తెలంగాణ రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలతో తెరకెక్కిన ‘బలగం’ చిత్రం విశ్వ వేదికల పై పురస్కారాలను గెలుచుకుంటూ సత్తాను చాటుతోంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ‘బలగం’ పేరే వినిపిస్తోంది. ఎక్కడ చూసినా, ఏ ఇద్దరు కలిసినా బలగం సినిమా చూశావా అంటూ మాట్లాడుకుంటున్నారు. ఈ చిత్రం అంతగా ఆడియెన్స్ లోకి హృదయాలలోకి వెళ్ళింది ఈ అచ్చమైన తెలంగాణ చిత్రం.
తెలంగాణలోని పల్లెటూరి సంప్రదాయాలను, వారి ఆచార వ్యవహారాలను, తెలంగాణ యాస, భాషలను వెండితెర పై అత్యద్భుతంగా చూపించాడు దర్శకుడు వేణు వెల్డండి. కమెడియన్ గా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన వేణు తొలిసారి దర్శకుడుగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. మొదటి చిత్రం అయినప్పటికి గుర్తుండిపోయే చిత్రాన్ని తీశాడు. చిన్న చిత్రంగా ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ చిత్రం ఘన విజయాన్ని అందుకుంది. దానికి కారణం ఈ చిత్ర కథ, కథనం. కుటుంబంలోని ఆప్యాయత, అనుబంధాలను చూపించిన విధానం అందరనీ ఆకట్టుకుంటోంది.
అందువల్లనే తెలంగాణలోని కొన్ని గ్రామాలలో ఒకప్పటిలా ఊరి ప్రజలంతా ఒక్క చోట కలిసి చూసేలా తెరలు కట్టి ఈ చిత్రాన్ని చూస్తున్నారు. ఈ విధంగా ఒక వైపు థియేటర్లలో, ఇంకోవైపు ఓటీటీలో విజయవంతంగా దూసుకుపోతోన్న ఈ చిత్రానికి అవార్డులు రావడం కూడా ప్రారంభమైంది. ఈ చిత్రానికి కొద్ది రోజుల క్రితం ఉత్తమ ఫీచర్ ఫిల్మ్, ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ఆటోగ్రఫీ కేటగిరీలో లాస్ఏంజిల్స్ ఫోటోగ్రఫీ పురస్కారాలు వచ్చిన విచ్చేయం తెలిసిందే. అంతే కాకుండా ఈ చిత్రానికి తెలుగు వేదిక నుండి ఉగాది పురస్కారాలలో నంది అవార్డునూ పొందింది. అయితే తాజాగా ‘బలగం’ చిత్ర ఖాతాలో మరో అంతర్జాతీయ అవార్డు కూడా చేరింది.
ఉక్రెయిన్ దేశానికి చెందిన ఒనికో ఫిలిం అవార్డ్స్ లో భారతదేశం నుండి ఉత్తమ ఫీచర్ సినిమాగా ‘బలగం’ పురస్కారం అందుకుంది. ఇక ఈ విషయాన్ని ఈ చిత్ర దర్శకుడు వేణు వెల్డండి సామాజిక మధ్యమంలో షేర్ చేశాడు. తమ సినిమాకి ఇప్పటి వరకు 4 పురస్కారాలు రావడం పట్ల చాలా ఆనందంగా ఉందన్నాడు. తన చిత్ర యూనిట్ వల్లనే ఇది సాధ్యమైందని మూవీ యూనిట్ లో వారికి కృతజ్ఞతలు తెలిపాడు. ఈ సినిమాలో హీరోగా నటించిన ప్రియదర్శి సోషల్ మీడియాలో ‘ఇంట గెలిచి రచ్చ గెలుస్తున్నాం’ అంటూ ఈ విషయాన్ని షేర్ చేశాడు.
Also Read: ఈ వారం OTT లో రిలీజ్ అవుతున్న 20 సినిమాలు..! ఏ సినిమా / సిరీస్ ఎందులో స్ట్రీమ్ అవుతుంది అంటే..?
