ఈ మధ్య సినిమాలన్నిటినీ భాషా భేదం లేకుండా ఆదరిస్తున్నారు. ఏ భాష సినిమా అయినా సరే ఒకవేళ వారి భాషలో హిట్ అయితే వేరే భాషలోకి డబ్బింగ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. అలా ఇటీవల కన్నడలో హాస్టల్ హుడుగారు బేకగిద్దారే రిలీజ్ అయ్యి చాలా పెద్ద హిట్ అయ్యింది. ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ సినిమాని తెలుగులో బాయ్స్ హాస్టల్ పేరుతో డబ్ చేసి రిలీజ్ చేశారు. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
- చిత్రం : బాయ్స్ హాస్టల్
- నటీనటులు : ప్రజ్వల్ బి.పి., మంజునాథ్ నాయక, రాకేష్ రాజ్కుమార్, శ్రీవత్స శ్యామ్, తేజస్ జయన్న, శ్రేయాస్ శర్మ.
- నిర్మాత : ప్రజ్వల్ బి పి, వరుణ్ కుమార్ గౌడ, నితిన్ కృష్ణమూర్తి, అరవింద్ ఎస్ కశ్యప్
- దర్శకత్వం : నితిన్ కృష్ణమూర్తి
- సంగీతం : బి. అజనీష్ లోక్నాథ్
- విడుదల తేదీ : ఆగస్ట్ 26, 2023

స్టోరీ :
సినిమా మొత్తం తుంగ అనే ఒక బాయ్స్ హాస్టల్ లో జరుగుతుంది. ఆ బాయ్స్ హాస్టల్ లో ఉండే అజిత్ (ప్రజ్వల్) ఒక ఫిలిం మేకర్ అవ్వాలి అని ప్రయత్నిస్తూ ఉంటాడు. కానీ తన దగ్గర సినిమాకి తగిన కథలు లేవు అని తన స్నేహితులు అజిత్ ని ఆటపట్టిస్తూ ఉంటారు. అయితే ఒక సమయంలో ఆ హాస్టల్ వార్డెన్ (మంజునాథ్ నాయక) ఒక సూసైడ్ నోట్ రాసి అందులో కొంత మంది అబ్బాయిల పేర్లు రాసి చనిపోతాడు. హాస్టల్ వార్డెన్ చాలా స్ట్రిక్ట్. తను మిలిటరీ నుండి వచ్చాను అని చెప్తూ ఉంటాడు. అక్కడ ఉన్న హాస్టల్ అబ్బాయిలకి, వార్డెన్ కి పడదు.

ఇప్పుడు వార్డెన్ చనిపోవడంతో వాళ్లు ఇంక వాళ్ళని ఇబ్బంది పెట్టే వారు ఎవరూ లేరు అని అనుకునే లోపే, ఆ వార్డెన్ రాసిన లెటర్ లో వాళ్ల పేర్లు ఉండటం చూసి కంగారు పడతారు. దాంతో ఆ సూసైడ్ ని యాక్సిడెంట్ లాగా చిత్రీకరించాలి అని ప్రయత్నిస్తారు. అలా చేయడం కోసం తంటాలు పడుతూ ఉంటారు. అయితే అంతలోనే ఒక ట్విస్ట్ ఎదురవుతుంది. అది ఏంటి? హాస్టల్ వార్డెన్ శవాన్ని వీళ్ళు ఏం చేశారు? వాళ్ళు ఎదుర్కొన్న సంఘటనలు ఏంటి? అసలు ఆ హాస్టల్ వార్డెన్ వీళ్ళ పేర్లు ఎందుకు రాసి చనిపోయాడు? ఇవన్నీ తెలియాలి అంటే మీరు సినిమా చూడాల్సిందే.
రివ్యూ :
సినిమా అంతా కూడా ఒక నైట్ లో జరుగుతుంది. ఈ నగరానికి ఏమైంది లాంటి ఫన్ అడ్వెంచర్ సినిమాలకి డిమాండ్ చాలా ఎక్కువ. ఈ సినిమా కూడా అలాంటి కోవలోకే చెందుతుంది. కాకపోతే ఈ సినిమాలో కామెడీ తో పాటు కాస్త సస్పెన్స్ కూడా యాడ్ చేశారు. కన్నడలో ఈ సినిమాకి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. దాంతో ఈ సినిమాని తెలుగులో కూడా డబ్ చేసి విడుదల చేశారు. దర్శకుడు ఎంచుకున్న స్టోరీ పాయింట్ చాలా సింపుల్ గా అనిపిస్తుంది.

