రజినీ కాంత్, జ్యోతిక, నయనతార ప్రధాన పాత్రలగా నటించిన సినిమా చంద్రముఖి. 2005లో వచ్చిన ఈ సినిమా ఎంత హిట్ అయ్యిందో తెలిసిందే. అయితే దాదాపు 18ఏళ్ల తర్వాత చంద్రముఖికి సీక్వెల్గా చంద్రముఖి 2 రాబోతుంది.
పి.వాసు దర్శకత్వంలో రానున్న ఈ సినిమా ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. అయితే ఇప్పటికీ వచ్చిన పోస్టర్స్, టీజర్, ట్రైలర్స్ ఈ సినిమా అంచనాలను పెంచాయి. అయితే రజినీ ప్లేస్లో రాఘవ లారెన్స్, జ్యోతిక ప్లేస్లో కంగన రౌనత్ చంద్రముఖి 2లో కనిపించనున్నారు.

అయితే ఇప్పటికే అఫీషియల్ ట్రైలర్ రిలీజ్ అయ్యింది. కానీ రొటీన్గా ఉందని నెటిజన్లు భావిస్తున్నారు. కొత్త కాన్సెప్ట్తో లారెన్స్ వస్తే పర్లేదు.. కానీ పాత కాన్సెప్ట్ అయితే అంత ఇంట్రెస్ట్ ఉండదని నెటిజన్లు అంటున్నారు. దానికి తోడు సినిమా రన్టైమ్ కూడా ఎక్కువగానే ఉంది. సాధారణంగా సినిమా రెండున్నర గంటలు ఉంటుంది.

కానీ ఈ సినిమా రన్టైమ్ 170 నిమిషాలు. అంటే 2గంటల 50నిమిషాలు ఉంటుందని వార్తలు వస్తున్నాయి. లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్తో ప్యాన్ ఇండియా లెవల్లో రిలీజ్ చేస్తున్నారు. చంద్రముఖిలా భారీ హిట్ కొడుతుందో లేదో చూడాలి.

గతంలో పవన్ కల్యాణ్ పూజలు, జాతకాలకు అంటే కాస్త దూరంగా ఉంటారని టాలీవుడ్ లో టాక్ ఉండేది. కానీ రాజకీయాల్లో అడుగుపెట్టిన తర్వాత పవన్ కల్యాణ్ లో ఆధ్యాత్మికంగా మార్పు కనిపిస్తోందని టాక్. జ్యోతిష్యు పండితులను కలిసి, జాతకంలో ఉన్న దోషాలను సరిద్దిద్దుకోనే ప్రయత్నం చేశారట. హరిద్వార్ లాంటి పుణ్యక్షేత్రంలో పర్యటించారు. ఇటీవల అరెస్ట్ అయిన టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును పవన్ కళ్యాణ్ రాజమండ్రి సెంట్రల్ జైలులో కలిసిన విషయం తెలిసిందే.
చంద్రబాబును కలిసిన అనంతరం, పవన్ కళ్యాణ్, బాలయ్య, నారా లోకేష్ లతో పాటు మీడియాతో మాట్లాడారు. అయితే పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్న సమయంలో పవన్ చేతి వేళ్లకు ఉన్న రింగ్స్ హైలెట్ అయ్యాయి. అప్పటి నుండి వాటి గురించే చర్చ జరుగుతోంది. ఆ ఉంగరాల విశిష్టత ఏమిటా అని చర్చిస్తున్నారు. పవన్ కళ్యాణ్ పెట్టుకున్న రెండు రింగ్స్ లో ఒకటి నాగ బంధం, రెండవది కూర్మావతారం. ఈ రెండు కూడా బంగారు రింగ్స్. పెద్ద సైజులో కూడా ఉన్నాయి.
