అఖిల్ అక్కినేని హీరోగా ఇటీవల విడుదల అయిన సినిమా ఏజెంట్. ఈ సినిమాకి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ సినిమా తెలుగుతో పాటు మిగిలిన భాషల్లో కూడా విడుదల చేయాలి అని అనుకున్నారు. కానీ కేవలం తెలుగు మలయాళం భాషల్లో మాత్రమే విడుదల చేశారు.
మలయాళంలో కూడా విడుదల చేయడానికి కారణం ఈ సినిమాలో మలయాళం స్టార్ హీరో మమ్ముట్టి ఒక ప్రధాన పాత్రలో నటించారు. అయితే ఈ సినిమా విడుదల అయిన తర్వాత నుండి నెగిటివ్ రెస్పాన్స్ వస్తోంది. కొంత మంది సినిమా బాగుంది అంటే, మరి కొంతమంది మాత్రం సినిమాని విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు.

ఆ ట్రోలింగ్ ఎంతవరకు వెళ్ళింది అంటే అసలు ఈ విషయాలపై ఎప్పుడూ మాట్లాడని అఖిల్ తల్లి అమల అక్కినేని కూడా ఈ విషయంపై స్పందించి ఇలా చేయడం తప్పు అని మాట్లాడారు. సినిమాలో నెగిటివ్ పాయింట్స్ ఉన్నా కూడా, సినిమాలో చాలా మంచి విషయాలు కూడా ఉన్నాయి అని కొంత మంది అంటున్నారు. మరి ఈ సినిమాకి నెగిటివ్ టాక్ రావడానికి కారణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

#1 మొదటి విషయం సినిమా టెక్నికల్ గా చాలా బాగుంది. సినిమాకి పెట్టిన ఖర్చు అంతా కూడా సినిమా చూస్తున్నప్పుడు ప్రతి చిన్న విషయంలో తెలుస్తోంది. క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా ఈ సినిమా తీశారు. లొకేషన్స్ కూడా గ్రాఫిక్స్ వాడకుండా ఎక్కువగా రియల్ లొకేషన్స్ లోనే షూట్ చేయడంతో ఒక మంచి యాక్షన్ సినిమా చూస్తున్న ఫీల్ వచ్చింది.
కానీ కథనం విషయంలో మాత్రం చాలా బలహీనంగా ఉంది. అలాంటి స్టోరీ లైన్ ఉన్న సినిమాలు మనం ఇంతకుముందు చాలా చూసాం. కొత్తగా చూపించాలని ప్రయత్నం చేశారు కానీ అవి పేక్షకులని కొంతవరకు నిరాశపరిచాయి. దాంతో చాలా మంది, “స్టోరీ లైన్ విషయంలో ఇంకా కొంచెం జాగ్రత్త తీసుకొని ఉంటే బాగుండేది ఏమో” అని అన్నారు.

#2 సినిమాకి ప్లస్ అయినా మైనస్ అయినా కూడా ప్రేక్షకులు ఎక్కువగా చూసేది హీరో పాత్రని రాసిన విధానం. హీరో పాత్ర పాజిటివ్ గా లేకపోయినా కూడా కొత్తగా ఉంటే ప్రేక్షకులు చూస్తారు. కానీ అలా కొత్తదనం గురించి ఆలోచిస్తూ కొన్ని సినిమాల్లో కొంత మంది హీరోల పాత్రలు కొంచెం అతిగా ప్రవర్తించేలాగా ఉంటున్నాయి. ఈ సినిమాలో హీరో పాత్ర అలాగే ఉంది. అఖిల్ అక్కినేని ఈ సినిమా కోసం తనని తాను మార్చుకున్న విధానం అభినందించాల్సిన విషయం. కానీ కొన్ని సీన్స్ లో మాత్రం పర్ఫార్మెన్స్ పరంగా కొంచెం ఓవర్ గా అనిపించింది అనే కామెంట్స్ వచ్చాయి.

#3 సినిమా పాటలు బాగుంటే సినిమా సగం హిట్ అయినట్టే అంటూ ఉంటారు. కానీ ఈ సినిమాకి పాటలు మాత్రం చాలా పెద్ద మైనస్ అయ్యాయి. పాటలు విడుదల అయినప్పుడు వినడానికి బానే ఉన్నాయి అనుకున్నారు. కానీ అవి సినిమాలో చూస్తూ ఉంటే అసలు సినిమా ఫ్లోని అవి డిస్టర్బ్ చేసే లాగా ఉన్నాయి. అంతే కాకుండా కొన్ని చోట్ల బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఒక యాక్షన్ సీన్ నడుస్తూ ఉంటే అదేదో ఎమోషనల్ సీన్ కి వచ్చిన మ్యూజిక్ వస్తూ ఉన్నట్టు అనిపిస్తుంది. కనీసం బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంటే సినిమా ఇంకా కొంచెం బాగుండేది ఏమో అని అన్నారు.

#4 సినిమాలో హీరో పాత్రని రాసుకున్న అంత బలంగా విలన్ పాత్ర కూడా రాసుకొని ఉంటే చాలా వరకు సినిమాలో ప్రేక్షకులకి నచ్చుతాయి. అందుకు ఒక ఉదాహరణ ధ్రువ సినిమా. ఈ సినిమాలో చాలా చోట్ల హీరో కంటే చాలా ఎక్కువ స్మార్ట్ గా విలన్ ఆలోచిస్తాడు. కానీ అలా అని హీరో తగ్గిపోలేదు. ఇలాంటి యాక్షన్ సినిమాలకి విలన్ పాత్ర చాలా బాగుండడం కూడా ముఖ్యమైన విషయం.
కానీ ఇలాంటి సినిమాలో కూడా విలన్ పాత్ర ఏదో ఉన్నాడు అంటే ఉన్నాడు అన్నట్టు, హీరోకి వార్నింగ్ ఇస్తూ, ఫైటింగ్ చేస్తూ ఉంటాడు అంతే. విలన్ పాత్ర పోషించిన నటుడు బాగా చేశాడు. అసలు అతనికి ఇండియా మీద ఎందుకు అంత కోపం అనే పాయింట్ ఇంకా బాగా చూపించి ఉంటే బాగుండేది.

#5 సినిమాకి కాస్టింగ్ కూడా చాలా ముఖ్యమైన విషయం. కొంత మంది పాత్రలు బాగానే ఉన్నా కూడా, కొంత మంది ముఖ్యమైన పాత్రలు ఇంకా కొంచెం జాగ్రత్త పడి ఉంటే బాగుండేది ఏమో అనిపిస్తుంది. అందులోనూ ముఖ్యంగా హీరోయిన్ సాక్షి వైద్య అయితే లిప్ మూమెంట్ ఒకటి వస్తూ ఉంటే తను మాట్లాడేది ఒక డైలాగ్ ఉంటుంది. ఇది ఒకటి రెండు చోట్ల కాదు. చాలా చోట్ల జరిగింది. దాంతో చాలా మంది, “హీరోయిన్ పాత్రకి వేరే ఇంకా ఎవరిని అయినా తీసుకొని ఉంటే బాగుండేది ఏమో” అని అన్నారు.

ప్రస్తుతం అయితే ఏజెంట్ సినిమాకి మిక్స్డ్ టాక్ వస్తోంది. కొంత మంది చాలా రొటీన్ సినిమా అంటే, మరి కొంత మంది మాత్రం చాలా స్టైలిష్ గా ఉంది అని అంటున్నారు. కొంత మంది అఖిల్ అక్కినేని, మమ్ముట్టి పర్ఫార్మెన్స్ బాగుంది అంటున్నారు.
ALSO READ : “వాల్తేరు వీరయ్య” నుండి… “విరూపాక్ష” వరకు… 2023 లో ఇప్పటివరకు “హిట్” టాక్ తెచ్చుకున్న 10 సినిమాలు..!