No 4 to balagam#Balagam
Breaking barriers and captivating audiences 🤩❤️#Balagam takes home the Best Drama Feature Film award at Onyko Film Awards in Ukraine! ✨
Thank you all for making this possible!! 🤗🤗
@priyadarshi_i @kavyakalyanram @dopvenu @LyricsShyam
@HR_3555 pic.twitter.com/NiZ5e4wKUw— Venu Yeldandi #Balagam (@VenuYeldandi9) April 2, 2023
Inta Gelichi
Rachha Gelusthunnam
🤩❤️#Balagam takes home the Best Drama Feature Film award at Onyko Film Awards in Ukraine! ✨Thank you all for making this possible!! 🤗🤗#Balagam #OnkyoFilmAwards #Ukraine pic.twitter.com/HtI9WuqtFh
— Priyadarshi Pulikonda (@PriyadarshiPN) April 2, 2023
















తన అన్నయ్య చక్రి ఉన్న సమయంలో ఎటువంటి గొడవలు లేవని, అయితే ఆయన మరణించిన తరవాత తమ ఫ్యామిలిలో ఆస్తి గొడవలు ప్రారంభం అయ్యాయని తెలిపారు. అన్నయ్య చక్రి పోయిన బాధలో ఉన్నప్పుడే మొదలైన గొడవలతో తాము నరకం అనుభవించామని తెలిపారు. అన్నయ్య సంపాదించిన ఆస్తుల్లో ఆయన భార్య కొన్నింటిని అమ్మేసిందని తెలిపారు. ఆమె అమెరికా వెళ్లిందని, మళ్ళీ వివాహం చేసుకుని, అక్కడే సంతోషంగా సెటిల్ అయ్యిందని వెల్లడించారు. తమకు చెందిన కొన్ని ఆస్తులు ఇప్పటికి కోర్టు కేసుల్లోనే ఉన్నాయని చెప్పారు.
ఇదిలా ఉంటే 2014లో చక్రి గుండె పోటుతో కన్నుమూశారు. ఆయనకు ఊబకాయ సమస్య ఉండేదని, ఆ కారణంతోనే చిన్న వయసులోనే చక్రి గుండెపోటుతో మరణించారు. ఇక ఆయన మరణించిన వెంటనే వారి ఫ్యామిలిలో ఆస్తుల గొడవలు ప్రారంభం అయ్యాయి. చక్రి భార్య ఆయన ఫ్యామిలీ మెంబర్స్ తనను వేధిస్తున్నట్టుగా ఆరోపించారు. ఇంకో వైపు చక్రి ఫ్యామిలీ మెంబర్స్ కూడా చక్రి భార్య పై ఆరోపణలు చేసిన విషయం అందరికి తెలిసిందే.
Also Read:
ఐపీఎల్ 16వ సీజన్లో మొదటి మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు ఆడాయి. ఇక ఈ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు పై గుజరాత్ జట్టు 5 వికెట్ల తేడాతో గెలిచింది. అహ్మదాబాద్ లో ఉన్నటువంటి నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన సీఎస్కే జట్టు 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టపోయి 178 రన్స్ చేసింది.
ఇక 179 రన్స్ లక్ష్యంతో బ్యాటింగ్ కి దిగిన గుజరాత్ టైటాన్స్ జట్టు మికహ మొదటి నుండి కూడా అదరగొట్టారు. దాంతో గెలుపు సాధించారు. ఇది ఇలా ఉంటే ఐపీఎల్ టోర్నమెంట్ ప్రారంభ వేడుకలలో స్టార్ హీరోయిన్లు ష్మిక మందాన, తమన్నా భాటియా డాన్స్ చేయడం పై ప్రస్తుతం చర్చ మొదలైంది. అయితే ఈ వేడుకల్లో డాన్స్ చేసినందుకు గాను హీరోయిన్లు రష్మిక, తమన్నా భాటియా ఇద్దరు తలో నాలుగు కోట్లు రెమ్యూనరేషన్ తీసుకున్నట్లుగా తెలుస్తోంది. దీంతో సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ విషయం వైరల్ అవుతోంది.