నాగ బంధం, కూర్మావతారం రింగ్స్ కు విశిష్టత ఉందని, ఇవి పెట్టుకోవడం వల్ల మంచి ప్రయోజనాలు ఉన్నాయని అంటున్నారు. నాగ బంధం రింగ్ వల్ల అపమృత్యు దోషాలు తొలగిపోతాయి. అనుకోని ప్రమాదాలు లేదా గండాల నుంచి కపడుతుంది. దుష్ట శక్తుల,రాహు కేతు దోషాలు మరియు నరదిష్టి దోషాల నుంచి కాపాడుతుందని పండితులు చెబుతున్నారు. కానీ నాగ బంధం ఉంగరాన్ని జోతిష్యం ఆధారంగా మాత్రమే ధరించాలని పండితులు చెబుతున్నారు.
ఇక తాబేలు లేదా కూర్మావతారం రింగ్ ధరించడం వల్ల అధికార యోగం మరియు ధన యోగం కలుగుతుందని, అధికార యోగం కోసం దైవబలం కోరుకునేవారు తాబేలు రింగ్ ను ధరిస్తారని జ్యోతిష్య శాస్త్రం చెబుతోందని అంటున్నారు. వచ్చే ఎన్నికల తర్వాత ఏపీ పాలిటిక్స్ లో పవన్ కళ్యాణ్ కింగ్ లేదా కింగ్ మేకర్ గా మారే అవకాశం ఈ రెండు రింగ్స్ వల్ల వస్తుందని జోతిష్య పండితులు అంటున్నారు.

ఆర్ఎక్స్ 100తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన
అయితే ఒక రోజు ఆ ఫోన్ కు ఏదో సమస్య వస్తుంది. దాంతో ఆ ఫోన్ ను ఆమె తన దగ్గర పనిచేసే అసిస్టెంట్ కి ఇస్తుంది. ఆ ఫోన్ అసిస్టెంట్ దగ్గర నుండి చాలా మంది దగ్గరకి మారుతుంటుంది. ఆ ఫోన్ ఎవరెవరి దగ్గరికి వెళ్ళింది? ఆ ఫోన్ వల్ల వారికి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? అనేది మిగిలిన కథ.
ఈ మూవీలో ఇంట్రెస్టింగ్ విషయం డైరెక్టర్ ఎంచుకున్న పాయింట్. అది మాత్రమే కాకుండా పలు కామెడీ సీన్స్ ఆకట్టుకుంటాయి. ప్రధాన పాత్రలో నటించిన హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ మంచి నటనని కనబరిచింది. విరాజ్ అశ్విన్, సిమ్రాత్ కౌర్ లు తమ పాత్రలలో ఒదిగిపోయారు. యాక్టర్ శ్రీనివాస రెడ్డి ఎమోషనల్ సన్నివేశాలు కదిలిస్తాయి. మూవీ కాన్సెప్ట్ బాగున్నా, సరైన స్క్రిన్ ప్లే లేకపోవవడం, బాగా సాగదీసిన భావన కలుగుతుంది.
పైన కనిపిస్తున్న ఫోటోలోని అబ్బాయి, బాలనటుడుగా ఎన్నో సినిమాలలో నటించి, పేరు ప్రఖ్యాతులను మాత్రమే కాకుండా ఒక హీరోకు ఉన్నంత ఫ్యాన్ ఫాలోయింగ్ ను, క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు. పెద్దయ్యాక తండ్రి వారసత్వాన్ని అందుకుని తెలుగు ఇండస్ట్రీలో హీరోగా ఎంట్రీ ఇచ్చి, తొలి సినిమాతోనే విజయాన్ని అందుకున్నారు. అమ్మాయిల కలల రాజకుమారుడిగా మారాడు. వరుస సినిమలలో నటిస్తూ, ఎన్నో హిట్ సినిమాలలో నటించి, ఇండస్ట్రీ రికార్డులు తిరగరాస్తూ, అవార్డులు అందుకుని, తండ్రిలాగే సూపర్ స్టార్ గా పేరుగాంచారు. ఆయనే సూపర్ స్టార్ మహేష్ బాబు.
టాలీవుడ్ లో మహేష్ బాబుకు ఉన్న క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సినిమాలు చేస్తూనే, యాడ్స్ లో నటిస్తూ ఎప్పుడూ బిజీగా ఉండే మహేష్ చేతిలో చాలా యాడ్స్ ఉన్నాయి. పలు సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు. టాలీవుడ్ లో ఎవ్వరు చేయనన్ని యాడ్స్ మహేష్ బాబు చేశారు. అలా యాడ్స్ చేయడానికి కారణం ఒక సందర్భంలో మహేష్ వివరించారు.
