టాలీవుడ్ లో విలన్ పాత్రలతో పేరు సంపాదించిన ఆశిష్ విద్యార్థి 60 ఏళ్ల వయసులో మరోసారి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. మే 25 అస్సాంకు చెందిన రూపాలీ బారువాతో ఏడడుగులు నడిచాడు. ఒకప్పటి నటి అయిన శకుంతల బారువా కూతురు రాజోషి బారువా అతని మొదటి భార్య. వారికి గతేడాది విడాకులు జరిగాయి.
అయితే 60 ఏళ్ళ వయసులో రెండో పెళ్లి చేసుకోవడం ఏంటి.. అంటూ ఆశిష్ విద్యార్ధిపై ఘోరంగా ట్రోల్ చేశారు. ఇక తాజాగా ఈ ట్రోలింగ్ పై స్పందించాడాయన. ఆశిష్ విద్యార్ధి మాట్లాడుతూ.. ” నేను రెండో పెళ్లి చేసుకోవడం తో ముసలోడు, సభ్యత సంస్కారం లేనివాడు వంటి అసభ్యకరమైన పదాలతో నన్ను ట్రోల్ చేశారు. జీవితాన్ని సంతోషంగా ముగించాలి అనే ఉద్దేశం ఉన్నప్పుడు..ఓ తోడు కావాలని కోరుకుంటారు. నేను చట్టాన్ని గౌరవించే వ్యక్తిని అందుకే చట్టబద్ధంగా పెళ్లి చేసుకున్నాను.

ఇప్పటికీ కష్టపడి పనిచేస్తున్నాను, పన్నులు కూడా కడుతున్నాను. రెండో పెళ్లి అనేది పూర్తిగా నా వ్యక్తిగత నిర్ణయం. ప్రజలు పక్కనున్న వాళ్ళని నిందించడం మానేసి. కలిసి బ్రతకడం అలవాటు చేసుకోవాలి.” అని ఆయన చెప్పుకొచ్చారు. మరోవైపు ఆయన మొదటి భార్య రాజోషి కూడా ఆయన వివాహం పై సానుకూల స్పందన వ్యక్తం చేసారు.

“ఇన్నాళ్లు శకుంతల కూతురుగా, ఆశిష్ కి భార్యగా సమాజంలో గౌరవం పొందాను ఇప్పుడు.ఇప్పుడు స్వతంత్రంగా ఎదగాలనుకున్నాను మేమిద్దరం నడిచే మార్గాలు వేరు కావడంతో ఒకరిపై ఒకరికి ఎలాంటి కోపం లేకపోయినా, గొడవలు లేకపోయినా కలిసి ఉండలేము అని అర్థం చేసుకొని సగౌరవం గా విడిపోయాం. 22 ఏళ్ల పాటు కలిసి జీవించాం ఒకరంటే ఒకరికి మంచి గౌరవం మర్యాద ఉన్నాయి. అతడు మరో వివాహం చేసుకోవడానికి నా పూర్తి సమ్మతం ఉంటుంది. నా కొడుకు అర్థ్ కూడా ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకుంటాడు. ఆయన వివాహానికి నా శుభాకాంక్షలు..” అంటూ రాజోషి ఒక ఇంటర్వ్యూలో తెలిపారు.

ఆశిష్ విద్యార్థి సుమారు మూడున్నర దశాబ్దాలుగా సినిమా ఇండస్ట్రీలో ఉన్నాడు. తెలుగుతోపాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, ఇంగ్లిష్, ఒడియా, బెంగాలీ భాషల్లో నటించాడు. ఇప్పటి వరకూ 11 భాషల్లో 300కుపైగా సినిమాల్లో నటించడం విశేషం. 1995లో ద్రోహ్కాల్ సినిమాకుగాను అతడు నేషనల్ అవార్డు గెలుచుకున్నాడు. తెలుగులో గుడుంబా శంకర్, ఆగడు, పోకిరిలాంటి ఎన్నో హిట్ సినిమాల్లో నటించాడు.

