ప్రతి సినిమాలో హీరో పక్కన హీరోయిన్ కచ్చితంగా ఉంటారు. కొన్ని సినిమాల్లో హీరోయిన్ కు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది కొన్ని సినిమాల్లో అంత పెద్దగా ప్రాధాన్యత ఉండదు. కొన్ని సినిమాల్లో హీరోయిన్ కొంచెం సేపు ఉన్నా కానీ వారి పాత్ర లు ప్రేక్షకులకి అలా గుర్తుండిపోతాయి. ఆ సినిమా గురించి చెప్పగానే ఆ హీరోయిన్ చెప్పిన మాటలే గుర్తు వస్తాయి.
అలా తమ పాత్రల పేరుతోనే ఫేమస్ అయినా హీరోయిన్లు ఎవరో ఇప్పుడు చూద్దాం..
#1 పండు
కృష్ణ వంశి దర్శకత్వం లో వచ్చిన ‘నిన్నే పెళ్లాడతా’ మూవీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నాగార్జున, టబు ప్రధాన పాత్రల్లో వచ్చిన ఈ మూవీ సూపర్ హిట్ అయింది. ఈ మూవీ లో పండు ప్రేక్షకులకి ఇప్పటికి ఫేవరేట్.

#2 జెస్సి
గౌతమ్ మీనన్ తెరకెక్కించిన ఏమాయ చేసావే మూవీ లో సమంత, నాగ చైతన్య జంటగా నటించారు. ఇప్పటికి జెస్సి పేరు చెబితే సామ్ నే గుర్తొస్తుంది.

#3 భానుమతి
“భానుమతి.. ఒక్కటే పీస్.. హైబ్రిడ్ పిల్ల..” అంటూ ఫిదా మూవీ లో డైలాగ్ వినగానే గుర్తొచ్చేది సాయి పల్లవి. ఈ పాత్రతో ప్రేక్షకుల మనసులో మంచి స్థానం సంపాదించింది సాయి పల్లవి.

#4 హాసిని
ఈ పేరు వినగానే మనకి గుర్తొచ్చేది జెనీలియా. ఈ మూవీ ని ఎప్పుడు చూసిన హాసిని మనల్ని అంత ఈజీ గా వదిలిపెట్టదు.

#5 భ్రమరాంబ
రారండోయ్ వేడుక చూద్దాం మూవీ లో తన పెంకి తనం తో, మొండి తనం తో తనను ప్రేమించిన వాళ్ళని ఇబ్బంది పెట్టె పాత్రలో రకుల్ జీవించేసింది.

#6 హనీ
“హనీ ఇస్ ది బెస్ట్..” అంటూ మెహ్రీన్ మనల్ని ముప్పతిప్పలు పెడుతుంది ఎఫ్ 2 మూవీ లో.

#7 సీత
హను రాఘవపూడి దర్శకత్వం లో వచ్చిన సీతారామం చిత్రం ఎంత అంద్భుతం గా ఉంటుందో మనం చెప్పక్కర్లేదు. ఈ మూవీ లో సీతా పాత్రని అంత ఈజీ గా మర్చిపోలేం.

#8 చిట్టి
జాతి రత్నాలు మూవీ లో హీరోలు ముగ్గురితో పాటు మనల్ని ఎంతో అలరించింది చిట్టి. ఈ పేరు చెప్తే మనకి ఆ కోర్ట్ లో సీన్ లు గుర్తొచ్చి నవ్వులు రావాల్సిందే.

#9 రూప
శేఖర్ కమ్ముల తెరకెక్కించిన మరో దృశ్య కావ్యం ‘ఆనంద్’. ఈ చిత్రం లో ఆత్మాభిమానం గల అమ్మాయిగా కమలిని ముఖేర్జీ నటన మనల్ని మెప్పిస్తుంది.

#10 మధు
ఖుషి మూవీ తో పవన్ కళ్యాణ్ ని ఎంత క్రేజ్ వచ్చిందో అంతే క్రేజ్ మధు కి కూడా వచ్చింది. ఆ పాత్రలో నటించి అందర్నీ మెప్పించింది భూమిక.

#11 ప్రీతి
అర్జున్ రెడ్డి సినిమా తర్వాత హీరోయిన్ షాలిని పాండే ఈ పేరుతో చాలా ఫేమస్ అయిపోయారు.

#12 బేబమ్మ
తన తొలి చిత్రం తోనే అందర్నీ తన వైపుకు తిప్పుకుంది బేబమ్మ. ఆ తర్వాత వరుస హిట్స్ తో స్టార్ హీరోయిన్ గా మారింది మన క్రితి శెట్టి.


