వాటి వల్ల సంపాదించే డబ్బుతో పేద పిల్లలకు ఫ్రీగా గుండె ఆపరేషన్స్ చేయిస్తారు. పిల్లల కోసమే ఒక ఫౌండేషన్ ను సొంతంగా ఏర్పాటు చేసి ఉచిత హార్ట్ ఆపరేషన్స్ చేయిస్తున్నారు. అలా ఇప్పటివరకు వెయ్యికి పైగా చేయించారు. ఆంద్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో రెండు గ్రామాలను దత్తత తీసుకున్నాడు. కేవలం డబ్బు ఇచ్చే సంస్థల కోసమే కాకుండా సేవ చేసే పలు సంస్థలకు మహేష్ బాబు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు. ప్రస్తుతం మహేష్ గుంటూరుకారం మూవీలో నటిస్తున్నారు. ఈ మూవీకి త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్నారు.
నటి తులసి బాలనటిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. ఆమె తల్లి, సావిత్రి, అంజలి దేవిలకు స్నేహితురాలు. వారు తరచూ తులసి ఇన్డీటికి వస్తుండేవారు. ఆ క్రమంలో తులసికి బాలనటిగా అవకాశం వచ్చింది. ఆమె చాలా సినిమాలలో బాలనటిగా నటించారు. శంకారాభరణం సినిమాతో తులసి మంచి గురింపు వచ్చింది. జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన ముద్ద మందారం మూవీతో హీరోయిన్ గా మారింది. ఆ తర్వాత నాలుగు స్థంబాలాట, శుభలేఖ, మంత్రిగారి వియ్యంకుడు, ప్రేమించు పెళ్ళాడు వంటి సినిమాలలో సెకండ్ హీరోయిన్ గా నటించింది.
శుఖలేఖ మూవీ సూపర్ హిట్ అయ్యి, శుభలేఖ సుధాకర్, తులసిల పెయిర్ కు మంచి పేరు వచ్చింది. దాంతో అదే తరహాలో తులసికి వరుస అవకాశాలు వచ్చాయి. అలా సూపర్ స్టార్ కృష్ణ, కృష్ణం రాజు, శోభన్ బాబు, మురళీమోహన్, చంద్రమోహన్, రాజేంద్రప్రసాద్ వంటి హీరోల సినిమాలలో నటించి ఆకట్టుకున్నారు. ఆమె తెలుగులో మాత్రమే కాకుండా మలయాళ, తమిళ చిత్రాలలో కూడా నటించారు. పెళ్లి చేసుకున్న తరువాత సినిమాలకు దూరం అయ్యారు.
2010 లో ప్రభాస్ హీరోగా నటించిన డార్లింగ్ మూవీతో రీఎంట్రీ ఇచ్చిన తులసి, స్టార్ హీరోలకు తల్లి పాత్రలూ చేస్తూ, బిజీ బిజీగా ఉన్నారు. తులసి కెరీర్ లో దాదాపు 700 పైగా చిత్రాలలో నటించారు. తాజాగా ఇండస్ట్రీకి వచ్చి 15 ఏళ్లు పూర్తయ్యాయి అని హీరో నాని పోస్ట్ పెట్టారు. ఆ పోస్ట్ కి నటి తులసి కామెంట్ సెక్షన్ లో “నాని నేను నటి తులసి (నేను లోకల్) నన్ను మీ తల్లిగా భావించి, మీలాంటి అద్భుతమైన నటుడితో కలిసి పనిచేసే అవకాశం ఇవ్వండి” అని రాసుకొచ్చింది. తులసి అలా ఆడగడంతో కొందరు ఆమెని పొగుడ్తున్నారు. కానీ కొందరు మీరు ఇలా అడగడం ఏంటి అని కామెంట్స్ చేస్తున్నారు.
