బాహుబలి సినిమా తర్వాత తెలుగు సినిమా పరిశ్రమ యొక్క స్థాయి పెరిగింది. తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పాడు రాజమౌళి. ఈ మూవీ తో ప్రాంతీయ చిత్రాలకు సరిహద్దులు చెరిగిపోయాయి. ఆ చిత్రం తో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు.
అయితే బాహుబలి సినిమాలో ప్రభాస్ రానా అనుష్క పాత్రలు ఎంత హైలెట్ గా నిలిచాయో కట్టప్ప పాత్ర కూడా అంతే స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. ప్రభాస్ సత్యరాజ్ మధ్య సీన్స్ సినిమాను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాయి. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు..? అంటూ ప్రపంచ దేశాలు కొన్నాళ్లు చర్చించుకున్నాయి. ఆ తర్వాత బాహుబలి పార్ట్ 2 వచ్చాక అసలు ట్విస్ట్ బయటపడింది.

రాజ్యానికి నమ్మిన బంటులా ఉంటూ ఆయన పాత్ర సినిమాను మార్చేస్తోంది. రెండో భాగం అంత హైప్ రావడానికి కట్టప్ప పాత్ర కీలకం. అయితే ఈ పాత్ర కోసం ముందుగా సత్యరాజ్ ని అనుకోలేదట. అయితే నిజానికి ఈ సినిమాలో కట్టప్ప రోల్ అనుకోగానే రాజమౌళి ముందు గా బాలీవుడ్ హీరో సంజయ్ దత్ ని అనుకున్నారట.

బాలీవుడ్ యాక్షన్ స్టార్ హీరో కమ్ విలన్ సంజయ్ దత్ ఈ మధ్య సౌత్ సినిమాల మీద ఆసక్తి చూపిస్తున్న ఆయన కె.జి.ఎఫ్ 2లో విలన్ గా అదరగొట్టారు. అయితే అంతకు ముందే తెలుగు సినిమా ఆఫర్ వచ్చినా తాను చేయలేదని అన్నారు సంజయ్ దత్. బాహుబలి సినిమాలో కట్టప్ప పాత్రకు రాజమౌళి తనని అడిగారని కానీ ఆ టైం లో డేట్స్ అడ్జస్ట్ చేయడం కుదరలేదని అన్నారు సంజయ్ దత్. కానీ కట్టప్పగా సంజయ్ దత్ చేసి ఉంటే సినిమా మరో రేంజ్ లో ఉండేది.

సంజయ్ దత్ కూడా కట్టప్ప పాత్ర మిస్ అయినందుకు తర్వాత ఫీల్ అయ్యానని ఆ పాత్ర రాజమౌళి చాలా గొప్పగా తెరకెక్కించారని అన్నారు . అయితే నటుడు సత్యరాజ్ కట్టప్ప పాత్రకు ప్రాణం పోశారని చెప్పాలి. ఈ పాత్ర తో సత్యరాజ్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది.



ఆమె పేరు రాశి సింగ్. ఆది సాయికుమార్, సురభి హీరోహీరోయిన్లుగా నటించిన ‘శశి’ సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టింది. ఈ చిత్రం 2021లో విడుదల అయ్యింది. ఆమె వృత్తి రీత్యా ఎయిర్ హోస్టెస్. ఆమెకు చిన్నప్పటి నుంచి నటన పై ఉన్న ఇష్టంతో టను చేసే పనిని వదిలి ఇండస్ట్రీకి వచ్చింది. పోస్టర్, రత్నం సినిమాలలోనూ నటించింది. ఇటీవల శివ కందుకూరి హీరోగా తెరకెక్కిన ‘భూతద్దం భాస్కర్ నారాయణ’ సినిమాలో రాశి సింగ్ హీరోయిన్ గా నటించింది.
ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఎవరి మీద ఆదారపడకూడదని, ఏదైనా నేర్చుకోవలనే ఉద్దేశ్యంతో ఎయిర్ హోస్టెస్ వృత్తిని ఎంచుకున్నానని తెలిపింది. ఎయిర్లైన్స్లో పని చేశానని, దాని కోసమే తాను హైదరాబాద్కు మారాల్సి వచ్చిందని తెలిపింది. ఆ క్రమంలో తెలుగు సినీ పరిశ్రమకు రావడం వెనుక నా ఉద్యోగం కూడా ఒక కారణం అని అన్నారు. నటిని కావాలనే తన కలను నిజం చేసుకోవడానికి ఇండస్ట్రీకి వచ్చానని తెలిపింది. అవకాశం వస్తే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్గారి పక్కన నటించాలనేది తన కల అని అన్నారు.
రాశి సింగ్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలను ఇంస్టాగ్రామ్ లో షేర్ చేస్తుంటుంది. ఆమెకు ఫాలోవర్స్ కూడా వేలల్లో ఉన్నారు. ఇక సోమవారం ఉప్పల్ స్టేడియంలో మెరిసిన ఈ బ్యూటీ గురించి తెలుసుకోవడానికి నెటిజెన్లు ఆన్లైన్ లో తెగ వెతుకుతున్నారు.
ముఖ్యంగా బిచ్చగాడు సినిమాలోని మదర్ సెటిమెంట్ అందరిని కదిలించింది. క్లాస్ మాస్ భేదం లేకుండా అన్నీ వర్గాల ఆడియెన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సినిమాలో ముందుగా తెలుగు హీరో శ్రీకాంత్ ను అనుకున్నారట. ఈ విషయన్ని శ్రీకాంత్ తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.
శ్రీకాంత్ మాట్లాడుతూ ఇంట్రెస్టింగ్ విషయాలను ఇలా చెప్పుకొచ్చారు. విజయ్ ఆంటోని తాను హీరోగా నటించిన ‘మహాత్మ’ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ గా చేశారు. అప్పటి నుండి విజయ్ తో పరిచయం ఉందని అన్నారు. తరువాత విజయ్ తమిళంలో ‘పిచ్చైకారన్’ మూవీ చేశాడని అన్నారు. విజయ్ ఫ్రెండ్ అవడంతో బిచ్చగాడు మూవీని తమిళంలో చూసానని, ఆ మూవీ తనకు బాగా నచ్చింది.
ఆ మూవీని తెలుగులో రీమేక్ చేయాలని అనుకున్నామని తెలిపారు. ఈ మూవీ గురించి చర్చించినపుడు తనకు ఇవ్వాల్సిన పారితోషికంతో పాటు మూవీకి బడ్జెట్ అధికం అవుతుండటంతో ఈ మూవీని రీమేక్ చేయలేదని అన్నారు. లేకపోతే బిచ్చగాడు చిత్రంలో నేనే నటించేవాడినని శ్రీకాంత్ వెల్లడించారు. ఇక అధిక బడ్జెట్ కారణంగా మేకర్స్ తమిళ సినిమాని తెలుగులోకి డబ్ చేసి ‘బిచ్చగాడు’ టైటిల్ తో రిలీజ్ చేశారని శ్రీకాంత్ తెలిపారు.


సంపంగి మూవీలోని సాంగ్స్ సూపర్ హిట్ అయ్యాయి. ఈ చిత్రానికి సనా యాదిరెడ్డి డైరెక్షన్ చేశారు. ఈ చిత్రం ద్వారా దీపక్ బజ్వా తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోగా అడుగుపెట్టారు. ఈ మూవీ విజయం సాధించింది. దాంతో దీపక్ కు వరుస ఆఫర్స్ వచ్చాయి. ని తోడు కావాలి, ప్రేమలో పావని కళ్యాణ్, కనులు మూసినా నీవాయే వంటి చిత్రాలలో నటించి, తెలుగు ఆడియెన్స్ కి దగ్గరయ్యారు.
ఆ తరువాత హీరోగా అవకాశాలు తగ్గడంతో ‘భద్ర’ సినిమాతో క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారాడు. అలా దీపక్ అరుంధతి, మిత్రుడు, కింగ్, లాంటి పెద్ద సినిమాలలో నటించారు. డిల్లీలో పుట్టి పెరిగిన దీపక్, అతని అసలు పేరు అర్జన్ బజ్వా. ఇండస్ట్రీలోకి రాకముందు మోడల్ గా గుర్తింపు పొందాడు. వివిధ ప్రకటనలో పెద్ద స్టార్స్ తో కలిసి నటించాడు. టాలీవుడ్ నుండి బాలీవుడ్ కి వెళ్ళిన దీపక్ గురు, ఫ్యాషన్ సినిమాలతో పాపులర్ అయ్యాడు.
వరుస ఆఫర్లతో బాలీవుడ్ లో నటుడుగా రాణిస్తున్నారు. ఆ మధ్యన వచ్చిన దళపతి విజయ్ హీరోగా నటించిన తమిళ మూవీ బిగిల్ లో కనిపించారు. ప్రస్తుతం వెబ్ సిరీస్ లలో నటిస్తున్నారు. దీపక్ మొదటి సినిమా ‘సంపంగి’ వచ్చి ఇప్పటికి 22 సంవత్సరాలు అవుతున్నప్పటికి అతనిలో ఎలాంటి మార్పు కనిపించడం లేదు. అప్పటి లాగే ఫిట్ గా ఉన్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే దీపక్ తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తుంటాడు.