Also Read: 














ఆమె తల్లిదండ్రులు ముఖర్జీ, జెన్నీఫర్. చెన్నై కళాక్షేత్రలో అమల బి.ఏ ఫైన్ ఆర్ట్స్ చేసారు. ఆమెకు క్లాసికల్ డాన్స్ అంటే ఆసక్తి ఉండడంతో చిన్నప్పటి నుంచి క్లాసికల్ డాన్స్ నేర్చుకున్నారు. అక్కినేని అమల ఇటీవల శర్వానంద్ నటించిన ఒకే ఒక జీవితం సినిమాలో నటించింది. మూగజీవాల మీద ఉన్న ప్రేమతో బ్లూక్రాస్ సంస్థను స్థాపించి ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
అయితే అమల ఎప్పుడూ సింపుల్ గా ఉంటారు. అమల బంగారం ధరించినట్టు కూడా కనిపించదు. ఆమె మెడలో ఎప్పుడు నల్లపూసలు మాత్రమే కనిపిస్తాయి. అలాగే చెవులకు పోగులు, చేతికి గాజుల లాంటివి పెట్టుకోరు. అయితే బంగారం ఇష్టం లేక మాత్రం కాదంట. బంగారు నగలు వేసుకున్నప్పుడు చర్మానికి సంబంధించిన సమస్యలతో బాధపడినట్టు తెలుస్తోంది. అందువల్లే అమల ఎలాంటి బంగారు ఆభరణాలు ధరించరని సమాచారం.
Also Read: 

ఈ ఫొటోలో సూపర్ స్టార్ మహేష్ బాబుతో పాటు ఉన్న బాబు ఎవరంటే హీరో శ్రీకాంత్ కుమారుడు రోషన్. శ్రీకాంత్ వారసుడిగా రోషన్ తెలుగు ఇండస్ట్రీలో నిర్మల కాన్వెంట్ అనే చిత్రంతో ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత కొంచెం విరామం తీసుకుని దర్శకుడు రాఘవేంద్రరావు పర్యవేక్షణలో పెళ్లిసందడి చిత్రంతో ప్రేక్షకులను అలరించాడు. ఈ సినిమాను మహిళా దర్శకురాలు గౌరీ రోనంకీ తెరకెక్కించారు. ఈ చిత్రంలో రోషన్, శ్రీలీల హీరోహీరోయిన్లుగా నటించారు. ఇక ఈ మూవీతో రోషన్ మరింత గుర్తింపును సంపాదించుకున్నాడు.
రోషన్ కి ప్రస్తుతం వరుస ఆఫర్లు తలుపు తడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే రోషన్ వైజయంతి బ్యానర్ లో ఒక చిత్రాన్ని అంగీకరించినట్లుగా సమాచారం. ఈ సినిమాకు సంబంధించిన పనులు ఇప్పటికే ప్రారంభించారని తెలుస్తోంది. రోషన్ ఈ చిత్రంతో పాటుగా సితార బ్యానర్ లోనూ ఒక మూవీని చేయడానికి ఒప్పుకున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ చిత్రానికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.
ఇక ఇప్పుడు రోషన్ మహేష్ బాబుతో ఉన్న ఫోటో నెట్టింట్లో వైరల్ అవుతోంది.అయితే ఈ ఫోటో పై సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మహేష్ బాబు పక్కన ఉన్న బాబు ప్రస్తుతం చాలా మారిపోయాడు. అయితే సూపర్ స్టార్ మహేష్ మాత్రం కొంచెం కూడా మారలేదు. అప్పటిలాగే అందంగా ఉన్నారని కామెంట్స్ పెడుతున్నారు.
Also Read: