేసుకుని వైవాహిక జీవితం ప్రారంభించిన విషయం తెలిసిందే. సరోగసి ద్వారా కవలలకు తల్లిదండ్రులు అయ్యారు.
ప్రస్తుతం నయనతార బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ హీరోగా నటిస్తున్న జవాన్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ మూవీ ఈ ఏడాది సెప్టెంబర్ 7న రిలీజ్ కానుంది. ఇది ఇలా ఉంటే నయనతార గతంలో నటించిన ఒక ప్రకటనకు సంబంధించిన వీడియో నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. ఈ యాడ్ లో ఆమె గుర్తుపట్టలేనట్టుగా ఉంది. ఆమె కాలేజీలో చదువుతున్న సమయంలో మోడల్గా పార్ట్ టైమ్ జాబ్ చేసింది. అలా నయనతార నటించిన ప్రకటనలలో కొన్నింటిని చూసిన దర్శకుడు సత్యన్ అంతిక్కడ్ తాను తీయబోయే మనస్సినక్కరే సినిమాలో కీలక పాత్రకోసం ఆమెను సంప్రదించాడు.
మొదట్లో నయనతార ఆఫర్ను రిజెక్ట్ చేసినప్పటికీ, ఆ తరువాత దర్శకుడు వదలకుండా ప్రయత్నించడంతో చివరికి ఆమె అంగీకరించింది. అలా నయనతార 2003లో మలయాళ సినిమా ‘మనస్సినక్కరే’ తో ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ఆ మూవీ హిట్ అవడం, వరుస అవకాశాలు రావడంతో సినిమాలలో నటిస్తూ టాప్ హీరోయిన్ గా ఎదిగింది. ఆమె కాలేజీ రోజుల్లో నటించిన యాడ్ ప్రస్తుతం నెట్టింట్లో షికారు చేస్తోంది.
ఈ క్రమంలోనే ఏపీ మాజీ సీఐడీ ఛీఫ్
ఇలాంటి వాటికి కదా ఉత్తమ చిత్రాలనే పేరు పడింది. సిన్న తల్లులూ న్యాయం కోసం పోరాడండి అని చెప్పే ప్రమాదకర సందేశాన్ని అంగీకరిస్తారని ఎలా అనుకున్నారు ? మత్తులో ముంచే ప్రశ్న అనేదే తల ఎత్తనీయని, మనలను భయ పెట్టేవే బహు మంచి సినిమాలు మరి మన సినిమాలకు అవార్డ్ రావాలంటే?” అంటూ రాసుకొచ్చాడు. ఆ తరువాత మరో పోస్ట్ లో ” జై భీం కి అవార్డ్ ఇవ్వకూడదు అన్నది ఒక కాన్షియస్ డెసిషన్, మీరందరూ మరచిపోయినట్టున్నారు.
గత సంవత్సరం కూడా దళిత వాదం వైపు నిలబడ్డ, దళిత పౌరషం, రోషం చూపించిన పలాస సినిమాకి అవార్డ్ రాలేదు. కలర్ ఫోటో అని ఒక పెసిమిస్టిక్, చెత్త సినిమాకి అవార్డ్ ఇచ్చారు. ఈ ఉప్పెన సినిమాకి బాబు అది మూలాల్లోకి వెళితే… మన మాదిగ సోదరులు చేసి ఇచ్చే చెప్పుతో మనమే కొట్టుకోవాలి. మన సమస్యల మీద మన కళల మీద మనకి అనుకూలంగా మనం ఓట్లేసిన వాళ్ళు ఎవరైనా మాట్లాడుతున్నారా ? వాళ్ళు కదా మాట్లాడాలి మనం మాత్రమే సోషల్ మీడియాలో ఎందుకు చించుకోవాలి ?” అంటూ రాసుకొచ్చాడు.
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతున్న చిత్రం రూల్స్ రంజన్. ఈ చిత్రాన్ని ప్రొడ్యూసర్ ఏ.ఎమ్ రత్నం పెద్ద కుమారుడు కృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రం సెప్టెంబర్ లో రిలీజ్ కానుంది. ఈ సినిమా నుంచి 4 వారాల క్రితం ‘సమ్మోహనుడా’ సాంగ్ విడుదల అయ్యింది. ఈ సాంగ్ ను శ్రీయాగోషల్ పాడగా, అమ్రిష్ కంపోజ్ చేశారు. రిలీజ్ అయిన మొదట్లో మిక్స్డ్ టాక్ వచ్చిన ఈ పాట యూట్యూబ్ లో కూడా అంతగా వ్యూస్ పొందలేదు.
అయితే పోను పోను, ఈ పాట సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. అమ్రిష్ ట్యూన్, శ్రీయా గోషల్ వాయిస్ నెటిజెన్ల ఆకట్టుకుంటోంది. విడుదల అయిన వారం తర్వాత ఈ సాంగ్ యూట్యూబ్లో సంచలనంగా మారి, 15మిలియన్ వ్యూస్ను పొందింది. యూట్యూబ్ లో టాప్ ప్లేస్లో ట్రెండ్ అవుతోంది.
ఇక సోషల్ మీడియా ఈ సాంగ్ రీల్స్లో ఓ రేంజ్ లో ట్రెండ్ అవుతోంది. అయితే ఫేస్ బుక్ లో సిగ్మా మీమ్స్ అనే పేజీలో ఈ పాటతో పాటు ఒరిజినల్ హిందీ సాంగ్ ను కూడా షేర్ చేశారు. 2013లో విడుదలైన ఫక్రే అనే హిందీ మూవీలోని సాంగ్ ట్యూన్ నే ‘సమ్మోహనుడా..’ కోసం కాపీ చేశారని కామెంట్స్ చేస్తున్నారు.
పుష్ప రాజ్ పాత్రకి గాను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ జాతీయ అవార్డు రావడంతో తెలుగు ఇండస్ట్రీలో ఆనందం వెల్లివిరిసింది. ఇండస్ట్రీలో, సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా అల్లు అర్జున్ పేరే మారుమ్రోగుతుంది. నేషనల్ అవార్డ్ తో పాన్ ఇండియాలో అల్లు అర్జున్ రేంజ్ రెట్టింపు అవుతుందని టాక్.
జాతీయ ఉత్తమ నటుడు అవార్డు వచ్చిన సందర్భంలో సినీ ప్రముఖులు అల్లు అర్జున్ ను సోషల్లో మీడియాలో విష్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సూపర్ స్టార్ మహేష్ బాబు అల్లు అర్జున్ కు అభినందనలు తెలిపారు. అల్లు అర్జున్ మహేష్ బాబుకు రిప్లై ఇస్తూ, థ్యాంక్యూ అంటూ నలుపురంగులో ఉన్న హార్ట్ సింబల్ షేర్ చేశాడు.
బ్లాక్ కలర్ హార్ట్ సింబల్ షేర్ చేయడంతో నెటిజెన్లు అల్లు అర్జున్ ను ట్రోల్ చేస్తున్నారు. మహేష్ బాబుకు మాత్రమేకాకుండా మరికొందరికి కూడా బ్లాక్ కలర్ హార్ట్ సింబల్ తో థాంక్యూ చెప్పారు. అల్లు అర్జున్ ను ట్రోల్ చేస్తుండడంతో ‘మిలాగ్రోమూవీస్’ అనే ట్విట్టర్ యూజర్ బ్లాక్ హార్ట్ సింబల్ అంటే ప్రేమ మరియు ఆప్యాయతను సూచిస్తుందని షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతోంది.