గుప్పెడంత మనసు స్టార్ మాలో ప్రసారం అవుతున్న పాపులర్ సీరియల్. ఈ సీరియల్ ద్వారా పలువురు నటీనటులకు మంచి గుర్తింపు వచ్చింది. వారికి ఎంతోమంది అభిమానులు ఉన్నారు. ముఖ్యంగా రిషి, వసుధార, మహేంద్ర, జగతి మేడమ్. వీరిలో జగతి మేడమ్ సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయ్యింది.
గత కొన్ని ఎపిసోడ్ లుగా జగతి అనారోగ్యంతో హస్పటల్ లో ఉండడం, ఆ తరువాత రిషి అమ్మా అని పిలవడంతో ఫ్యామిలీ కలిసిపోతుంది. అయితే జగతి రిషి, వసు పెళ్లి జరిగిన వెంటనే జగతి కన్నుమూస్తుంది. అయితే చనిపోయే ముందు దేవయాని, శైలేంద్రలకు ట్విస్ట్ ఇచ్చింది. అదేమిటో ఇప్పుడు చూద్దాం..
పెళ్లి దుస్తులతో రెడీ అయ్యి, వచ్చిన రిషీతో జగతి ఒక విషయం చెప్పాలని పిలుస్తుంది. ఏంటమ్మా? అని అడిగిన రిషితో ‘నా తరువాత మహేంద్రకు అన్నీ నువ్వే అవ్వాలి’ అని అంటుంది. ‘మహేంద్రకు ఎల్లప్పుడు నువ్వు తోడు ఉండాలి, ఎప్పుడూ వదిలిపెట్టొద్దు. తోడు ఉండాల్సిన సమయంలో ఎప్పుడు తోడుగా లేను.
ఇక ఇప్పుడు ఉంటానో లేదో తెలియదు. మీ నాన్నకి మంచి భార్యను కాలేకపోయాను. కానీ నువ్వు మాత్రం గొప్ప కుమారుడిగా ఉండి, ఆయనను ఆనందంగా చూసుకో’ అని జగతి ఎమోషనల్ అవుతుంది. అప్పుడు రిషి తప్పక కుండా చూసుకుంటానమ్మా అని చెప్తాడు. ఆ తరువాత రిషి, వసుల వివాహం జరుగుతుంది.
ఇద్దరు దేవయాని వాళ్ల దగ్గర ఆశీర్వాదం తీసుకుని, ఆ తరువాత జగతి దగ్గర ఆశీర్వాదం కోసం మోకాళ్ల మీద కూర్చుంటారు. అప్పుడు జగతి రిషీతో ‘ఇక నుండి మెషన్ ఎడ్యుకేషన్ కూడా మీ చేతుల్లోనే పెడుతున్నాను’ అని చెప్తుంది. అది విని షాక్ అయిన దేవయాని, శైలేంద్రలు కోపంతో చూస్తుంటారు. ఆ తరువాత జగతి ఇద్దరి పై అక్షింతలు వేసి, రిషి తల పై చేయి పెట్టి ఆశీర్వాదిస్తూ, అలానే కన్ను మూస్తుంది.
Also Read: 30 ఏళ్ల స్టార్ డం… కానీ ఇప్పుడు..? అసలు ఈ హీరోయిన్ పరిస్థితి ఎందుకు ఇలా అయ్యింది..?









దేవయాని ముంబయిలో 1974లో జూన్ 22న జన్మించింది. ఆమె తండ్రి కర్నాటకలోని మంగళూరుకు చెందిన కొంకణికి చెందినవారు. తల్లి మలయాళీ. ఆమె 1995 లో ‘దిల్ కా డాక్టర్’ అనే మూవీతో కెరీర్ మొదలుపెట్టింది. అయితే అది మధ్యలోనే ఆగిపోయింది. ఆ తరువాత బెంగాలీ మూవీ ‘షాత్ పొంచోమి’ లో నటించింది. ఆమెకు గురింపు రావడంతో వరుస అవకాశాలు వచ్చాయి. అలా ఆమె తమిళం, తెలుగు, కన్నడ , మలయాళం , హిందీ, బెంగాలీ భాషల్లో పలు చిత్రాలలో నటించింది. దేవయాని కోలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణించింది.