ఢీ షో కొరియోగ్రాఫర్ చైతన్య నెల్లూరులోని ఒక హోటల్ గదిలో ఆదివారం నాడు ఫ్యాన్కు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. అప్పుల బాధలు తట్టుకోలేక ఇటువంటి నిర్ణయాన్ని తీసుకుంటున్నట్లుగా చైతన్య సెల్ఫీ వీడియోలో వెల్లడించాడు. అప్పుల తీర్చే శక్తి ఉన్నప్పటికి, ఒత్తిడిని తట్టుకోలేకపోతున్నానని ఆ వీడియోలో తెలిపాడు. చైతన్య మరణ వార్త షాక్ కు గురి చేసిందని, అతనికి అప్పులు ఉన్నట్టు తమకు తెలియదని సన్నిహితులు అంటున్నారు.
డ్యాన్స్ మాస్టార్ చైతన్య మృతికి యాంకర్ రష్మి, శేఖర్ మాస్టర్, శ్రద్ధాదాస్ లతో పాటు ఢీ షో డ్యాన్సర్లు కూడా సంతాపం తెలుపుతున్నారు. అయితే చైతన్య మరణం గురించి తెలిసి ఢీ కంటెస్టెంట్లు, చైతన్య సన్నిహితులు అప్పుల వల్ల బలవన్మరణానికి పాల్పడ్డాడు అంటే నమ్మలేకపోతున్నాం. చైతన్యకు అప్పులు ఉన్నాయనే సంగతే తమకు ఇప్పటి వరకు తెలియదని, చైతన్య వాటి గురించి తమతో మాట్లాడి ఉంటే అందరం చర్చించుకుని ఈ సమస్యకు మార్గాన్ని ఆలోచించేవాళ్లం, అలాగే చైతన్యకు మద్దతుగా ఉండేవారమని తెలిపారు.
అయితే చైతన్య ఎప్పుడూ తన సమస్యను మాతో షేర్ చేసుకోలేదని, తనలోనే బాధపడి, ఆఖరికి ఇలాంటి డిసిషన్ తీసుకున్నాడని విచారాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ చైతన్య తన సమస్యను, బాధను సన్నిహితులతో పంచుకుని ఉంటే ఇలా అయ్యేది కాదేమో అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
ఈ మధ్య కాలంలో ఇలాంటి సంఘటనలు తరచుగా జరుగుతున్నాయి. తమ బాధని ఎవరితో పంచుకోకుండా తమలో తామే కుంగిపోతూ చివరికి ఇలాంటి నిర్ణయాలు తీసుకుని తమ జీవితాన్ని అర్ధాంతరంగా ముగిస్తున్నారు. ఇక డాన్స్ మాస్టర్ చైతన్య కూడా అటువంటి తప్పే చేశాడు. తన సమస్య గురించి కానీ, పరిస్థితి గురించి ఎవ్వరితో పంచుకోలేదు. తనలో తానే బాధపడుతూ ఆఖరికి ప్రాణం తీసుకున్నాడు. ఎంతో ఎత్తుకు ఎదుగుతాడనుకున్న కొడుకు తమ కళ్ళ ముందే మరణించడంతో చైతన్య తల్లిదండ్రులను ఓదార్చడం ఎవరి వల్ల కావడం లేదు.
కొరియోగ్రాఫర్ చైతన్య బలవన్మరణానికి ఆర్ధిక ఇబ్బందులే కారణం అని తెలుస్తోంది. అప్పుల బాధను భరించలేక, ఆ ఒత్తిడిని తట్టుకోలేక ప్రాణం తీసుకుంటున్నట్లు మరణానికి ముందు చైతన్య సెల్ఫీ వీడియోను విడుదల చేశాడు. ఆ వీడియోలో తన బలవన్మరణానికి కారణాలను వెల్లడించాడు. కొరియోగ్రాఫర్గా మంచి భవిష్యత్ ఉన్న డాన్స్ మాస్టర్ చైతన్య ఇలా అర్ధాంతరంగా కన్నుమూయడం అందరినీ కలిచివేసింది.
చైతన్య మరణం పై పలువురు టెలివిజన్ ప్రముఖులు దిగ్భ్రాంతిని వ్యక్త పరుస్తున్నారు. ఈ క్రమంలో చైతన్య మాస్టర్ మరణం పై డ్యాన్సర్ కండక్టర్ ఝాన్సీ తాజాగా స్పందించారు. ఆయన మరణం పై విచారం వ్యక్తం చేసింది. చైతన్య తీసుకున్న ఈ తొందరపాటు నిర్ణయంతో ఆయన ఫ్యామిలీ అంతా బాధపడుతోంది. చైతన్య డబ్బులు ఇవ్వవలసిన వారితో కూర్చుని తన పరిస్థితి వివరించినట్లయితే ఇలా జరిగి ఉండేది కాదేమో అని అన్నారు.
అందరూ చైతన్యతో కలిసి జర్నీ చేసినవారే. అందులోనూ కళాకారులు వేధించే అంత కఠినమైనవారు కాదు. ఆయన ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడో, చైతన్య తోటివారికి సహాయం చేసేవాడని తెలిపింది. నాలుగు రోజుల క్రితమే డాన్స్ మాస్టర్ చైతన్యను కలిసి ఢీ డ్యాన్స్ షోలో తనకు ఛాన్స్ ఇవ్వమని అడిగానని, దానికి ఆయన నెక్స్ట్ సీజన్ లో తప్పకుండా అవకాశం ఇస్తానని చెప్పారు. ఆయన తన కింద ఉన్న డాన్సర్లకు కూడా చాలా గౌరవం ఇస్తారని డ్యాన్సర్ ఝాన్సీ తెలిపారు.
1.జీవన తరంగాలు:
2.మీనా:
3.సెక్రటరీ:
4. అభిలాష:
5. ఏప్రిల్ 1 విడుదల:
6. ఛాలెంజ్:
7. సితార:
8. అహా నా పెళ్ళంట:
9. చంటబ్బాయ్:
10. ఆఖరి పోరాటం:
11. దొంగ మొగుడు:
12. జ్యోతి లక్ష్మి:
13. మిధునం:
14. జ్యో అచ్యుతానంద:
15. అ..ఆ:























