సినిమా అనే రంగుల లోకం అందరిని ఊరిస్తూనే ఉంటుంది. ఒక రకమైన మూస ధోరణిలో సినిమాలు రిలీజ్ అయిపోతున్న టైం లో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు మెగాస్టార్ చిరంజీవి. ఒక మాములు హీరోగా చిరంజీవి అడుగు పెట్టినప్పటికీ.. తన టాలెంట్ తో మెగాస్టార్ అన్న టైటిల్ ను సొంతం చేసుకున్నారు.
ఈ సినిమా రంగుల ప్రపంచంలో ఎలాంటి పాత్రలో అయినా అలవోకగా ఇమిడిపోయి చేయాల్సి ఉంటుంది. అయితే.. పాత్రతో సంబంధం లేకుండా నటులుగా గుర్తింపు తెచ్చుకోవడం అనేది అంత సామాన్యమైన విషయం అయితే కాదు. ఎందుకంటే.. ఇది కేవలం ఒక్క నటుడికి సంబంధించిన విషయం కాదు.
నటీనటులకు సంబంధించి ఏ పెయిర్ కి అయినా హిట్ పెయిర్ అన్న టాక్ వచ్చిందంటే.. వారిని మళ్ళీ అలానే చూడాలి అని ప్రేక్షకులు కోరుకుంటూ ఉంటారు. మరో పాత్రలో వారు కనిపించినా ఆదరించే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఎందుకంటే అప్పటికే హిట్ పెయిర్ గా పరిచయమైనా ఆ జంటకి అభిమానులు ఉంటారు. వారు మరో పాత్రలో తమ అభిమాన నటీనటులను చూడడానికి ఇష్టపడకపోవచ్చు. అందుకే ఒకసారి హిట్ పెయిర్ గా టాక్ తెచ్చుకున్న తరువాత ఎలాంటి పాత్రలు పడితే అలాంటి పాత్రలు చేయడానికి స్టార్ హీరో హీరోయిన్లు సైతం ఆలోచిస్తూ ఉంటారు.
అయితే.. మెగాస్టార్ చిరంజీవి, హీరోయిన్ సుజాతది మాత్రం విచిత్రమైన కలయిక అని చెప్పవచ్చు. వీరి కాంబో మంచి పేరు తెచ్చుకున్నప్పటికీ.. వీరు ఒక్కో సినిమాలో ఒక్కో పాత్రలో కనిపించారు. ఒక సినిమాలో ప్రేమికులుగా కనిపించారు. మరో సినిమాలో అన్నాచెల్లెళ్లు గా కనిపించి ఆశ్చర్య పరిచారు. అంతటితో అవలేదు.. మరో సినిమాలో ఏకంగా తల్లీకొడుకులుగా కనిపించి అలరించారు. హిందీలో సూపర్ హిట్ అయిన ముకందర్ కా సికందర్ అనే సినిమాను తెలుగులో ప్రేమ తరంగాలుగా రీమేక్ చేసారు. ఈ సినిమాలో అమితాబ్ నటించిన రోల్ లో చిరంజీవి నటించారు.
ఈ సినిమాలో సుజాత, చిరంజీవి ప్రేమికులుగా కనిపించి మెప్పించారు. ఈ సినిమా తరువాత 1982 లో సీతాదేవి అనే సినిమా విడుదల అయ్యింది. ఈ సినిమాలో సుజాత మెగాస్టార్ చిరంజీవికి చెల్లెలిగా కనిపిస్తారు. ఈ సినిమాకు ఈరంకి శర్మ దర్శకత్వం వహించారు. తరువాత విజయ బాపినీడు దర్శకత్వంలో బిగ్ బాస్ అనే సినిమా విడుదల అయ్యింది. ఈ సినిమాలో చిరు, సుజాత తల్లీ కొడుకులుగా నటించి అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తారు. అయితే.. ఏ రోల్ లో నటించినా వీరిని అభిమానులు ఆదరించారనే చెప్పాలి.




రీసెంట్ గా ‘బిహైండ్ వుడ్స్’ అవార్డ్స్ వేడుక జరిగిన విషయం తెలిసిందే. ఈ వేడుకలో సినీ సెలబ్రిటీలు హాజరు అయ్యారు. ఇక ఈ వేడుకకు అల్లు అర్జున్ కూడా హాజరయ్యారు. ఈ అవార్డ్స్ ప్రధానంలో భాగంగా ‘గోల్డెన్ ఐకాన్ ఆఫ్ ఇండియన్ సినిమా’ అవార్డ్ కు అల్లు అర్జున్ ఎంపిక కాగా, మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ ఈ అవార్డ్ ను బన్నీకి అందచేశారు. అవార్డ్ తీసుకున్న తరువాత అల్లు అర్జున్ మాట్లాడుతుండగా వేదిక పైకి తన చిన్ననాటి స్కూల్ టీచర్ రావడంతో అల్లు అర్జున్ ఆశ్చర్యపోయారు. అలాగే టీచర్ కి పాదాలకి నమస్కరించారు.