కానీ దాన్ని తీసిన విధానం మాత్రం చాలా కాంప్లెక్స్ గా ఉంటుంది. దాదాపు 500 మంది నటులు ఇందులో కనిపించారు. ఒక రాత్రిలో ఒక హాస్టల్ లో ఉండే వాళ్లు ఎదుర్కొనే సంఘటనలు ఏంటి అనే విషయాన్ని ఎక్కడా బోర్ కొట్టకుండా చూపించారు. కేవలం సస్పెన్స్ మాత్రమే కాకుండా ఒక హాస్టల్ లో ఎలాంటి అల్లరి చేస్తారు అనే విషయాన్ని కూడా చూపించారు. ఇంక పెర్ఫార్మన్స్ విషయానికి వస్తే సినిమాలో ఉన్న అందరూ కూడా తమ పాత్రలకి తగ్గట్టు చేశారు.

కానీ సినిమాకి పెద్ద హైలైట్ మాత్రం వార్డెన్ పాత్ర పోషించిన మంజునాథ్ నాయక. అంతే కాకుండా ఈ సినిమాలో హీరో రిషబ్ శెట్టి, ఒక వెరైటీ పాత్రలో దర్శకుడు తరుణ్ భాస్కర్, అలాగే మరొక పాత్రలో రష్మీ గౌతమ్ కూడా కనిపిస్తారు. టెక్నికల్ గా సినిమా చాలా బాగుంది. సినిమా మొత్తం ఒకే చోట జరుగుతుంది. ఇలా ఒక ప్లేస్ లో మాత్రమే జరిగే సినిమాల్లో కెమెరా వర్క్ ఎంత బాగుంటే సినిమా అంత బాగుంటుంది. ఈ సినిమాకి అది చాలా పెద్ద ప్లస్ అయ్యింది. అజనీష్ లోక్నాథ్ అందించిన పాటలు కూడా బాగున్నాయి.

డైలాగ్స్ చాలా బాగా రాశారు. చూస్తున్నంత సేపు ఒక డబ్బింగ్ సినిమా చూస్తున్నాం అని అస్సలు అనిపించదు. కానీ కొన్ని సీన్స్ మాత్రం రేపిటిటివ్ గా అవుతూ ఉంటాయి. అంతే కాకుండా సెకండ్ హాఫ్ లో చాలా సాగదీశారు. అంతే కాకుండా చాలా చోట్ల అరుస్తూ మాట్లాడుతారు. అది కొన్ని సార్లు బాగానే ఉన్నా కొన్ని సార్లు మాత్రం చిరాకు అనిపిస్తుంది. కొన్ని సీన్స్ విషయంలో జాగ్రత్త తీసుకొని ఉంటే బాగుండేది ఏమో అనిపిస్తుంది.
ప్లస్ పాయింట్స్ :
- వార్డెన్ పాత్ర
- సినిమాటోగ్రఫీ
- దర్శకుడు ఎంచుకున్న పాయింట్
- డైలాగ్స్
మైనస్ పాయింట్స్:
- రిపీట్ అయ్యే కొన్ని సీన్స్
- సెకండ్ హాఫ్ లో ల్యాగ్ అయ్యే కొన్ని ఎపిసోడ్స్
రేటింగ్ :
3 / 5
ట్యాగ్ లైన్ :
హాస్టల్ లో చదువుకున్న వారికి ఈ సినిమా చాలా రిలేట్ అవుతుంది. హాస్టల్ లో చేసే అల్లరి, అక్కడ ఎలా ఉంటారు అనే విషయాలని డైరెక్టర్ చాలా సహజంగా చూపించారు. ఫన్ సస్పెన్స్ ఎంటర్టైనర్ సినిమాలు రావడం చాలా తక్కువ. అలాంటి సినిమాల్లో బెస్ట్ సినిమాల్లో ఒకటిగా బాయ్స్ హాస్టల్ సినిమా నిలుస్తుంది.
watch trailer :
ALSO READ : మొత్తం సినిమా ఒక ఎత్తు… క్లైమాక్స్ మరొక ఎత్తు..! ఈ సినిమా చూశారా..?