ఆసియా కప్ లో ఆడుతున్న క్రికెటర్ల రెమ్యునరేషన్ వారి వారి జట్ల మ్యాచ్లలో ఆటగాళ్ల ప్రదర్శనపై ఆధారపడి ఉంటుంది. అంటే ఒక జట్టు ఎన్ని మ్యాచ్లు ఆడింది. అందులో ఒక క్రికెటర్ ఎన్ని మ్యాచ్లు ఆడాడు అనే విషయాన్ని పరిగణలోకి తీసుకుంటారు. ఈ రెండింటి మీద మ్యాచ్ ఫీజు అనేది ఆధారపడి ఉంటుంది. ఒక ప్లేయర్ మ్యాచ్లో ఆడనట్లయితే ఆ ప్లేయర్ ఆ మ్యాచ్ కు పారితోషికం అందుకోలేరు.
ఆసియా కప్లో ఇండియా కనీసం 5 మ్యాచ్లు ఆడుతుందని అంచనా. దాన్ని బట్టి అన్ని మ్యాచ్ లు ఆడే క్రికెటర్లు కనీసం 30 లక్షల రూపాయలు సంపాదిస్తారు. ఇక ఫైనల్ మ్యాచ్ లో ఆడిన క్రికెటర్ల సంపాదన మరింతగా పెరుగుతుంది. బోర్డ్ కాంట్రాక్ట్ ప్రకారం ఆసియా కప్ టోర్నీ ఆధారిత ఫీజు కాకుండా, కాంట్రాక్ట్ ప్రకారం ఇండియన్ క్రికెటర్లు శాలరీ పొందుతారు.
సాధారణంగా బీసీసీఐ క్రికెటర్లను A+, A, B, C గ్రేడ్లుగా విభజిస్తుంది. A+ కేటగిరీలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా లాంటి టాప్ ప్లేయర్స్ ఉన్నారు. వారి ఏడాది శాలరీ రూ. 7 కోట్లు. ఆర్ అశ్విన్, హార్దిక్ పాండ్యా, రిషబ్ పంత్, మహ్మద్ షమీ, అక్షర్ పటేల్ లాంటి గ్రేడ్ ఏ ప్లేయర్స్ ఏడాది శాలరీ రూ.5 కోట్లు ఉంటుంది.
మాధవి లత ‘నచ్చావులే’ మూవీతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. 2008లో రిలీజ్ అయిన ఈ మూవీ విజయం సాధించింది. దాంతో ఆమెకు వరుసగా అవకాశాలు వచ్చాయి. అలా మాధవి నాని హీరోగా నటించిన స్నేహితుడా మూవీలో హీరోయిన్ గా నటించింది. ఆ తరువాత అరవింద్-2 మూవీలో నటించింది. అయితే ఆమె తొలిసారి నటించిన మూవీ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన అతిథి. ఈ మూవీలో హీరోయిన్ అమృతా రావ్ ఫ్రెండ్ గా నటించింది. ఆమె తెలుగులోనే కాకుండా కోలీవుడ్ లో కూడా పలు సినిమాలలో నటించారు.
మాధవి లత 2018 లో రాజకీయాల్లో అడుగుపెట్టింది. బిజెపి పార్టీలో జాయిన్ అయ్యింది. సినిమాలకు ప్రస్తుతం ఉన్న మాధవి లత సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఫ్యాన్స్ తో టచ్లో ఉంటూ, తనకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను తరచూ పోస్ట్ చేస్తూ ఉంటుంది. అయితే నెటిజెన్లు ఆమెను తరచూ ఆమె పెళ్లి గురించి ప్రశ్నలు అడుగుతుంటారు.
ఈ క్రమంలోనే తాజాగా ఒక నెటిజెన్ మాధవి లత పై కామెంట్ చేశారు. ఆ కామెంట్ పై బాధపడిన, మాధవి ‘‘పెళ్లి పెటాకులు లేక కొవ్వెక్కి బలిసి కొట్టుకుంటున్నావ్ అన్నాడు. అందుకే వాడికి జవాబు చెప్తున్నా’’ అని ఒక వీడియోను ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ గా మారింది.