బన్నీ తన టీచర్ గురించి మాట్లాడుతూ “ఆమె పేరు అంబికా కృష్ణన్, 3వ తరగతిలో క్లాస్ టీచర్ అని, ఆమె తనకు చాలా విషయాలను నేర్పించారని తెలిపారు. మా తరగతిలో నేనే లాస్ట్ ర్యాంకర్ ను, అయినప్పటికీ తన టీచర్ ఎప్పుడు తనని ఏమి అనలేదని, లైఫ్ అంటే చదువు ఒక్కటే కాదని, జీవితం ప్రతి ఒక్కరికీ వరమని, దాన్ని అర్థం చేసుకుంటే తప్పకుండా నువ్వు గొప్ప స్థానానికి వెళ్తావని చెప్పేవారని” అన్నారు. తన టీచర్ ను ఇలా ఇక్కడ కలవడం చాలా ఆనందంగా ఉందని వెల్లడించారు.
తనకు చిన్నతనం నుండి స్ఫూర్తి నింపే విధంగా చిన్న చిన్న కోట్స్ రాసే అలవాటు ఉంది. తాను రాసిన కోట్స్ లో ‘only kindness is remembered forever’ కోట్ రాయడానికి స్ఫూర్తి నా టీచరే అని వెల్లడించారు. అల్లు అర్జున్ తన టీచర్ గురించి మాట్లాడిన ఈ వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ గా మారింది.
పవన్ కల్యాణ్ పేరు వింటేనే ఆయన ఫ్యాన్స్ ఊగిపోతుంటారు. తెలుగు రాష్ట్రాల్లో పవర్ స్టార్ కు ఉన్న క్రేజ్ అందరికి తెలిసిందే. ఇక దర్శకుడు హరీష్ శంకర్ కూడా పవన్ కల్యాణ్ కు వీరాభిమాని. ఒక ఫ్యాన్ తమ అభిమాన హీరోతో మూవీ తీస్తే ఎలా ఉంటుందో ‘గబ్బర్ సింగ్’ తో హరీష్ శంకర్ నిరూపించాడు. ఇప్పుడు అదే విషయాన్ని ఇంకా గట్టిగా చెప్పేందుకు ‘ఉస్తాద్ భగత్ సింగ్’ తో రానున్నాడు.
సరిగ్గా 11 సంవత్సరాల తరువాత వీరి కాంబోలో ఉస్తాద్ భగత్ సింగ్ అనే చిత్రం తెరకెక్కుతుంది. గబ్బర్ సింగ్ మూవీ విడుదల అయ్యి నిన్నటికి (మే 11 ) పదకొండు ఏళ్లు పూర్తి అవుతున్న సందర్భంగా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీ గ్లింప్స్ మూవీ యూనిట్ విడుదల చేసింది. హరీష్ శంకర్ తన అభిమాన హీరోని వెండితెర పై ఆవిష్కరించిన విధానానికి ఈ గ్లింప్స్ స్మాల్ టచ్ అని, మూవీ నెక్ట్స్ లెవెల్ లో ఉంటుందని తెలుస్తుంది.
ఈ గ్లింప్స్ మాస్ పోలీస్ ఆఫీసర్గా పవన్ కనిపిస్తున్నారు. “ఈసారి పెర్ఫార్మన్స్ బద్దలైపోతుంది” అని పవర్ స్టార్ చెప్పే డైలాగ్ హైలైట్ గా నిలిచింది. ఈ గ్లింప్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. దాంతో సోషల్ మీడియా వేదికగా అటు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, ఇటు టాలీవుడ్ సెలెబ్రెటీలు హరీష్ శంకర్ కు అభినందనలు తెలుపుతున్నారు.
అయితే రవితేజ పేరు ఉన్న ట్విట్టర్ ఖాతా నుండి ఒక యూజర్ “హరీష్ ఈసారి గబ్బర్ సింగ్ కంటే పెద్దగా ప్లాన్ చేస్తున్నావు. గుడ్ లక్” అని పోస్ట్ పెట్టారు. ఆ ఖాతాకి బ్లూ టిక్ ఉండడంతో హీరో మాస్ మహారాజ రవితేజ పోస్ట్ అనుకున్న హరీష్ శంకర్ ఎమోషనల్ గా, “అన్నయ్యా ఈ మొక్క నువ్వు నాటిన మొక్క.. ఎన్నిసార్లయినా చెప్తా ఇదే ముక్క” అని రిప్లై ఇచ్చారు. అయితే అది హీరో రవితేజ అకౌంట్ కాకపోవడంతో ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. చూసుకోవాలి కదా అన్నా అంటూ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు.