రీసెంట్ గా యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మేకప్ మెన్ వాసు కొప్పిశెట్టి మాట్లాడుతూ బాలయ్య వాడే విగ్గుల గురించి చాలా విషయాలను తెలిపారు. బాలకృష్ణ గారి కోసం చెన్నైలేదా ముంబై నుండి విగ్గులను తెప్పిస్తామని, ఇప్పుడు హైదరాబాదులో చాలా రకాల విగ్గులు అందుబాటులో ఉన్నాయని అన్నారు. అయితే బాలయ్య వాడే విగ్గులు చాలా ఖరీదు ఉంటాయని అన్నారు. బాలయ్య నాసిరకంగా ఉండే విగ్గులను అసలు వాడరని వెల్లడించారు. అందువల్ల బాలకృష్ణ ఉపయోగించే విగ్గుల కోసం లక్షల్లో ఖర్చు పెడతామని వాసు తెలిపారు.
అంతే కాకుండా సినిమా సినిమాకి బాలయ్య నటించే పాత్రను బట్టి, సన్నివేశాలను బట్టి విగ్గులు మార్చాల్సి వస్తుందని కాబట్టి వాటి కోసం అయ్యే ఖర్చును కూడా ప్రొడ్యూసర్స్ భరిస్తారని తెలియచేసారు. కాగా, బాలకృష్ణ చిత్రాలలో విగ్ సెంటిమెంట్ ఉంటుందనే టాక్ కూడా ఉంది. బాలయ్య విగ్గు సెట్ అయితే ఆ మూవీ హిట్ అనే సెంటిమెంట్ పై ఎప్పటినుండో వార్తలు వస్తున్నాయి.
ఈ సెంటిమెంట్ గురించి మేకప్ మెన్ వాసు కొప్పిశెట్టి మాట్లాడుతూ బాలయ్య గారు అలాంటి వాటిని నమ్మరని, బాలయ్యకు విగ్గు సెట్ అయితే మాత్రం ఆ చిత్రంలో చూడటానికి బాగా కనిపిస్తారని చెప్పారు. అందు వల్లనే ఆ చిత్రాలు హిట్ అవుతాయనీ వెల్లడించారు. వాసు కొప్పిశెట్టి బాలయ్య విగ్గుల గురించి చెప్పిన ఈ విషయలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారాయి.




















లెజెండరీ దర్శకుడు మణిరత్నం చాలా కాలం తర్వాత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ‘పొన్నియన్ సెల్వన్ పార్ట్ 2’ అనే పీరియాడిక్ సినిమాతో ఆడియెన్స్ ముందుకు రాబోతున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, పాటలు, ట్రైలర్ తో ఈ మూవీ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ మూవీలో విక్రమ్, కార్తీ, జయం రవి, ఐశ్వర్యరాయ్ బచ్చన్, త్రిష, కీలక పాత్రలలో నటిస్తున్నారు. ప్రముఖ నవల పొన్నియన్ సెల్వన్ ఆధారంగా ఈ సినిమాను రెండు భాగాలుగా తీశారు.
గతంలో వెయ్యి ఏళ్ల క్రితం రాచరిక పాలన కాలంలో మహిళలకు స్థానం లేదని హిస్టరీ పాఠాలలో చదువుకున్నాము. కానీ అవి తప్పని నిరూపించే చారిత్రక మహిళా ఉన్నారు. ఆమె కుందవై. పదవ శతాబ్దంలో చోళ సామ్రాజ్యం వేగంగా విస్తరిస్తున్న సమయంలో రాజు సుందర చోళుడు సామ్రాజ్యాన్ని విస్తరిస్తుంటే, ఆదిత్య కరికాలన్ చోళ సామ్రాజ్య ఖ్యాతిని దక్షణ భారతదేశంలో విస్తరించాడు. తరువాత రాజరాజచోళుడి పాలనలో చోళ ఖ్యాతి ఇండియా దాటి ఖాంబోడియా వరకు విస్తరించింది. అయితే రాజరాజచోళుడి ఖ్యాతి వెనుక ఒక మహిళా చాణిక్య ఉన్నారు.
ఆమె కుందవై. రాజు సుందర చోళుడికి ముగ్గురు పిల్లలు. ఆదిత్య కరికాలన్ , కుందవై, అరుళ్మొళి వర్మన్ (రాజరాజచోళ). చోళులకాలంలో మగవారితో సమనంగా ఆడవారు నిర్ణయాలు తీసుకునేవారు. కుందవై తల్లి మహాదేవి కూడా రాజకీయాల్లో చురుకుగా ఉండేవారు. ఆమె శిక్షణలో కుందవై కూడా శక్తివంతమైన మహిళగా రాజకీయాలు నడిపారు. ఈ నవలను రాసిన రచయిత కాస్తంత కల్పితాన్ని జోడించాడు. వాస్తవంగా ఆదిత్య కరికాలన్ కంటే చాలా చిన్నవాడు అరుళ్మొళి, ఆదిత్యుడు మరణించిన తరువాత కుందవై తమ్ముడిని చూసుకుంది.