నందమూరి బాలకృష్ణ, అనిల్ రావిపూడి కాంబో ప్రకటించినప్పటి నుండే ఈ చిత్రం పై అందరి దృష్టి పడింది. మాస్ హీరోని అనిల్ రావిపూడి ఎలా చూపిస్తారో చూడాలని నందమూరి ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. గతంలో రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ తో చిత్రం పై అంచనాలను ఏర్పడ్డాయి. ఈ క్రమంలోనే గత కొద్ది రోజులుగా సినిమా టైటిల్ గురించి కామెంట్స్ వినిపిస్తున్నాయి. జూన్ 10న బాలయ్య పుట్టినరోజు సందర్భంగా 2 రోజుల ముందుగానే మూవీ టైటిల్ రివీల్ చేస్తూ మేకర్స్ పోస్టర్ రిలీజ్ చేశారు.
ఈ సినిమాకి ‘భగవంత్ కేసరి’ అనే టైటిల్ ఫైనల్ చేసి, పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ టైటిల్ కు ‘ఐ డోంట్ కేర్’ అనే ఉపశీర్షికను ఇచ్చారు. భగవంత్ అనగా విష్ణుమూర్తి, కేసరి అనగా సింహం’ అని అర్ధం. బాలకృష్ణకి టైటిల్ లో సింహం అని పెట్టుకునే సెంటిమెంట్ ఉంది. అందువల్లే ‘భగవంత్ కేసరి’ అని పెట్టినట్లు తెలుస్తోంది.
ఈ పోస్టర్ లో బాలకృష్ణ చేతిలో డీఫెరెంట్ వెపన్ పట్టుకొని ఉన్నారు. అలాగే టైటిల్ లో భగవంత్ పదంలో మూడు సింహాల గుర్తు ఉంది. అంటే ఈ మూవీ కథ చట్టం, పోలీసుల చుట్టూ తిరుగుతుందని టాక్ వినిపిస్తోంది. పోస్టర్ లో బాలయ్య మాస్ గా కనిపిస్తూనే స్టైలిష్ గా కూడా ఉన్నారు.
విజయ్ దళపతి కొత్త సినిమాల కోసం కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ ప్రేక్షకులు కూడా ఎదురు చూస్తుంటారు. ఏడాది మొదట్లోనే వారసుడు మూవీతో దక్షిణాది ఆడియెన్స్ అలరించిన విజయ్, ప్రస్తుతం లియో సినిమాతో బిజీగా ఉన్నారు. విక్రమ్ దర్శకుడు లోకేష్ కనకరాజన్ డైరెక్షన్ లో రూపొందుతున్న ఈ మూవీలో త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. హిట్ పెయిర్ గా పాపులర్ అయిన ఈ జంట 17 ఏళ్ల తర్వాత మరోసారి జత కడుతున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ గ్లింప్స్ లియో చిత్రం పై హైప్ ను పెంచింది.
విజయ్ ఒక వైపు లియో మూవీ షూటింగ్ లో పాల్గోంటూనే, మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ‘తలపతి 68’ అనే వర్కింగ్ టైటిల్ తో సినిమాని ప్రకటిస్తూ ఒక వీడియోని రిలీజ్ చేశారు. ఈ చిత్రాన్ని తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు తెరకెక్కించనున్నాడు. ఈ వీడియోలో మూవీకి సంబంధించిన విషయాలను పజిల్స్ తో చూపించారు.
అందులో విలన్ ఎవరో క్లూ ఇచ్చారు. ఒక ట్విట్టర్ ఖాతాలో ఆ పజిల్ క్లిపింగ్ ను ఇచ్చి, విలన్ ఎవరో గెస్ చేయమని అంటే ఎక్కువగా ఎస్ జే ఎస్ అక్షరాలకు రౌండప్ చేసి ఎస్ జే సూర్య ఈమూవీలో విలన్ అని కామెంట్స్ చేస్తున్నారు. విజయ్ మరియు ఎస్ జే సూర్య ఇంతకు ముందు కూడా నటించారు.







తాజాగా రిలీజ్ అయిన రెండవ ట్రైలర్ ను చూస్తే సినిమా ఎలా ఉండబోతుందో తెలుస్తోంది. ఈ మూవీ రిలీజ్ తేదీ దగ్గరకి వస్తుండడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ వేగిరం చేసింది. అయితే హనుమాన్ సీతా దేవి జాడ కోసం వెళ్తున్నప్పుడు శ్రీరాముడు తన ఉంగరాన్ని ఆనవాలుగా ఇస్తాడు. లంకలో సీతాదేవిని కలిసిన హనుమంతుడు రాముడి ఉంగరాన్ని చూపించి రామదూతగా పరిచయం చేసుకుంటాడు.
సీతాదేవిని రాముడి దగ్గరికి తీసుకెళ్తానని చెప్పగా, సీతాదేవి వారించి శ్రీ రాముడు రావణున్ని జయించి తనని తీసుకెళ్లాలని చెప్తుంది. తన ఆనవాలుగా చూడామణి హనుమంతుడికి ఇస్తుంది. ఇదే రామాయణంలో కనిపిస్తుంది. కానీ ఆదిపురుష్ ట్రైలర్ లో సీతాదేవి ఆంజనేయుడికి చూడామణి కాకుండా గాజులు ఇవ్వడం కనిపిస్తుంది.
ఆంజనేయుడు ఆ గాజును శ్రీ రాముడి చేతిలో పెట్టడం కూడా ట్రైలర్లలో కనిపిస్తుంది. అయితే రాముడికి సీతమ్మ ఆనవాలుగా చేతిగాజు ఇచ్చినట్టుగా చూపించారు. ఏ ఆధారాలతో ఓంరౌత్ చూడామణి కాకుండా చేతిగాజును ఈ చిత్రంలో చూపించారో మరి. ఈ మూవీ రిలీజ్ అయితే ఇంకా ఎన్ని విషయాలను ఇలా చూపించారో తెలుస్తుంది.


సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా వస్తుందంటే ఫ్యాన్స్ చేసే సందడి మామూలుగా ఉండదు. మహేష్ నటిస్తున్న చిత్రం టైటిల్ ప్రకటనకు మందు నెల రోజుల నుండి ఎక్కడ చూసినా ఆమూవీ గురించే వినిపించింది. నాలుగైదు టైటిల్స్ కూడా ప్రచారంలోకి వచ్చాయి. ఫైనల్ గా వాటిలో నుండి ఒకటి గుంటూరు కారం పేరును మేకర్స్ ఫిక్స్ చేశారు. ఇక టైటిల్ గ్లింప్స్ రిలీజ్ చేసిన రోజు సూపర్ స్టార్ ఫ్యాన్స్ చేసిన హడావుడి అంతా ఇంతా కాదు.
ఇక మహేష్ బాబు నటిస్తున్న సినిమాతో పాటు వరుస 5 చిత్రాలను తీసుకుంటే, G అంటే గుంటూరు కారం అని, S అంటే సర్కారు వారి పాట అని, S అంటే సరిలేరు నీకెవ్వరు అని, M అంటే మహర్షి అని, B అంటే భరత్ అనే నేను అని లాస్ట్ ఐదు చిత్రాల తొలి అక్షరాలు కలిపితే GSSMB అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. దాంతో ఈ విషయం వైరల్ గా మారాయి.
మెగాస్టార్ చిరంజీవి ‘భోళాశంకర్’ చిత్రాన్ని ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై చేయాలి. అయితే మూవీ ప్రారంభం అవుతుండగా కేఎస్ రామారావుకు సంబంధించిన క్రియేటివ్ కమర్షియల్స్ నిర్మాణ సంస్థ కూడా ఈమూవీలో భాగం అయ్యింది. దాంతో మూవీ పోస్టర్ల పై రెండు ప్రొడక్షన్ హౌస్ ల పేర్లు కనిపించాయి. కొన్నేళ్ళ నుండి పెద్ద చిత్రాల ప్రొడక్షన్ కి దూరంగా ఉన్న ఈ సంస్థ ఎందుకు వచ్చిందనే వార్తలు వచ్చాయి. దానికి సమాధానం రాలేదు.
తాజాగా వచ్చిన భోళా శంకర్ పోస్టర్లో సిసి సంస్థ పేరు కనిపించలేదు. దానిపై మళ్లీ కొంతమంది అడిగారు. ఈ సారి ఆ నిర్మాణ సంస్థ సన్నిహితుల నుండి సమాధానం వచ్చింది. వాస్తవానికి ఈ చిత్రాన్ని 2 ప్రొడక్షన్ హౌస్ ల ద్వారానే చేయాలని మొదట అనుకున్నారట. కానీ ఈ సంవత్సరం క్రియేటివ్ కమర్షియల్స్ సంస్థకు చాలా ప్రత్యేకం. బ్యానర్ పెట్టి 50 సంవత్సరాలు పూర్తి అయ్యింది. సినిమాల్లోకి వచ్చి 40 సంవత్సరాలు పూర్తి అయ్యింది. ఈ నేపథ్యంలో ముఖ్యమైన ఈ ఏడాది మరో బ్యానర్తో కలసి ఎందుకు సినిమా చేయడం.
డైరెక్ట్ గా మెగాస్టార్ చిరంజీవితో ఈ సంవత్సరం మూవీ చేసి 50వ ఏడాదిని ప్రత్యేకం చేసుకుందామని భావించారట. అందువల్లనే ఈ మూవీ పోస్టర్లో ఆ సంస్థ పేరు కనిపించలేదని అంటున్నారు. ఇక మెగాస్టార్ చిరంజీవి, క్రియేటివ్ కమర్షియల్స్ కాబినేషన్ లో ఇప్పటివరకు 5 చిత్రాలు వచ్చాయి. చివరిగా 1991లో రిలీజ్ అయిన ‘స్టూవర్ట్ పురం పోలీస్ స్టేషన్’ అనే మూవీని చేశారు. మళ్ళీ సినిమా చేస్తే 22 సంవత్సరాల తరువాత చేసినట్లు అవుతుంది.