ప్రముఖ మలయాళ నటుడు హీరోగా నటించిన సినిమా ‘ఇరట్టా’. థియేటర్లలో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయిన ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతోంది. హీరోయిన్ అంజలి కీలక పాత్రలో నటించింది. కథ విషయానికి వస్తే, కేరళలో వాగమన్ అనే ఊరిలో ఉన్న పోలీస్ స్టేషన్లో జరిగే ఒక కార్యక్రమానికి మినిస్టర్ అతిథిగా వస్తుండడంతో పోలీసులు ఏర్పాట్లు చేస్తుంటారు. ఇంతలో తుపాకీ పేలిన సౌండ్ రావడంతో అందరూ అక్కడికి వెళ్ళి చూస్తారు. అక్కడ ఏఎస్ఐ వినోద్ (జోజు జార్జి) చనిపోయి ఉంటాడు.
ఎవరు వినోద్ చంపారో తెలియదు. దాంతో పోలీస్ స్టేషన్ ను లాక్ చేసి, అక్కడ ఉన్నవారిని బయటకు వెళ్లనియకుండా చేసి, విచారిస్తూ ఉంటారు. వినోద్ చనిపోయిన సంగతి వినోద్ కవల సోదరుడు అయిన డీఎస్పీ ప్రమోద్ (జోజు జార్జి సెకండ్ రోల్) కు తెలుస్తుంది. వెంటనేప్రమోద్ అక్కడికి చేరుకుంటాడు? ఇంతకీ వినోద్ను చంపింది ఎవరు? ప్రమోద్, వినోద్ లు మధ్య గొడవ ఏంటి ? మాలిని (అంజలి) ఎవరు? అనేది మిగతా కథ.
రోజు పేపర్ లో కానీ, న్యూస్ లో కానీ కొన్ని డిస్టర్బింగ్ ఇన్సిడెంట్స్ చూస్తుంటాము. దర్శకుడు రోహిత్ ఎంజీ కృష్ణన్ అలాంటి వార్తలలో ఒక పాయింట్ తీసుకుని, ఆ పాయింట్ చుట్టూ క్రైమ్ థ్రిల్లర్ ను రాసుకున్నారు. పోలీస్ స్టేషన్లో వినోద్ చనిపోయే సీన్తోనే మూవీ ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత పోలీసులు అనుమానితులను విచారించగా, ఒక్కొక్కొరు వినోద్తో వారికున్న గొడవల గురించి చెప్పడం. ఫ్లాష్బ్యాక్ తో వినోద్ హత్య వెనుక కారణాలను రివీల్ చేయడం ఆకట్టుకుంటుంది.
ఆఖరికి వినోద్ను ప్రమోద్ హత్య చేసినట్లుగా అనుమానించడంతో ప్రమోద్ ఆ కేసును ఛాలెంజింగ్గా తీసుకుంటాడు. ప్రమోద్ మిస్టరీని చేధించే సన్నివేశాలను డైరెక్టర్ ఊహలకు అందని విధంగా రాసుకున్నారు. జోజో జార్జ్ ఈ మూవీని నిర్మించారు. డ్యూయల్లో రోల్లో జోజు జార్జ్ నట విశ్వరూపం చూపించాడు. అంజలికి ఒక్క డైలాగ్ ఉండదు. మిగిలినవారు తమ పాత్రకు తగ్గట్టు నటించారు. రెగ్యులర్ గా వచ్చే క్రైమ్ థ్రిల్లర్ చిత్రాలతో పోలిస్తే డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ను అందించే సినిమా. క్లైమ్యాక్స్ లో ట్విస్ట్ మాత్రం ఆడియెన్స్ మనసుల నుండి సులభంగా పోదు.

అలనాటి హీరో V. K నరేష్ తనయుడు నవీన్ విజయకృష్ణ, అయినా ఇష్టం నువ్వంటే, రెండు జెళ్ళ సీత, నందిని నర్సింగ్ హోమ్ వంటి చిత్రాల్లో నటించిన మంచి సక్సెస్ ని అందుకోలేక సినీ ఇండస్ట్రీకి దూరమయ్యారు. ఎన్ని అవకాశాల కోసం ట్రై చేసిన చాన్స్ రాకపోవడంతో సినీ ఇండస్ట్రీ నుంచి కనుమరుగైపోయాడు.