సంక్షోభ పరిస్థుతులలో ఉన్న సమయంలో రాజ్యాన్ని తన తెలివితేటలతో కాపాడుకున్న పవర్ ఫుల్ మహిళ. రాజకీయాలు, ఆధ్యాత్మిక, సౌందర్యం, ఎదురులేని చాణక్యం అన్ని కలగలసిన అరుదైన వ్యక్తిత్వం కుందవై. రాజరాజచోలుడు చిక్కుల్లో ఉన్న ప్రతిసారీ తల్లిలా ఆదుకుంది. తంజావూరు బృహధీశ్వర ఆలయ నిర్మాణంలో కుందవై పాత్ర కీలకమైనది. అక్కడ గోడలపై చోళుల శిల్పాలతో పాటుగా, కుందవై శిల్పాలు కనిపిస్తాయి.
కుందవై ఇతర రాజ్యాలతో సయోధ్య, యుద్ధ విషయాలలో ఆమె నిర్ణయాలకు ఎదురులేదు. ఆమె తెలివితేటలను సామంత రాజులు ఎంతో గౌరవించేవారు. తమ కుమార్తెలను శిక్షణ కోసం కుందవై దగ్గరకు పంపించేవారు. ఆమెను వివాహం చేసుకోవడానికి ఎనద్రో రాజులు పోటీ పడేవారు. ఆమె రాజరాజచోలుడి మిత్రుడైన వంధ్యదేవున్ని పెళ్లి చేసుకుందని కల్కి రాసిన నవలలో ఉంది. మరి కొన్ని కథనాల ప్రకారం ఆమె వివాహం చేసుకోలేదని తెలుస్తోంది. ఆమె చాలా కాలం పాలయారైలో ఉండేవారు.
ఇప్పటికి అక్కడ ఉండే చాలా కుటుంబాలు ఆమెను ఆడపడుచుగా పూజిస్తారు. కుందవైని నాచియార్ గా పూజిస్తారు. శైవ నాయనర్ల సాహిత్యాన్ని సేకరించి భద్రపరచింది. ఆ సాహిత్యం ఇప్పటికి భద్రంగా ఉందంటే కుందవై కారణం అని అంటారు. రాజరాజచోళుడికి చరిత్రలో ఇంతగొప్ప స్థానం ఉందంటే దాని వెనుక కుందవై కృషి ఎంతో ఉంది. కానీ ఆమె గురించి చరిత్ర పాఠాలలో ఎక్కడ ప్రస్తావించలేదు.
ఆమె ఆధునికంగా ఆలోచించేది. రాజ్యంలో శాంతి ఉండాలంటే అన్ని సంస్కృతులను గౌరవించాలని చెప్పి, ఆచరించింది. అందుకు అనుగుణంగా ఆమె నిర్మించిన శైవ, వైష్ణవ, జైన ఆలయాలను తమిళనాడులో చూడవచ్చు. ఆమె రాజకీయాలలోనే కాకుండా సంగీత, సాహిత్యంలో జ్ఞాని. ఒకప్పుడు పాండ్య, లంక, చాళక్య రాజ్యాల నుండి చోళ రాజ్యానికి ముప్పు ఉండేది. అయితే ఆ మూడు రాజ్యాల పై రాజ రాజ చోళుడు పట్టు సాధించి, ముమ్మడి చోళుడిగా ఖ్యాతి చెందాడు. ఆ ఖ్యాతి వెనుక ఉన్న మహిళా శక్తి కుందవై.
హీరోల తరువాత హీరోయిన్ల పారితోషికం, వారి తర్వాత స్థాయిలో విలన్ క్యారెక్టర్ పోషించేవారు రెమ్యునరేషన్ తీసుకుంటారు. అయితే హీరోల కన్నా ఎక్కువ పారితోషికం హీరోయిన్లు తీసుకోవడం చాలా అరుదుగా జరుగుతుంది. అప్పట్లో ఎన్టీఆర్ అత్యధిక పారితోషికం తీసుకునే కాలంలో ఇద్దరు హీరోయిన్లు సీనియర్ ఎన్టీఆర్ ను కన్నా ఎక్కువగా ఇద్దరు హీరోయిన్లు పారితోషికం తీసుకుని సంచలనం సృష్టించారు. అయితే ఈ విషయం ఎక్కువ మందికి తెలియదు. ఆ ఇద్దరు హీరోయిన్ల గురించి చూద్దాం..
1. భానుమతి:
2. అంజలి దేవి:
అంతే కాకుండా తన రెమ్యునరేషన్ తానే నిర్ణయించేవారని తెలుస్తోంది. కాగా అప్పటికే టాప్ హీరోయిన్లుగా కొనసాగుతున్న సావిత్రి, రాజసులోచన వంటి హీరోయిన్లు మాత్రం పారితోషికం తక్కువగా తీసుకునే వారంట.