రివ్యూ:
తొలి సీజన్ ఆరు-ఎపిసోడ్ల సిరీస్. స్టోరీ మొదలైన విధానం బాగున్నప్పటికీ, అదే ఇంటెన్సిటీ తో చివరి వరకు కొనసాగించలేకపోయారు. దర్శకుడు హీరో పాత్ర ద్వారా ఏం చెప్పాలని అనుకున్నాడో క్లారిటీ లేదు.రిపీటెడ్ సన్నివేశాలు, పొలిటికల్ సన్నివేశాలు అంతగా పండలేదు.నవదీప్, బిందుమాధవి పాత్రల నటన తప్ప మిగిలిన క్యారెక్టర్స్ నటన సహజంగా అనిపించదు. కథలో ఎస్ఐ ఎడ్విన్ పాత్ర ఎంట్రీ తరువాత కథనం కాస్త ఊపందుకుంది.
తొలి సీజన్ చివరలో ఎస్ఐకు శివకు మధ్య గొడవతో ఎండ్ చేయడంతో సీజన్ 2 పై కొంచెం ఇంట్రెస్ట్ వచ్చింది. జర్నలిస్ట్ శివగా సీరియస్గా ఉండే పాత్రలో నవదీప్ ఒదిగిపోయాడు.సెటిల్డ్ పెర్ఫామెన్స్ ఇచ్చాడు. శివను ఇష్టపడే నీల పాత్రలో బిందుమాధవి నటించింది. కానీ ఈ పాత్రకు తొలి సీజన్లో అంతగా ఇంపార్టెన్స్ లేదు. పోలీస్ ఆఫీసర్ ఎడ్విన్ క్యారెక్టర్ లో నంద గోపాల్ నటన అద్బుతంగా ఉంది. శివ స్నేహితులు నటన,కొన్ని డైలాగ్స్ ఆకట్టుకున్నాయి.
మైనస్ పాయింట్స్ :





రవితేజ నటించిన రావణాసుర మూవీ రీసెంట్ గా విడుదలై, ప్లాప్ గా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే రవితేజ తాజాగా తన పారితోషికాన్ని భారీగా పెంచినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇంతకుముందు రవితేజ ఒక్కో మూవీకి 15 కోట్లు రెమ్యూనరేషన్ అందుకునేవారంట. అయితే ప్రస్తుతం 25 కోట్లు నిర్మాతలను డిమాండ్ చేస్తున్నారట. రీసెంట్ గా కలర్ ఫోటో దర్శకుడు సందీప్ రాజ్ తో రవితేజ ఒక సినిమాను చేయడానికి ఒకే చెప్పాడు. ఇక ఈ చిత్రం కోసం 25 కోట్లు పారితోషికం అడిగినట్లు సమాచారం.
రవితేజ డిమాండ్ కి మొదట ప్రొడ్యూసర్స్ షాక్ అయినప్పటికి, ఆ తర్వాత రవితేజ అడిగినంత ఇవ్వడానికి అంగీకరించారని సినీ వర్గాలలో టాక్. ప్రస్తుతం ఉన్న యువ స్టార్ హీరోలు 25 – 50 కోట్ల వరకు పారితోషకం తీసుకుంటున్నారు. ఇక ఇప్పుడు వాళ్ల కంటే కొంచెం సీనియర్ హీరో రవితేజ రెమ్యూనరేషన్ ఈ రేంజ్ లో డిమాండ్ చేయడం ఇండస్ట్రీ వర్గాల్లో ఇంట్రెస్టింగ్ గా మారింది.
ఇటీవల రవితేజ సినిమా రావణాసుర ప్లాప్ అయినా ఆయన పారితోషికం పెంచడం టాలీవుడ్ లో హాట్ టాపిక్ అయ్యింది. రవితేజ ప్రస్తుతం ‘టైగర్ నాగేశ్వరరావు’ మూవీ షూటింగ్ పూర్తి చేసి, నెక్స్ట్ మూవీ ‘ఈగల్’ షూటింగ్ లో బిజీ బిజీగా ఉన్నాడు. సినిమాటోగ్రాఫర్ అయిన కార్తీక్ ఘట్టమనేని ‘ఈగల్’ మూవీతో డైరెక్టర్ గా మారుతున్నారు. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 20న రిలీజ్ కాబోతోంది.