చంద్రయాన్ 3 సక్సెస్ అయినందుకు రెబల్ స్టార్ ప్రభాస్ తన సోషల్ మీడియా ఖాతాలో ఇస్రోను అభినందించాడు. ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ లో ప్రభాస్ ఇస్రోను ట్యాగ్ చేశాడు. దాంతో దేశవ్యాప్తంగా ప్రభాస్ అభిమానులలో జోష్ మొదలైంది. ప్రభాస్ ఫ్యాన్స్ సోషల్ మీడియాల్లో తమ సంతోషాన్ని తెలుపుతున్నారు. అయితే ప్రభాస్ అభిమానులు అక్కడికే పరిమితం కాకుండా చంద్రయాన్ 3 మిషన్ విజయాన్ని ప్రభాస్ నటిస్తున్న సలార్ తో లింక్ చేస్తున్నారు.
చంద్రయాన్ 3 విజయం కావడం ప్రభాస్ సలార్ మూవీకి కి కలిసి వస్తుందని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. దానికి కారణం ఏమిటంటే 2019 జులైలో చంద్రయాన్ 2 లాంచ్ అయ్యింది, కానీ విఫలం అయ్యింది. అదే ఏడాది ఆగస్ట్ లో రిలీజ్ అయిన సాహో మూవీ కూడా నిరాశ పరిచింది. చంద్రయాన్ 3 సక్సెస్ అయ్యింది. సలార్ కూడా ఇదే ఏడాది రిలీజ్ కానుండడంతో ఈ సెంటిమెంట్ వర్కౌట్ అయ్యి హిట్ అవుతుందని సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు.
సలార్ మూవీకి కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రం పై భారీ అంచనాలు ఉన్నాయి. సలార్ బాక్సాఫీస్ దగ్గర రికార్డులు సృష్టిస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. ఇక ఈ మూవీ సెప్టెంబర్ లో విడుదల కానుంది. ఆదిపురుష్ వంటి డిజాస్టర్ మూవీ తర్వాత ఈ చిత్రం రిలీజ్ అవుతుండడంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఈ మూవీ భారీ విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నారు.








సూపర్ స్టార్ రజనీకాంత్ లేటెస్ట్ సినిమా ‘జైలర్’. బాక్సాఫీస్ దగ్గర రికార్డులు బ్రేక్ చేస్తోంది. ఈ మూవీ ఆగస్టు 10న థియేటర్లలో రిలీజ్ అయ్యి, తమిళంలోనే కాకుండా తెలుగులోనూ రజనీకాంత్ సినిమా రికార్డులు సృష్టించింది. ఈ మూవీలో కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, మలయాళ స్టార్ మోహన్లాల్, బాలీవుడ్ యాక్టర్ జాకీష్రాఫ్ కీలక పాత్రలో నటించారు. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ సంగీతాన్ని అందించారు. జైలర్ మూవీతో రజనీకాంత్ చాలా సంవత్సరాల తర్వాత బ్లాక్ బస్టర్ హిట్ సాధించారు. దీంతో ‘తలైవా ఈజ్ బ్యాక్’ అని రజనీ ఫ్యాన్స్ సంతోషపడుతున్నారు.
అయితే ఈ మూవీ గురించి తాజాగా ప్రముఖ దర్శకుడు ప్రవీణ్ గాంధీ మాట్లాడుతూ రజినికాంత్ ఈ మూవీలో చెప్పిన డైలాగ్ ఆయన జీవితానికి సంబంధించినదే అని చెప్పారు. క్లైమాక్స్ సీన్లో రజిని తన కుమారుడితో ఏదైనా చెప్పాలని ఉందా నాన్న? అంటూ పదేపదే అడిగే సీన్ ఉంటుంది. ఆ సమయంలో రజినికాంత్ రియల్ లైఫ్ లో బాధను చూపిస్తుందని అన్నారు. ఇది డైలాగ్ మాత్రమే కాదు.
ఆయన జీవితం అని ఆ డైలాగ్ చెప్పే సమయంలో రజనీకాంత్ కి కుమార్తె ఐశ్వర్య మరియు ధనుష్ గుర్తుకు వచ్చి ఉంటారని అన్నారు. ధనుష్, ఐశ్వర్య విడాకులు రాత్రికి రాత్రే తీసుకున్న డిసిషన్ కాదు. దీని గురించి రజనీ తన కుమార్తెను నేరుగా అడగలేరు. అందువల్ల ఆయన ‘ఈ నాన్నగారితో ఏదైనా చెప్పాలా అంటూ ఐశ్వర్యను చాలాసార్లు అడిగారు’ అంటూ ప్రవీణ్ గాంధీ వెల్లడించారు.