సౌత్ ఇండియాలో ఒక ఎపిసోడ్ లో నటించడానికి గాను లక్షరూపాయల అత్యధిక రెమ్యూనరేషన్ పొందిన తొలి సీరియల్ నటి దేవయాని. 30 ఏళ్ల పాటు సక్సెస్ ఫుల్ గా ఇండస్ట్రీలో కొనసాగిన దేవయాని ఆ తరువాత అవకాశాలు తగ్గాయి. దానికి కారణం కోలీవుడ్ ఇండస్ట్రీలో శరత్కుమార్, అజిత్ వంటి హీరోలతో ఎఫైర్ సాగించినట్లు పలు వార్తలు రావడంతో అక్కడ అవకాశాలు రాలేదని టాక్. 2001లో దేవయాని కోలీవుడ్ డైరెక్టర్ రాజ్కుమార్ను ప్రేమించారు. కానీవారి ప్రేమ దేవయాని తల్లిదండ్రులకు ఇష్టంలేకపోవడంతో ఇంట్లో నుంచి వెళ్ళిపోయి ఒక గుడిలో వివాహం చేసుకుందని తెలుస్తోంది.
దీంతో దేవయాని తల్లిదండ్రులు ఆమె అప్పటి దాకా సంపాదించిన మొత్తం నుండి ఏమి ఇవ్వలేదట. ఆమె చేతిలో డబ్బు లేకపోవడం, వివాహం తరువాత సినిమాల్లో అవకాశాలు రాలేదు. దీంతో ఆమె సీరియల్స్ లో నటించడం మొదలుపెట్టారు. రోజుకు లక్ష రూపాయలు రెమ్యూనరేషన్ తీసుకున్న నటిగా నిలిచిన దేవయాని జీవితం మళ్లీ దారిలోకి వచ్చింది. ఈ జంటకి ఇనియ, ప్రియాంక అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అయితే అలా సంపాదించిన డబ్బుతో సినిమా నిర్మాణం మొదలుపెట్టింది.
ఆమె భర్త డైరెక్షన్ లో కొన్ని సినిమాలు తీయగా, అవి ప్లాప్ అయ్యి, డబ్బు అంతా పోయి, అప్పుల పాలయ్యారట. వాటిలో కొంత చెల్లించి రుణాల బాధ నుండి నుండి బయటపడ్డారట. ఆ తరువాత దేవయాని యాక్టింగ్ మానేసి, తమిళనాడులోని అన్నాసాలైలో చర్చ్పార్కు కాన్వెంట్ స్కూల్ లో టీచర్ గా పనిచేస్తున్నారు. ఆమెకు చిన్నప్పటి నుండి టీచర్ కావాలనే కోరిక ఉండేదని, అందుకే తన పిల్లల స్కూల్ లోనే టీచర్ గా చేస్తున్నానని ఆమె చెప్పినట్టుగా తెలుస్తోంది.
తెలుగు ఇండస్ట్రీలో మాస్ కి కేరాఫ్ అడ్రెస్ అంటే బోయపాటి శ్రీను అని అంటారు. బోయపాటి ఇప్పటి దాకా 9 చిత్రాలు మాస్ ప్రేక్షకులను మెప్పించేలా ఉంటాయి. ఇక స్కంద సినిమాను వాటికి మించిన మాస్ తో తెరకెక్కించాడు. ఇక బోయపాటి చిత్రాలలో లాజిక్ లు ఉండవు. హీరో ఎంత పెద్ద పొజిషన్ లో ఉన్నవారి నైన సులభంగా కొట్టగలడు. ఇక స్కందలో అయితే 2 అడుగులు ముందుకేశాడని అంటున్నారు.
ఈ మూవీలోని యాక్షన్ సీన్స్ కి మాస్ ప్రేక్షకులు ఈలలు వేస్తే, సాధారణ ఆడియెన్స్ కు మాత్రం చాలా సిల్లీగా అనిపించాయి. దీంతో సోషల్ మీడియాలో ఈ మూవీని నెటిజెన్లు విపరీతంగా ట్రోల్ చేశారు. రీలిజ్ అయినప్పటి నుండి ఈ మూవీ నెట్టింట్లో ఏదో ఒక విధంగా హల్చల్ చేస్తూనే ఉంది. స్కంద లాంటి మాస్ సినిమాకు, సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు లాంటి క్లాస్ సినిమాకు కామన్ పాయింట్ ఉంది.