టాలీవుడ్ లో ప్రస్తుతం వరుసగా మల్టీ స్టారర్ చిత్రాలు వస్తున్నాయి. కానీ దానికి కారణం ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ అని చెప్పడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. ఈ చిత్రాన్ని నిర్మాత దిల్ రాజు ‘శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్’ బ్యానర్ పై నిర్మించారు. ఈ మూవీలో పెద్దోడిగా వెంకటేష్, చిన్నోడిగా మహేష్ నటించి మెప్పించారు. మహేష్ బాబుకు జంటగా హీరోయిన్ సమంత నటించగా, వెంకటేష్ కు జంటగా అంజలి నటించింది.
దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల ఈ చిత్రంలో కుటుంబాలు, కటుంబ సభ్యుల మధ్యన ఉండే అనుబంధాల గురించి చాలా బాగా చూపించారు. ఈ చిత్రంలోని పాత్రలను చాలా సహజంగా చూపించారు. ఎంతలా అంటే ఈ మూవీ మన ఇంట్లో లేదా పక్కింట్లోనో జరుగుతున్నట్టుగా అనిపిస్తుంది. ఇక మహేష్, వెంకటేష్ నటన నిజంగా అన్నతమ్ముళ్ళేమో అన్న విధంగా నటించారు. వారి నటన ఆడియెన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంది. అన్నతమ్ముళ్ళ మధ్య వచ్చే సీన్స్ వారి ఎమోషన్స్ ను కూడా చక్కగా చూపించారు.
కుటుంబ పెద్దగా ప్రకాష్ రాజ్, ఆయన భార్యగా జయసుధ తమ పాత్రలలో ఒదిగిపోయారు. ఆమె అత్తగా, హీరోలకి బామ్మగా సీనియర్ నటి రోహిణి హాట్టంగడి నటించారు. అత్తకోడళ్ల మధ్య అనుబంధాన్నిచక్కగా చూపించారు. అయితే ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలను తొలగించారు. అయితే ప్రస్తుతం డిలీట్ చేసిన ఆ సీన్ ను సోషల్ మీడియాలో నెటిజెన్లు షేర్ చేస్తున్నారు.
ఆ సన్నివేశంలో ఒక మహిళ జయసుధను మీ అత్తగారు మీతోనే ఉంటుందా అని అడిగితే, దానికి జయసుధ ఆమె మాతో కాదు మేమే మా అత్తగారితో ఉంటున్నాం. ఆమె ఉండమంటే ఉంటాం. లేదంటే లేదు అంతా మా అత్తగారి ఇష్టమే అని చెప్తుంది. ఈ సీన్ చూసినవారు నిజంగా ఇలా ఉంటే ఎంత బాగుంటుందో అని కామెంట్స్ చేస్తున్నారు.

























ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన సమంత కొద్ది కాలంలోనే తన ప్రతిభతో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ప్రస్తుతం వరుసగా ప్రాజెక్ట్స్ చేస్తూ కెరీర్ లో కొనసాగుతున్నారు. ఆమె పర్సనల్ లైఫ్ లో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, వాటి ఎఫెక్ట్ తన కెరీర్ పై పడకుండా ఇండస్ట్రీలో రాణిస్తోంది. సమంత తన అందం, నటనతో స్టార్ హీరోల అంత ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. తాజాగా సమంతకు ఒక అభిమాని తన ఇంట్లోనే గుడి కట్టాడు.
సమంత పుట్టినరోజు సందర్బంగా ఏప్రిల్ 28న సమంత గుడిని ప్రారంభించాడు. ఏపీలోని బాపట్ల జిల్లాకు చెందిన సందీప్ కి హీరోయిన్ సమంత అంటే ఎంతో అభిమానం. సమంత నటిగా కంటే ఆమె ప్రత్యూష ఫౌండేషన్ ద్వారా చేస్తున్న సేవలు సందీప్ ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ ఫౌండేషన్ ద్వారా ఎంతో మంది ప్రాణాలు నిలిచాయి. దీంతో సమంత పై అతనికి మరింత అభిమానం పెరిగింది.
ఆ అభిమానంతోనే హీరోయిన్ సమంతకు తన ఇంట్లోనే గుడి కట్టాడు. సమంత పుట్టినరోజున గ్రాండ్ గా ఆ గుడిని అందరి మధ్య ప్రారంభించాడు. అయితే ఈ గుడి కట్టడం కోసం సందీప్ పెట్టిన ఖర్చు అందరిని ఆశ్చర్యపోయేలా చేస్తోంది. సుమారు 5-6 లక్షల వరకు ఖర్చు చేసి తన అభిమాన నటి సమంతకు గుడి కట్టించాడట.
ఈ గుడి వీడియో సామాజిక మధ్యమాలలో వైరల్ అవడంతో నెటిజన్లు, ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కొందరు అయితే గుడి బానే ఉంది. కానీ విగ్రహం అలా ఉందేంటి, ఇంతకీ సమంత ఎక్కడ అని కామెంట్స్ చేస్తున్నారు.