రామ్ పోతినేని ‘వారియర్’ మూవీ తర్వాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో నెక్ట్స్ మూవీ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని విడుదలకు రెడీ అవుతోంది. అందులో ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్ను అఫీషియల్గా ప్రకటించారు.
రామ్ పోతినేని, బోయపాటి శ్రీను సినిమాను 20 అక్టోబర్ 2023న దసరా కానుకగా విడుదల చేస్తున్నట్టు అఫీషియల్గా ప్రకటించింది టీమ్. అఖండ తర్వాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తుండగా శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ వారు నిర్మాణం వహిస్తున్నారు. ఇటివలే విడుదల చేసిన ఈ చిత్రం ఫస్ట్ లుక్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.

మోస్ట్ హ్యాపనింగ్ హీరోయిన్ శ్రీలీల మాస్ యాక్షన్ ఎంటర్టైనర్లో రామ్ కు జోడిగా నటిస్తోంది. టాలీవుడ్ క్రేజీ ప్రాజెక్ట్స్ లో ఒకటిగా రూపొందుతున్న ఈ చిత్రంలో అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్తో పాటు యాక్షన్, మాస్ ఎక్కువగా ఉండబోతున్నాయి. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్పై శ్రీనివాస చిట్టూరి అత్యంత భారీ బడ్జెట్తో అత్యంత నిర్మాణ విలువలు, అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

ఈ సినిమాలో రామ్ ఫాదర్ క్యారెక్టర్ చాలా కీలకం అని తెలుస్తోంది. దీంతో ఈ ఫాదర్ క్యారెక్టర్ కోసం హిందీ నటుడు, ఒకప్పటి స్టార్ హీరోను తీసుకోవాలని బోయపాటి ప్లాన్ చేస్తున్నాడని టాక్. ప్రముఖ హిందీ హీరో అనిల్ కపూర్, రామ్ తండ్రి పాత్రలో కనిపించనున్నారట. ఇక ఈ సినిమాను బోయపాటి పక్కా ఎమోషనల్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిస్తున్నారు.

అయితే ఈ సినిమా నుంచి ఈ నెల 15న ఫస్ట్ థండర్ను అంటే ఓ వీడియోను విడుదల చేయనున్నట్లు టీమ్ ప్రకటించింది.రామ్ బర్త్ డే సందర్భంగా ఈనెల 15న ఉదయం 11 గంటల 25 నిమిషాలకి ఆ వీడియో రిలీజ్ ఉండనుంది. అంతేకాదు దీనికి సంబంధించి ఓ పోస్టర్ కూడా రిలీజ్ చేసారు. ఆ పోస్టర్లో రామ్ ఊహించని మాస్ అవతార్లో అదరగొట్టాడు.
అయితే ఈ పోస్టర్ లోని రామ్ లుక్ పై నెట్టింట పలు మీమ్స్ వైరల్ అవుతున్నాయి. వాటిపై ఓ లుక్కేయండి..
#1

#2

#3

#4

#5

#6

#7

#8

#9

#10






































సూర్య నటిస్తున్న ‘కంగువ’ మూవీ పై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. పీరియాడిక్ డ్రామాకా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని దాదాపు 10 భాషల్లో 2డీ, 3డీ ఫార్మాట్స్ లో విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ప్రతిష్టాత్మకంగా పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కాబోతున్న ఈ చిత్రంలో హీరోయిన్ గా బాలీవుడ్ భామ దిశా పఠానీ నటిస్తోంది.
కంగువ షూటింగ్ విరామం రావడంతో సూర్య ప్రస్తుతం కొడైకెనాల్లో తన కుటుంబంతో కలిసి హాలిడేస్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలో తమకు ఆత్మీయస్వాగతం పలికిన సూర్య, జ్యోతిక దంపతులకు ధన్యవాదాలు తెలుపుతూ స్టంట్ కొరియోగ్రాఫర్ సుప్రీమ్ సుందర్ వారితో కలిసి తీసుకున్న ఫోటోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.
ఈ ఫోటో సూర్య లుక్ చూసిన అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. గతంలో గజిని చిత్రం సమయంలో డిఫరెంట్ లుక్లో కనిపించిన సూర్య. మిగతా చిత్రాలలో రెగ్యులర్ లుక్లో నటించారు. మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత సూర్య కొత్తగా కనిపిస్తున్నాడు. అయితే కంగువ మూవీ కోసం కోలీవుడ్ స్టార్ సూర్య బరువు పెరిగినట్లుగా తెలుస్తోంది. పీరియాడిక్ పోర్షన్ చిత్రీకరణ కొడైకెనాల్లో జరుగుతోంది. ఆగస్టు 2023నాటికి షూటింగ్ ను పూర్తిచేయాలని యూనిట్ ప్లాన్ చేసిందని తెలుస్తోంది.
ఇక ఈ చిత్రం హీరో సూర్య కెరీర్లో అత్యంత భారీ బడ్జెట్తో రూపొందుటున్న మూవీ. ఈ సినిమాని యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకి సహ నిర్మాత జ్ఞానవేల్ రాజా. దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ ఏడాదిలోనే ఈ చిత్రం రిలీజ్ అయ్యే అవకాశాలున్నాయి.