తాజాగా కోతిమీర.కట్ట అనే ఇన్ స్టా ఖాతాలో స్కంద మూవీలోని రామ్, శ్రీలీల, సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీలోని వెంకటేష్, మహేష్ బాబు ఫోటోలను షేర్ చేస్తూ, ‘కాస్త వీళ్ళ పేర్లు ఏంటో చెప్పండయ్యా’ అంటూ పోస్ట్ చేశారు. ఆ మూవీలో వెంకటేష్, మహేష్ బాబును పెద్దోడు, చిన్నోడు అని పిలుస్తారు. ఇక స్కంద మూవీలో రామ్ ని సీఎం అల్లుడు, శ్రీలీల సీఎం కూతురు, యావరేజ్ అని పిలిచినట్టు తెలుస్తోంది. రెండు సినిమాలలో మెయిన్ క్యారెక్టర్లకు పేర్లు లేవు. ఇక ఈ పోస్ట్ పై నెటిజెన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.



















పైన ఫోటోలో కనిపిస్తున్న చిన్నారికి తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోల రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆమె స్టార్ హీరోయిన్గా ఎన్నో బ్లాక్బస్టర్ సినిమాలలో నటించింది. తెలుగులోనే కాకుండా తమిళ ఇండస్ట్రీలోనూ వైవిధ్యభరితమైన చిత్రాలలో అక్కడ కూడా స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు, పవర్ స్టార్ 



కోలీవుడ్ టాప్ కమెడియన్ సంతానం హీరోగా నటించిన మూవీ ‘కిక్’. ఈ చిత్రంలో తాన్య హోప్ మరియు రాగిణి ద్వివేది హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రానికి ప్రశాంత్రాజ్ దర్శకత్వం వహించారు. సుమారు రెండేళ్ల గ్యాప్ తర్వాత బ్రహ్మానందం తమిళ సినిమాలో నటించాడు. ఈ మూవీ లో సైంటిస్ట్ వాలి అనే క్యారెక్టర్ నటించాడు. రొమాంటిక్ కామెడీ మూవీగా తెరకెక్కిన ఈ మూవీ సెప్టెంబర్ 1న థియేటర్లలో రిలీజ్ అయ్యింది.
2016లో సూపర్ హిట్ అయిన కన్నడ సినిమా జూమ్ కి రీమేక్ గా ఈ మూవీ తెరకెక్కింది. డీడీ రిటర్న్స్తో విజయాన్ని సాధించిన సంతానం ఈ మూవీతో మరో విజయాన్ని అందుకోవాలనుకున్నారు. అయితే ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర నిరాశ పరించింది. రీసెంట్ గా ఈ మూవీ ఓటీటీలో రిలీజ్ అయ్యింది. ఈ చిత్రం డిస్నీ ప్లస్ హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రాన్ని నెటిజన్లు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు.
వరస్ట్ సినిమా అని కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇది మాత్రమే కాకుండా, “అసలు ఇలాంటి సినిమాలో బ్రహ్మానందం ఎలా నటించారు?” “ఏం చూసి ఈ సినిమాలో నటించడానికి అంగీకరించారు?” అంటూ బ్రహ్మానందంని కూడా కామెంట్ చేస్తున్నారు. తమిళ్ వాళ్ళు అయితే మన స్టార్ కమెడియన్ ని అలాంటి సినిమాలో చూసి ఏకంగా ట్రోల్ చేస్తున్నారు. అంతే కాకుండా రెండున్నర గంటల పాటు సమయాన్ని వృథా చేసుకోవాలనుకుంటే ఈ మూవీని చూడండి అని కామెంట్ చేస్తున్నారు. సినిమా అంతా డబుల్ మీనింగ్ డైలాగ్స్తో ఉందని దారుణంగా నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.