నాగచైతన్య ప్రస్తుతం ‘కస్టడీ’ మూవీ ప్రమోషన్ లో బిజీగా ఉన్నాడు. సీనియర్ నటుడు అరవింద్ స్వామి ఈ మూవీలో విలన్ క్యారెక్టర్ లో నటిస్తున్నారు. యాక్షన్ ఓరియంటెడ్ సినిమాగా తెరకెక్కిన ఈ మూవీలో నాగచైతన్య పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నారు. ఈ చిత్రం మే 12 రిలీజ్ కానుంది. ఈ క్రమంలో మూవీ ప్రమోషన్స్ ను కోలీవుడ్ లోనూ జోరుగా చేస్తున్నారు. తమిళ యూట్యూబర్ ఇర్ఫాన్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగచైతన్య కెరీర్ మరియు వ్యక్తిగత విషయాల గురించి కూడా మాట్లాడారు.
ఇక ఇంటర్వ్యూలో భాగంగా ఆడిన ట్రూత్ ఆర్ డేర్ గేమ్ లో రిలేషన్ షిప్ లో ఎప్పుడైనా తిరస్కరించబడ్డారా? అని నాగచైతన్య యాంకర్ ఇర్ఫాన్ ను అడిగారు. అతను దానికి సమాధానం చెప్తూ రెండున్నర సంవత్సరాల క్రితం ప్రేమించిన అమ్మాయి రిజెక్ట్ చేసిందని అన్నారు. అయితే మనం మంచి ఫ్రెండ్స్ గా కొనసాగుదామని చెప్పిందని వెల్లడించాడు. అది వినగానే నాగచైతన్య ఒక్కసారి తిరస్కరించిన వారితో మళ్ళీ ఫ్రెండ్ షిప్ అంటేనే తనకు చిరాగ్గా అనిపిస్తుందని అన్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారింది.
అలాగే ఇంటర్వ్యూలో యాంకర్ జీవితంలో ఏమైనా రిగ్రెట్స్ ఉన్నాయా అన్న ప్రశ్నకి, తనకు ఎటువంటి రిగ్రెట్స్ లేవని చైతన్య తెలిపారు. జీవితంలో ఎదురైన ప్రతి సంఘటనను పాఠంగా భావిస్తానని తెలిపాడు. దీనిపై కొంచెం వివరంగా చెబుతారా అంటే తన కెరీర్ లో నటించిన రెండు మూడు చిత్రాల విషయంలో తెలివిగా ఆలోచించి నిర్ణయం తీసుకోలేకపోయానని వెల్లడించాడు.









సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ అక్కినేని హీరోగా నటించిన ఏజెంట్ మూవీ రీసెంట్ గా విడుదల అయ్యింది. ఈ చిత్రంలో మమ్ముట్టి ముఖ్యమైన పాత్ర పోషించగా, హీరోయిన్ గా సాక్షి వైద్య నటించింది. ఈ చిత్రం కోసం అఖిల్ తన లుక్ ను పూర్తిగా మార్చుకున్నారు. ఈ మూవీ రిలీజ్ అయిన ఫస్ట్ డే నుండే నెగెటివ్ టాక్ తెచ్చుకుని, డిజాస్టర్ గా నిలిచింది. ఈ చిత్ర దర్శక నిర్మాతల పై తీవ్రంగా విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఈ ఒక వార్త వైరల్ అయ్యింది. ఈ చిత్రానికి మొదటి ఛాయిస్ అఖిల్ కాదని, టాలీవుడ్ స్టార్ హీరో అని వినిపిస్తోంది.
ఈ చిత్ర డైరెక్టర్ సురేందర్ రెడ్డి ఈ మూవీ స్టోరీని గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కు వినిపించాడంట. కథ నచ్చినా, చరణ్ కి ఇతర చిత్రాల కమిట్మెంట్స్ వల్ల ఈ చిత్రాన్ని సున్నితంగా రిజెక్ట్ చేశాడంట. ఇక ఈ విషయాన్ని ఆ మధ్య రామ్ చరణ్ ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో వెల్లడించాడు. చరణ్ రిజెక్ట్ చేయడంతో సురేందర్ రెడ్డి అఖిల్ కి చెప్పడం, అతనికి కథ నచ్చడంతో ఈ చిత్రం తెరకెక్కింది. కానీ ఈ మూవీ మొదటి షోకే ఫ్లాప్ టాక్ వచ్చింది. స్పై యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ సినిమాలో డినో మోరియా విలన్ గా నటించాడు. ఇక ఈ చిత్రానికి వక్కంతం వంశీ కథను అందించారు.





